
UNSC: పహల్గామ్ ఉగ్రదాడిపై యూఎన్ భద్రతా మండలి కఠిన వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రదాడి జరిగిన తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని సమావేశం నిర్వహించాలంటూ విజ్ఞప్తి చేసింది.
ఈ అభ్యర్థనను పరిశీలించిన UNSC, ఒక గోప్యమైన (క్లోజ్డ్ డోర్) సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఈ సమావేశంలో పాకిస్థాన్ పూర్తిగా ఒంటరిగా మిగిలింది.
ఈ అవకాశాన్ని భారత్పై తప్పుడు ఆరోపణలు చేయడానికి, కాశ్మీర్ సమస్యను మళ్లీ అంతర్జాతీయ వేదికపై లేవనెత్తడానికి పాకిస్తాన్ ఉపయోగించుకుంది.
కానీ భద్రతా మండలి సభ్య దేశాలు ఆ దేశానికి ఎదురుదెబ్బ ఇచ్చాయి. ఈ సమావేశంలో లష్కరే తోయిబా పహల్గామ్ దాడిలో పాత్రపై పాకిస్తాన్ను UNSC కఠినంగా ప్రశ్నించింది.
Details
దాడిని ఖండించిన సభ్యదేశాలు
దాడిని సభ్యదేశాలు తీవ్రంగా ఖండించాయి. ఉగ్రవాదంపై సమగ్రంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశాయి.
మత విశ్వాసాన్ని లక్ష్యంగా చేసుకుని పర్యాటకులపై దాడులు చేయడం క్షమించరాని చర్యగా అభివర్ణించాయి.
అదే సమయంలో పాకిస్థాన్ ఇటీవల చేపట్టిన క్షిపణి పరీక్షలపై కొన్ని దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ పరీక్షలను ఉద్రిక్తతలను మరింత పెంచే చర్యలుగా పేర్కొన్నాయి.
సభ్య దేశాలు పాకిస్తాన్కు భారత్తో ఉన్న సమస్యలను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించాయి.
అంతేకాక పాకిస్థాన్ ప్రయత్నించిన అంతర్జాతీయీకరణ యత్నాలు పూర్తిగా విఫలమయ్యాయి. UNSCలో దాదాపు గంటన్నర పాటు జరిగిన ఈ గోప్య సమావేశం నుంచి ఎలాంటి స్పష్టమైన నిర్ణయం వెలువడలేదు.
Details
UNSC నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు
సమావేశం అనంతరం UNSC నుంచి అధికారిక ప్రకటన కూడా వెలువడలేదు.
ఈ సమావేశం ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఇటీవల భారత్-పాకిస్తాన్ మధ్య పరిస్థితి తీవ్రమైందని చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో జరిగింది.
'ఫాల్స్ ఫ్లాగ్' అంశాన్ని కూడా ఈ సందర్భంగా పాకిస్తాన్ ప్రస్తావించింది.
దీని అర్థం-ఒక దేశం ఉగ్రవాద దాడిని స్వయంగా నిర్వహించి, దానికి బాధ్యత మరొకరిపై మోపడం. అయితే భద్రతా మండలి ఈ వాదనను పూర్తిగా తిరస్కరించింది.
ఇంతటితో కాకుండా, ఈ సమావేశం ద్వారా పాకిస్తాన్ ప్రపంచ వేదికపై మరింత ఒంటరిపడిన దేశంగా నిలిచింది.
ఉగ్రవాదంపై ఏ దేశమైనా సమర్థవంతంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న విషయం ఈ సమావేశం ద్వారా మరోసారి స్పష్టమైంది.