NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Deeply Troubling: యూఎస్‌ఎయిడ్‌పై భారత్‌ ఆందోళన.. సంబంధిత ఏజెన్సీలు దర్యాప్తు  
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Deeply Troubling: యూఎస్‌ఎయిడ్‌పై భారత్‌ ఆందోళన.. సంబంధిత ఏజెన్సీలు దర్యాప్తు  
    యూఎస్‌ఎయిడ్‌పై భారత్‌ ఆందోళన.. సంబంధిత ఏజెన్సీలు దర్యాప్తు

    Deeply Troubling: యూఎస్‌ఎయిడ్‌పై భారత్‌ ఆందోళన.. సంబంధిత ఏజెన్సీలు దర్యాప్తు  

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 21, 2025
    05:26 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశ ఎన్నికల్లో జోక్యం చేసుకోవడంపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

    మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌ భారతదేశంలో ఓటింగ్‌ను ప్రభావితం చేసేందుకు రూ.182 కోట్ల నిధులను కేటాయించారని ట్రంప్‌ ఆరోపించారు.

    ఈ వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం స్పందిస్తూ, యూఎస్‌ఎయిడ్‌ (USAID) ఎన్నికలపై ప్రభావం చూపేందుకు ప్రయత్నించిందనే వార్తలు ఆందోళనకరంగా ఉన్నాయని పేర్కొంది.

    ఈ వ్యవహారంపై సంబంధిత అధికార విభాగాలు దృష్టి సారించాయి అని వెల్లడించింది.

    వివరాలు 

    స్పందించిన రణ్‌ధీర్‌ జైశ్వాల్‌

    భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైశ్వాల్‌ మాట్లాడుతూ, "యూఎస్‌ నిధులు, కార్యకలాపాలకు సంబంధించి అమెరికా అధికార యంత్రాంగం వెల్లడించిన వివరాలను పరిశీలిస్తున్నాం. ఇవి భారత్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునేలా కనిపిస్తున్నాయి. ప్రస్తుత దశలో దీనిపై తక్షణ నిర్ణయం ప్రకటించడం తొందరపాటు అవుతుంది. సంబంధిత అధికారుల నుండి పూర్తి సమాచారం వచ్చిన తర్వాత మాత్రమే మరిన్ని వివరాలు వెల్లడిస్తాం" అని అన్నారు.

    వివరాలు 

    బైడెన్‌ ప్రభుత్వం చేసిన ప్రయత్నంగా..

    ట్రంప్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత, అమెరికా విదేశాంగ సహాయ నిధులను పునఃసమీక్షిస్తున్నట్లు ప్రకటించారు.

    ఇందులో భాగంగా యూఎస్‌ఎయిడ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. భారత్‌లో ఓటింగ్‌ శాతం పెంచేందుకు యూఎస్‌ఎయిడ్‌ 21 మిలియన్‌ డాలర్లు ఖర్చు చేసింది అని ఆయన తెలిపారు.

    "ఇది ఎవరో ఒకరిని గెలిపించేందుకు బైడెన్‌ ప్రభుత్వం చేసిన ప్రయత్నంగా కనిపిస్తోంది. ఈ విషయాన్ని భారత్‌కు తెలియజేయాల్సిన అవసరం ఉంది," అని ట్రంప్‌ పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విదేశాంగశాఖ

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    విదేశాంగశాఖ

    MEA Memo: భారతీయ దౌత్యవేత్తలపై 'రహస్య మెమో'.. స్పదించిన విదేశాంగ శాఖ భారతదేశం
    Chinmoy Krishna Das: చిన్మోయ్‌ కృష్ణదాస్‌ అరెస్టుపై స్పందించిన భారత్‌ ఇస్కాన్
    Champions Trophy 2025: ఛాంపియన్స్‌ ట్రోఫీ.. పాకిస్థాన్‌కు భారత జట్టు వెళ్లడంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత  క్రీడలు
    Jaishankar: ఉగ్రవాదమే ఆ దేశాన్ని తినేస్తోంది.. పాకిస్థాన్‌పై మరోసారి మండిపడ్డ జైశంకర్ కేంద్ర ప్రభుత్వం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025