NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / India-China:అమెరికా సుంకాలను ఎదుర్కొనేందుకు భారతదేశం, చైనా కలిసి నిలబడాలి: బీజింగ్‌ అధికార ప్రతినిధి పోస్ట్‌ వైరల్‌
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    India-China:అమెరికా సుంకాలను ఎదుర్కొనేందుకు భారతదేశం, చైనా కలిసి నిలబడాలి: బీజింగ్‌ అధికార ప్రతినిధి పోస్ట్‌ వైరల్‌
    అమెరికా సుంకాలను ఎదుర్కొనేందుకు భారతదేశం, చైనా కలిసి నిలబడాలి

    India-China:అమెరికా సుంకాలను ఎదుర్కొనేందుకు భారతదేశం, చైనా కలిసి నిలబడాలి: బీజింగ్‌ అధికార ప్రతినిధి పోస్ట్‌ వైరల్‌

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 09, 2025
    09:42 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య యుద్ధ భయాలు పెరిగిపోతున్నాయి.

    ముఖ్యంగా చైనాపై 104 శాతం టారిఫ్‌లు విధించడమంతే ఈ ఆర్థికంగా అస్థిరత కలిగిన సమయంలో పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చింది.

    ఈ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, చైనా అధికార ప్రతినిధి ఒకరు కీలక వ్యాఖ్యలు చేశారు.

    ట్రంప్ సుంకాల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు భారత్, చైనా కలిసి ముందడుగు వేయాలని, న్యూఢిల్లీలోని బీజింగ్ ఎంబసీ అధికార ప్రతినిధి యూ జింగ్ పిలుపునిచ్చారు.

    ఈమె చేసిన ప్రకటన సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.

    వివరాలు 

    వాణిజ్య యుద్ధాల్లో విజేతలు ఎవరూ ఉండరు

    ట్రంప్ విధించిన సుంకాల నేపథ్యంతో భారత్-చైనా మధ్య ఆర్థిక సంబంధాల ప్రాధాన్యతను ఆమె ప్రస్తావించారు.

    ''ఇరు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య సంబంధాలు పరస్పర సహకారం,పరస్పర ప్రయోజనాలపై ఆధారపడి ఉన్నాయి. అమెరికా విధిస్తున్న సుంకాల ఒత్తిడితో అనేక దేశాలు, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు, తమ అభివృద్ధి సాధించే హక్కును కోల్పోతున్నాయి. ఈ క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొనేందుకు భారత్-చైనా కలిసి నిలబడాలి. వాణిజ్య యుద్ధాల్లో విజేతలు ఎవరూ ఉండరు. అంతర్జాతీయంగా సంప్రదింపుల ఆధారంగా రూపొందించిన విధానాలను అన్ని దేశాలు గౌరవించాల్సిన అవసరం ఉంది. ఏకపక్షంగా తీసుకునే రక్షణాత్మక నిర్ణయాలను సమూహంగా వ్యతిరేకించాలి'' అని ఆమె స్పష్టం చేశారు.

    వివరాలు 

     చైనా దిగుమతులపై మొత్తం సుంకాల రేటు 104 శాతం 

    ఇటీవల ట్రంప్ ప్రభుత్వం భారత్, చైనా తదితర అనేక దేశాలపై సుంకాలు విధించిన విషయం తెలిసిందే.

    భారత్‌పై 26 శాతం,చైనాపై అదనంగా 34శాతం టారిఫ్‌లు వసూలు చేయనున్నట్టు ప్రకటించారు.

    అంతకుముందే చైనాపై ఇప్పటికే 20శాతం సుంకాలు అమలులో ఉండడంతో,మొత్తం టారిఫ్‌ రేటు 54 శాతానికి పెరిగింది.

    ఈ చర్యలపై ప్రతిగా చైనా కూడా అమెరికా నుంచి దిగుమతయ్యే పలు ఉత్పత్తులపై 34 శాతం అదనపు సుంకాలను విధించేందుకు సిద్ధమైంది.

    దీనిపై ట్రంప్ కాస్త ఘాటుగా స్పందిస్తూ,తమ టారిఫ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు.

    అయితే చైనా వెనక్కి తగ్గకపోవడంతో,ట్రంప్ మరో 50శాతం అదనపు సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించారు.

    ఈ తాజా నిర్ణయంతో చైనా దిగుమతులపై మొత్తం సుంకాల రేటు 104శాతానికి చేరుకుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చైనా

    తాజా

    India vs America: అమెరికా 10% సుంకాన్ని ఉపసంహరించకపోతే ప్రతీకార చర్యలు తప్పవు : భారత్ అమెరికా
    Colombia: కొలంబియా అధ్యక్ష అభ్యర్థిపై హత్యాయత్నం.. ప్రచార సభలో కాల్పులు కొలంబియా
    Lalithaa Jewellery: రూ.1700 కోట్లతో స్టాక్ మార్కెట్‌లోకి లలితా జువెలరీ.. తొలిసారిగా ఐపీఓ దిశగా అడుగులు ఐపీఓ
    Maganti Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూత బీఆర్ఎస్

    చైనా

    China: చైనా మరో భారీ ప్రాజెక్ట్ కి శ్రీకారం.. సోలార్‌ గ్రేట్‌వాల్‌ నిర్మాణం  నాసా
    China: 100Gbps లేజర్ టెక్‌తో 6G రేస్‌లో స్టార్‌లింక్‌ను ఓడించిన చైనా..!  టెక్నాలజీ
    China: కొవిడ్​ తరహా లక్షణాలతో.. చైనాలో కొత్త వైరస్‌ కలకలం.. భారీ సంఖ్యలో ఆసుపత్రులకు క్యూ కడుతున్న జనం  అంతర్జాతీయం
    China Bans American Companies: చైనా-అమెరికా సంబంధాల్లో కొత్త మలుపు.. అమెరికన్ డిఫెన్స్ కంపెనీలపై చైనా ఆంక్షలు. అమెరికా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025