NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / దేశంలోనే మొదటి 'వాటర్ మెట్రో' కేరళలో ఏర్పాటు; దాని విశేషాలను తెలుసుకోండి 
    తదుపరి వార్తా కథనం
    దేశంలోనే మొదటి 'వాటర్ మెట్రో' కేరళలో ఏర్పాటు; దాని విశేషాలను తెలుసుకోండి 
    దేశంలోనే మొదటి 'వాటర్ మెట్రో' కేరళలో ఏర్పాటు; దాని విశేషాలను తెలుసుకోండి

    దేశంలోనే మొదటి 'వాటర్ మెట్రో' కేరళలో ఏర్పాటు; దాని విశేషాలను తెలుసుకోండి 

    వ్రాసిన వారు Stalin
    Apr 23, 2023
    01:28 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఏప్రిల్ 25న కేరళలోని కొచ్చిలో భారతదేశపు మొట్టమొదటి వాటర్ మెట్రోను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.

    ఈ ప్రాంతంలో ఆర్థిక, పర్యాటకాభివృద్ధి కోసం ఇది ఎంతో దోహదం చేస్తుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. జాతికి అంకితం చేయనున్న ఈ వాటర్ మెట్రోకు సంబంధించిన విశేషాలను తెలుసుకుందాం.

    వాటర్ మెట్రో అనేది సాధారణ మెట్రో వ్యవస్థలాగే ఉంటుంది. ఇది పట్టణ రవాణా కోసం వినియోగించే వ్యవస్థ మాదిరిగా ఉంటుందని, కొచ్చి వంటి నగరాల్లో మెట్రో ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి.

    కొచ్చిలో రూ.1,136.83 కోట్లతో ఏర్పాటు చేసిన మెట్రో చుట్టుపక్కల ఉన్న 10 దీవులను కలుపుతుంది. కొచ్చి అభివృద్ధిని వేగవంతం చేయడానికి ఈ ప్రాజెక్ట్ దోహపడుతుందని కేరళ సీఎం విజయన్ వ్యాఖ్యానించారు.

    వాటర్ మెట్రో

    78 ఎలక్ట్రిక్ బోట్లు, 38 టెర్మినల్స్‌తో వాటర్ మెట్రో నిర్మాణం

    వాటర్ మెట్రో అనేది కేరళ కలల ప్రాజెక్టు. దీనిలో భాగంగా 78 ఎలక్ట్రిక్ బోట్లు, 38 టెర్మినల్స్‌తో వాటర్ మెట్రోను నిర్మించారు.

    కేరళ ప్రభుత్వం, జర్మన్ ఫండింగ్ ఏజెన్సీ కేఎఫ్‌డబ్ల్యూ ఆధ్వర్యంలో మెట్రో నిర్మాణం జరిగినట్లు ముఖ్యమంత్రి విజయన్ పేర్కొన్నారు.

    ప్రాజెక్ట్ మొదటి దశలోనే హైకోర్టు-వైపిన్, వైట్టిల-కక్కనాడ్ టెర్మినల్స్ సేవలు ప్రారంభమవుతాయి. ఎయిర్ కండిషన్డ్ బోట్ల మెట్రోలో ప్రయాణం చాలా సురక్షితమని, తక్కువ ఖర్చుతో కూడుకున్నదని విజయన్ ఈ మేరకు ట్వీట్ చేశారు.

    ట్రాఫిక్‌ రద్దీలో చిక్కుకోకుండా ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి కూడా ఇది దోహదపడుతుందని ముఖ్యమంత్రి విజయన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేరళ
    తాజా వార్తలు
    ప్రధాన మంత్రి

    తాజా

    Operation Sindoor: ఉగ్రవాదం నిర్మూలనకే 'ఆపరేషన్‌ సిందూర్‌' : భారత సైన్యం భారత సైన్యం
    INDw vs SLw: మహిళల ముక్కోణపు వన్డే టైటిల్ భారత్‌దే స్మృతి మంధాన
    operation sindoor: ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు : భారత్  ఆపరేషన్‌ సిందూర్‌
    HYD Metro: ప్రపంచానికి బ్లూప్రింట్‌గా హైదరాబాద్ మెట్రో.. హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రశంసలు! హైదరాబాద్

    కేరళ

    ఆపరేషన్ 'పీఎఫ్ఐ'.. కేరళ వ్యాప్తంగా ఎన్ఐఏ దాడులు భారతదేశం
    కేరళలో మరో సంపన్న ఆలయం.. గురువాయూర్ గుడి బ్యాంకు డిపాజిట్లు ఎన్ని రూ.వేల కోట్లో తెలుసా? భారతదేశం
    ఇక ఉపాధ్యాయులను 'సార్', 'మేడమ్' అని పిలవరు, కేరళ పాఠశాలల్లో కొత్త ఒరవడి భారతదేశం
    కాంగ్రెస్‌కు షాకిచ్చిన ఏకే ఆంటోనీ కొడుకు అనిల్, మోదీకి మద్దతుగా పార్టీకి రాజీనామా కాంగ్రెస్

    తాజా వార్తలు

    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు వీరే  కర్ణాటక
    'స్వలింగ వివాహం అర్బన్ కాన్సెప్ట్ కాదు'; కేంద్రం వాదనలను వ్యతిరేకించిన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    రంజాన్ దాతృత్వ పంపిణీలో తొక్కిసలాట, 85మంది మృతి  వరల్డ్ లేటెస్ట్ న్యూస్
    తెలంగాణ: ప్రభుత్వ బడుల్లో వర్చువల్ రియాలిటీ ల్యాబ్‌లు; విద్యార్థులకు ఇక 3డీలో పాఠాలు తెలంగాణ

    ప్రధాన మంత్రి

    సాంకేతికత సాయంతో 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు; ప్యానెల్ ఏర్పాటు సుప్రీంకోర్టు
    సవాళ్లను ఎదుర్కోవడంలో గ్లోబల్ గవర్నెన్సీ విఫలం: ప్రధాని మోదీ జీ20 సమావేశం
    నేడు రాత్రి 7గంటలకు జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025