NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi:మే నెలలో సింహాల గణన.. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ  
    తదుపరి వార్తా కథనం
    PM Modi:మే నెలలో సింహాల గణన.. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ  
    మే నెలలో సింహాల గణన.. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ

    PM Modi:మే నెలలో సింహాల గణన.. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ  

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 03, 2025
    05:29 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ (NBWL) సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.

    ఈసందర్భంగా ఆసియాటిక్ సింహాల జనాభా అంచనాను ఈ ఏడాది మే నెలలో నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు.

    సోమవారం ఉదయం జునాగఢ్ జిల్లాలోని గిర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని సందర్శించిన ప్రధాని మోడీ,లయన్‌ సఫారీ చేశారు.

    ఆయన వెంట కేంద్ర పర్యావరణ,అటవీశాఖ మంత్రి భూపేందర్ యాదవ్,ఇతర అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.

    జునాగఢ్‌లో నేషనల్ రెఫరల్ సెంటర్-వైల్డ్‌లైఫ్‌కు శంకుస్థాపన చేసిన ప్రధాని మోడీ, రివర్ డాల్ఫిన్‌లపై ఒక ప్రత్యేక పుస్తకాన్ని ఆవిష్కరించారు.

    అదే విధంగా,తమిళనాడులోని కోయంబత్తూరులో మానవ-వన్యప్రాణుల మధ్య జరుగుతున్న సంఘర్షణను నివారించేందుకు ప్రత్యేకంగా ఎక్సలెన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

    వివరాలు 

    ఆసియాటిక్ సింహాల సంరక్షణ.. రూ.2,900 కోట్లకు పైగా నిధులు

    భవిష్యత్ తరాల కోసం ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత మనందరిదని, జీవ వైవిధ్యాన్ని సంరక్షించేందుకు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

    స్వంత రాష్ట్రమైన గుజరాత్‌లో మూడు రోజుల పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ, ఈ విషయాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

    సమిష్టి కృషి వల్ల ఆసియాటిక్ సింహాల జనాభా స్థిరంగా పెరుగుతోందని, వాటి నివాసాలను కాపాడేందుకు స్థానిక గిరిజనుల సహకారం ఎంతో కీలకమని ఆయన ప్రశంసించారు.

    గుజరాత్‌లో మాత్రమే కనిపించే ఆసియాటిక్ సింహాల సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.2,900 కోట్లకు పైగా నిధులు కేటాయించింది.

    ప్రస్తుతం, ఈ సింహాలు గుజరాత్‌లోని 9 జిల్లాల్లో, 53 తాలూకాలలో, దాదాపు 30,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో జీవిస్తున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ

    తాజా

    Sundar Pichai: గూగుల్ తర్వాత సీఈఓ ఎవరు? సుందర్ పిచాయ్ ఏం చెప్పారంటే? గూగుల్
    Maganti Gopinath : జూబ్లీహిల్స్ గోపినాథ్ కన్నుమూత.. నిర్మాతగా ఆయన తీసిన సినిమాలివే! జూబ్లీహిల్స్
    Telangana Cabinet: తెలంగాణ కేబినెట్‌ విస్తరణ.. ముగ్గురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం తెలంగాణ
    Maganti Gopinath Political Career: మాగంటి గోపినాథ్ రాజకీయ ప్రస్థానం.. మూడు దశాబ్దాల సేవలకు వీడ్కోలు జూబ్లీహిల్స్

    నరేంద్ర మోదీ

    Parliament Budget Session:  25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చాం: మోదీ  భారతదేశం
    PM Modi: మహా కుంభమేళాను సందర్శించిన ప్రధాని నరేంద్రమోదీ.. త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం మహాకుంభమేళా
    Pariksha Pe Charcha 2025: పరీక్షా పే చర్చలో ప్రధాని మోదీతో ఈసారి బాలీవుడ్‌ నటులు భారతదేశం
    PM Modi: కాంగ్రెస్‌'కి 'సబ్కా సాథ్ సబ్‌కా వికాస్' సాధ్యం కాదు.. రాజ్యసభలో మోదీ  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025