NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Pakistanis in India: కేంద్రం కీలక ఆదేశం.. వందలాది పాకిస్థానీ పౌరులకు తాత్కాలిక ఊరట
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Pakistanis in India: కేంద్రం కీలక ఆదేశం.. వందలాది పాకిస్థానీ పౌరులకు తాత్కాలిక ఊరట
    కేంద్రం కీలక ఆదేశం.. వందలాది పాకిస్థానీ పౌరులకు తాత్కాలిక ఊరట

    Pakistanis in India: కేంద్రం కీలక ఆదేశం.. వందలాది పాకిస్థానీ పౌరులకు తాత్కాలిక ఊరట

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 01, 2025
    12:21 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశంలో నివాసం ఉంటున్న పాకిస్థాన్ పౌరుల స్వదేశానికి పంపింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

    ఈ మేరకు, వారు ఏప్రిల్ 30లోగా దేశం విడిచి వెళ్లాల్సిందని పూర్వంలో నిర్ణయించిన గడువును కేంద్ర హోం శాఖ సవరించింది.

    తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ పంజాబ్‌లోని అట్టారీ-వాఘా సరిహద్దు గుండా పాక్ పౌరులు తమ దేశానికి వెళ్లే అనుమతిని కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది.

    ఈ నిర్ణయం వల్ల సరిహద్దులో చిక్కుకున్న వందలాది పాకిస్తానీయులు, వారి కుటుంబాలకు తాత్కాలిక ఊరట లభించినట్లు భావిస్తున్నారు.

    వివరాలు 

    నేను చేసిన తప్పేంటి? మమ్మల్ని ఎందుకు శిక్షిస్తున్నారు?

    ఇటీవల పహల్గామ్‌లో జరిగిన దాడి అనంతరం భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో, దేశంలో ఉన్న పాక్ పౌరులు ఏప్రిల్ 30లోగా భారత్ విడిచి వెళ్లాలన్న ఆదేశాలు కేంద్రం గతంలో జారీ చేసింది.

    ఆ తర్వాత సరిహద్దును మూసివేస్తామని కూడా ప్రకటించింది. ఈ ఆకస్మిక నిర్ణయంతో చాలా మంది, ముఖ్యంగా భారతీయులను వివాహం చేసుకున్న పాకిస్తాన్ పౌరులు, దీర్ఘకాలిక వీసాల కోసం ఎదురుచూస్తున్నవారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

    వారిలో చాలామంది తమపై అన్యాయం జరుగుతోందని, కుటుంబాల నుండి బలవంతంగా వేరు చేస్తున్నారని వాపోయారు.

    ఓ పాకిస్తాన్ మహిళ సమీరన్ మాట్లాడుతూ, "నేను చేసిన తప్పేంటి? మమ్మల్ని ఎందుకు శిక్షిస్తున్నారు?" అంటూ ప్రశ్నించారు.

    వివరాలు 

    అట్టారీ సరిహద్దులో విషాద ఘటన 

    ఈ సరిహద్దు గడువు కారణంగా అట్టారీ ప్రాంతంలో తీవ్ర గందరగోళం, విషాద ఘటన ఏర్పడింది.

    ఏప్రిల్ 30న ఓ దురదృష్టకర సంఘటన చోటు చేసుకుంది. 1980 నుంచీ భారత్‌లో నివసిస్తున్న 80 ఏళ్ల పాకిస్తాన్ పౌరుడు అబ్దుల్ వహీద్ భట్, వెనక్కి పంపే ప్రక్రియ కోసం బస్సులో వేచి చూస్తుండగా మృతిచెందారు.

    ఈ ఘటన వృద్ధులపై బహిష్కరణ చర్యల వల్ల పడుతున్న శారీరక, మానసిక వత్తిడిని స్పష్టంగా చూపిస్తోంది.

    గత వారం రోజులలో అట్టారీ సరిహద్దు గుండా 237 మంది పాక్ పౌరులు వెనక్కి పంపించినట్లు అధికారులు వెల్లడించారు.

    వివరాలు 

    ఇప్పటివరకు వెనక్కి వెళ్లిన పాక్ పౌరుల సంఖ్య 

    ఏప్రిల్ నెల చివరి నుండి ప్రారంభమైన ఈ ప్రక్రియలో ఇప్పటివరకు మొత్తం 537 మందిని స్వదేశానికి పంపినట్టు సమాచారం.

    ఇదే సమయంలో పాకిస్తాన్ నుండి భారత పౌరులు కూడా తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది.

    వైద్య వీసాలపై వచ్చినవారికి తొలుత మినహాయింపు ఇవ్వబడినప్పటికీ,ఇతర వర్గాలకు చెందిన అనేక మంది ఈ ఆదేశాలతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

    దీనితో మానవతా కోణంలో ఆలోచించాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.

    తాజాగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గడువును తాత్కాలికంగా నిలిపివేయడం వల్ల, ప్రభావిత కుటుంబాలకు కొంత ఉపశమనం లభించింది.

    అయినప్పటికీ, తదుపరి ఆదేశాలు వెలువడే వరకు వారు నిరీక్షణలో ఉండాల్సిన అవసరం ఉంది. సరిహద్దుకు ఇరువైపులా ఉన్న అనేక మంది తమ భవిష్యత్తుపై ఇంకా అనిశ్చితిలోనే ఉన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేంద్ర ప్రభుత్వం

    తాజా

    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా
    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్

    కేంద్ర ప్రభుత్వం

    Nirmala Sitharaman: భారీగా పన్ను మినహాయించడానికి కారణమిదే.. నిర్మాలా సీతారామన్ వివరణ నిర్మలా సీతారామన్
    Vizag Railway Zone: ఏపీకి కేంద్రం బంపర్ ఆఫర్.. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌, ఉత్తర్వులు జారీ  ఆంధ్రప్రదేశ్
    Not Indians: వలసదారుల చేతికి సంకెళ్ళు, గొలుసులు.. కేంద్రం క్లారిటీ  భారతదేశం
    Nitin Gadkari : వాహనదారులకు గుడ్ న్యూస్.. టోల్‌ ఛార్జీలపై భారీ ఉపశమనం..? నితిన్ గడ్కరీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025