NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Delhi: మయన్మార్ భూకంప బాధితులకు భారత్ తక్షణ సహాయం
    తదుపరి వార్తా కథనం
    Delhi: మయన్మార్ భూకంప బాధితులకు భారత్ తక్షణ సహాయం
    మయన్మార్ భూకంప బాధితులకు భారత్ తక్షణ సహాయం

    Delhi: మయన్మార్ భూకంప బాధితులకు భారత్ తక్షణ సహాయం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 29, 2025
    11:52 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భూకంపాలతో మయన్మార్, థాయిలాండ్ వణికిపోగా, కష్టకాలంలో వారికి భారత్‌ సహాయహస్తం అందించింది.

    శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ స్పందించి, ఈ దేశాలకు అండగా ఉంటామని ప్రకటించారు. ఆయన పిలుపు మేరకు భారత విదేశాంగ శాఖ తక్షణమే చర్యలు చేపట్టింది.

    మోడీ ఆదేశాలతో దాదాపు 15 టన్నుల సహాయ సామగ్రిని మయన్మార్‌కు రవాణా చేశారు.

    భారత వాయుసేనకు చెందిన C130J ప్రత్యేక విమానం, హిండన్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ నుంచి బయల్దేరిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

    Details

    ఇప్పటివరకూ 1000 మంది మృతి

    ఈ సహాయ సామగ్రిలో ఆహార పదార్థాలు, తాత్కాలిక నివాసానికి అవసరమైన టెంట్లు, స్లీపింగ్‌ బ్యాగ్స్‌, వాటర్‌ ప్యూరిఫయర్లు, సోలార్‌ ల్యాంప్స్‌, జనరేటర్లు, అత్యవసర వైద్య పరికరాలు ఉన్నాయి.

    తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల్లో బాధితులకు వీటి ద్వారా తక్షణ సహాయం అందించనున్నట్లు అధికారులు తెలిపారు.

    శుక్రవారం మధ్యాహ్నం సంభవించిన భూకంపాల ధాటికి మయన్మార్, థాయిలాండ్‌ గజగజ వణికిపోయాయి. భారీ భవనాలు నేలమట్టమయ్యాయి.

    ఇప్పటివరకు 1000 మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గాయపడ్డారు. వేలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రెస్క్యూ టీమ్‌లు సహాయ చర్యలను ముమ్మరం చేస్తున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మయన్మార్
    భూకంపం

    తాజా

    P Chidambaram:: 'ఇండియా అలయన్స్ వేస్ట్'.. 2029 లో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం  ఇండియా కూటమి
    TVS: 2025 టీవీఎస్ ఐక్యూబ్ లాంచ్.. ధర తగ్గింది.. రేంజ్ పెరిగింది! టీవీఎస్ మోటార్
    Gold Rate Today: రెండు రోజుల ఆనందానికి బ్రేక్.. బంగారం ధరలు మళ్లీ పెరిగాయ్! బంగారం
    Rohit Sharma: నేటి నుంచి వాంఖ‌డేలో అందుబాటులోకి రానున్న 'రోహిత్ శ‌ర్మ' స్టాండ్ రోహిత్ శర్మ

    మయన్మార్

    పజిగి గ్రామంపై మయన్మార్ మిలిటరీ వైమానిక దాడి; 100మంది మృతి విమానం
    తుపానుకు 'మోచా' పేరు ఎలా పెట్టారు? అది ఎప్పుడు తీరాన్ని తాకుతుంది?  ఐఎండీ
    మోచా తుపాను: మయన్మార్‌లో ఆరుగురు మృతి, 700 మందికి గాయాలు  తుపాను
    మయన్మార్ నుంచి సేకరించిన ఆయుధాలతోనే మణిపూర్‌లో హింస: ఇంటెలిజెన్స్ వర్గాలు  మణిపూర్

    భూకంపం

    Earthquake: ఇరాన్‌లో భారీ భూకంపం.. 4గురు మృతి,120 మందికి గాయలు  ఇరాన్
    Calfornia: కాలిఫోర్నియాలో భూకంపం.. 4.1 తీవ్రత   కాలిఫోర్నియా
    Maharastra: మహారాష్ట్రలోని హింగోలిలో 4.5 తీవ్రతతో భూప్రకంపనలు మహారాష్ట్ర
    Japan Earthquake: జపాన్‌లో 7.1 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ  జపాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025