NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / భారత్‌కు సౌదీ అత్యంత వ్యూహాత్మక భాగస్మామి: ద్వైపాక్షిక భేటీలో ప్రధాని మోదీ 
    తదుపరి వార్తా కథనం
    భారత్‌కు సౌదీ అత్యంత వ్యూహాత్మక భాగస్మామి: ద్వైపాక్షిక భేటీలో ప్రధాని మోదీ 
    భారత్‌కు సౌదీ అత్యంత వ్యూహాత్మక భాగస్మామి: ద్వైపాక్షిక భేటీలో ప్రధాని మోదీ

    భారత్‌కు సౌదీ అత్యంత వ్యూహాత్మక భాగస్మామి: ద్వైపాక్షిక భేటీలో ప్రధాని మోదీ 

    వ్రాసిన వారు Stalin
    Sep 11, 2023
    03:55 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రధాని నరేంద్ర మోదీ, సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ సోమవారం దిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ద్వైపాక్షిక చర్చలు జరిపారు.

    ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. భారతదేశానికి సౌదీ అరేబియా అత్యంత ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వాములలో ఒకటన్నారు.

    శాంతి, స్థిరత్వం కోసం రెండు దేశాల మధ్య పరస్పర సహకారం అవసరమని మోదీ పేర్కొన్నారు.

    ఈ చర్చల సందర్భంగా, తమ భాగస్వామ్యాన్ని మరింత స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు చెప్పారు.

    ఇందుకోసం కీలక అంశాలను గుర్తించామన్నారు. ఈ అంశాలు ఇరు దేశాల మధ్య సంబంధాలకు కొత్త శక్తిని, దిశను అందిస్తాయని మోదీ అన్నారు.

    అంతేకాకుండా మానవాళి సంక్షేమం కోసం కలిసి పనిచేయడానికి ప్రేరణగా నిలుస్తాయని వివరించారు.

    details

    రెండు దేశాల ఆర్థికాభివృద్ధికి ఎకనామిక్ కారిడార్ దోహదం: మోదీ

    భారత్-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ గురించి కూడా ప్రధాని మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు.

    ఇది రెండు దేశాలను అనుసంధానించడమే కాకుండా ఆర్థిక వృద్ధిని అందించడంలో దోహదపడుతుందన్నారు.

    ఆసియా, పశ్చిమాసియా, యూరప్ మధ్య డిజిటల్ కనెక్టివిటీని పెంపొందించడంలో దోహదపడుతుందని పేర్కొన్నారు.

    యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ నాయకత్వంలో సౌదీ అరేబియా అద్భుతమైన ఆర్థిక వృద్ధిని సాధించిందని వివరించారు.

    దిల్లీలో జీ20 సదస్సు ముగిసిన ఒక రోజు తర్వాత ఈ ద్వైపాక్షిక సమావేశం జరిగింది.

    అంతకుముందు సౌదీ అరేబియా యువరాజుకు రాష్ట్రపతి భవన్‌లో ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది రెడ్ కార్పెట్‌పై స్వాగతం పలికారు.

    details

    భారత్‌కు అభినందనలు: సౌదీ యువరాజు

    ఇంధనం, వ్యవసాయం, రాజకీయ, భద్రత, రక్షణ, వాణిజ్యం, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లోని విభిన్న అంశాలపై మోదీ- సౌదీ యువరాజు చర్చించారు.

    సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ మాట్లాడుతూ.. భారత్‌లో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.

    జీ20 సమ్మిట్‌ను విజయవంతంగా నిర్వహించినందుకు భారతదేశాన్ని ఆయన అభినందించారు.

    జీ20 దేశాలు, ప్రపంచానికి ప్రయోజనం చేకూర్చే అనేక ప్రకటనలు దిల్లీ వేదికగా వెలువడినట్లు మహ్మద్ బిన్ సల్మాన్ స్పష్టం చేశారు.

    రెండు దేశాల గొప్ప భవిష్యత్తు కోసం తాము కలిసి పని చేస్తామని ఆయన వివరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    సౌదీ అరేబియా
    భారతదేశం
    ద్వైపాక్షిక చర్చలు

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    నరేంద్ర మోదీ

    జై శ్రీరామ్ పేరుతో ప్రజలను చంపుతున్నారు: పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ  జమ్ముకశ్మీర్
    Rahul Gandhi: చైనా చొరబాటుపై రాహుల్ విమర్శలు; రాజీవ్ గాంధీకి లద్దాఖ్‌లో నివాళులు రాహుల్ గాంధీ
    BRICS Summit: 'బ్రిక్స్' సదస్సులో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికాకు బయలుదేరిన ప్రధాని మోదీ  బ్రిక్స్ సమ్మిట్
    ప్రధాని మోదీకి పాక్ సోదరి రక్షాబంధన్ శుభాకాంక్షలు.. 31వసారి రాఖీ కట్టనున్న మొహిసిన్ పాకిస్థాన్

    సౌదీ అరేబియా

    ఐపీఎల్ కు చెక్ పెట్టడానికి సౌదీ ఆరేబియా లీగ్ సిద్ధం! క్రికెట్
    ఆపరేషన్ కావేరి: సూడాన్ నుంచి 10వ బ్యాచ్ భారతీయుల తరలింపు సూడాన్
    అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడానికి కారణాలేంటి?  చమురు

    భారతదేశం

    సింగపూర్‌కు బియ్యం ఎగుమతికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ సింగపూర్
    India G20 presidency: 'జీ20' అంటే ఏమిటి?కూటమికి అధ్యక్షత వహించడం ద్వారా భారత్ ఏమి ఆశిస్తోంది?  జీ20 సదస్సు
    వివాదాస్పద మ్యాప్ పై భారత్ తీవ్ర స్పందనకు బదులిచ్చిన డ్రాగన్ దేశం   చైనా
    వ్లాదిమిర్ పుతిన్ బాటలోనే జిన్‌పింగ్.. భారత్‌లో జరిగే G-20 సమావేశాలకు దూరం చైనా

    ద్వైపాక్షిక చర్చలు

    నేడు దిల్లీ వేదికగా మోదీ-బైడెన్ ద్వైపాక్షిక చర్చలు భారతదేశం
    Modi-Biden bilateral meet: ద్వైపాక్షిక సమావేశంలో మోదీ, బైడెన్ చర్చించిన అంశాలు ఇవే..  నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025