India aid: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. గాజాకు రెండో విడత సాయాన్ని పంపిన భారత్
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో గాజాలోని పాలస్తీనీయుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అయితే గాజాలోని పాలస్తీనీయులకు ఆదుకునేందుకు భారత్ రెండో విడత సాయన్ని పంపింది. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ధృవీకరించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. తాము పాలస్తీనా ప్రజలకు మానవతా సహాయాన్ని అందజేస్తూనే ఉన్నట్లు ట్విట్టర్( ఎక్స్)లో పేర్కొన్నారు. భారత వైమానిక దళానికి చెందిన C17 విమానం 32 టన్నుల సాయంతో ఈజిప్ట్లోని ఎల్-అరిష్ విమానాశ్రయానికి బయలుదేరిందని జైశంకర్ వెల్లడించారు. అక్టోబర్ 22న భారత్ పాలస్తీనాకు వైద్య, విపత్తు సామగ్రితో మొదటి విడద సాయాన్ని పంపింది.