NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / FATF: 'రుజువు ఉందా, చర్య తీసుకుంటాం': పాకిస్తాన్‌ను FATFలో ఉంచడానికి భారత్ కృషి
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    FATF: 'రుజువు ఉందా, చర్య తీసుకుంటాం': పాకిస్తాన్‌ను FATFలో ఉంచడానికి భారత్ కృషి
    'రుజువు ఉందా, చర్య తీసుకుంటాం': పాకిస్తాన్‌ను FATFలో ఉంచడానికి భారత్ కృషి

    FATF: 'రుజువు ఉందా, చర్య తీసుకుంటాం': పాకిస్తాన్‌ను FATFలో ఉంచడానికి భారత్ కృషి

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 06, 2025
    12:52 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత ప్రభుత్వం, పాకిస్థాన్‌ను ఆర్థికంగా ఒంటరిగా చేసి ఉగ్రవాదానికి తోడ్పడే అవకాశాలను తగ్గించేందుకు తన చర్యలకు వేగం పెంచింది.

    లష్కరే తోయిబా వంటి ఉగ్ర సంస్థలకు నిధులు సమకూర్చినందుకు పాక్‌కు తగిన శిక్ష పడేలా కృషి చేస్తోంది.

    ఈ క్రమంలో ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ ఫోర్స్‌ (FATF) ద్వారా పాక్‌ను మళ్లీ 'గ్రే లిస్ట్'లోకి చేర్చే ప్రయత్నాలను భారత్‌ ప్రారంభించింది.

    ప్రస్తుతం అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) నుంచి సహాయం కోరుతున్న పాక్‌కు FATF నిర్ణయాలు కీలకంగా మారాయి.

    ఈసారి జరగనున్న FATF సమావేశంలో పాకిస్థాన్‌పై నిఘా పెంచాల్సిన అవసరాన్ని భారత్‌ ప్రతిపాదించే అవకాశం ఉంది.

    సాధారణంగా,ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న దేశాలను 'గ్రే లిస్ట్'గా పరిగణిస్తారు.

    వివరాలు 

    ఆసియా పసిఫిక్‌ గ్రూప్‌ ఆఫ్‌ మనీలాండరింగ్‌ సభ్యుడిగా పాక్ 

    గతంలో పాకిస్థాన్‌ ఈ జాబితాలో చాలా సంవత్సరాలపాటు ఉండగా, 2022లో మాత్రం మనీలాండరింగ్‌, టెర్రర్‌ ఫైనాన్సింగ్‌ వ్యతిరేకంగా తీసుకున్న చర్యల ఆధారంగా తాత్కాలిక ఉపశమనం పొందింది.

    భారత్‌పై ఆర్థిక దెబ్బతీసేందుకు పాకిస్థాన్‌ ఉగ్రవాద నిధుల వ్యవస్థకు మద్దతు ఇచ్చినట్లు పలు ఆధారాలు తమ వద్ద ఉన్నాయని FATF సమావేశాల్లో పాల్గొన్న ఒక భారత అధికారి తెలిపారు.

    వీటిని అవసరమైన సమయంలో అంతర్జాతీయ వేదికలపై బయటపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.

    FATFలో భారత్‌ సభ్యదేశంగా ఉండగా, పాకిస్థాన్‌ మాత్రం ఆసియా పసిఫిక్‌ గ్రూప్‌ ఆఫ్‌ మనీలాండరింగ్‌ సభ్యుడిగా ఉన్న విషయం గమనార్హం.

    భవిష్యత్తులో IMF బోర్డు సమావేశాల్లో పాకిస్థాన్‌ కోసం ప్రతిపాదించబడే ఆర్థిక ప్యాకేజీలను భారత్‌ తీవ్రంగా వ్యతిరేకించనుంది.

    వివరాలు 

    మూడు దేశాలు బ్లాక్‌లిస్ట్‌లో.. 25 దేశాలు గ్రే లిస్ట్‌లో

    ఇటీవల పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఈ అంశం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

    ''FATF, IMF సమావేశాల్లో వినియోగించేందుకు అవసరమైన ఆధారాలను ఇప్పటికే సేకరించాం. ఉగ్రవాదానికి సహాయపడే దేశాలకు అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి నిధులు అందకూడదన్న దృఢమైన స్థాయిలో భారత్‌ వాదించనుంది,'' అని అధికార వర్గాలు వెల్లడించాయి.

    ఇక ఈ ఏడాది మొదటి భాగంలో జరిగిన FATF సమీక్ష ప్రకారం, మూడు దేశాలు బ్లాక్‌లిస్ట్‌లో ఉండగా, మరో 25 దేశాలు గ్రే లిస్ట్‌లో ఉన్నట్లు సమాచారం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం

    తాజా

    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా
    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్

    భారతదేశం

    India-US: ఎగుమతులను కాపాడుకునేందుకు..US దిగుమతులపై సుంకం తగ్గింపు  అమెరికా
    India Us Trade: భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చలు.. హార్లీ డేవిడ్సన్ బైక్స్, బోర్బన్ విస్కీపై సుంకాల కోత.. బిజినెస్
    CareEdge Ratings: దేశంలోని వివిధ రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులపై ర్యాంకులు..    ఆంధ్ర ర్యాంక్ ఎంతంటే?: కేర్‌ఎడ్జ్ రేటింగ్స్ బిజినెస్
    Trump tariff on India: ట్రంప్ 26 శాతం సుంకాలు..కేంద్ర వాణిజ్య శాఖ విశ్లేషణ.. ఎదురుదెబ్బ కాదన్న  భారత్‌..! బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025