NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు /  New Flight Services: విజయవాడ నుంచి విశాఖకు నూతన విమాన సర్వీసు.. జూన్ 1 నుంచి సేవలు ప్రారంభం
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
     New Flight Services: విజయవాడ నుంచి విశాఖకు నూతన విమాన సర్వీసు.. జూన్ 1 నుంచి సేవలు ప్రారంభం
    విజయవాడ నుంచి విశాఖకు నూతన విమాన సర్వీసు

     New Flight Services: విజయవాడ నుంచి విశాఖకు నూతన విమాన సర్వీసు.. జూన్ 1 నుంచి సేవలు ప్రారంభం

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 06, 2025
    12:32 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్టణం ఆర్థిక రాజధానిగా వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, విజయవాడ-విశాఖపట్నం మధ్య రవాణా అవసరాలు గణనీయంగా పెరుగుతున్నాయి.

    అయితే ఈ రెండు నగరాల మధ్య దూరం ఎక్కువగా ఉండటంతో రోడ్ మార్గంలో ప్రయాణించడానికి అధిక సమయం తీసుకుంటోంది.

    అంతేకాకుండా,విశాఖపట్నానికి నేరుగా విమాన సేవలు అందుబాటులో లేకపోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు.

    ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కేంద్ర పౌర విమానయాన శాఖ విజయవాడ నుంచి నేరుగా విశాఖపట్నానికి విమాన సర్వీసు ప్రారంభించే దిశగా చర్యలు చేపట్టింది.

    ప్రస్తుతం చెన్నై నుంచి వచ్చే ఒకే ఒక్క విమానం మాత్రమే ఈ మార్గంలో అందుబాటులో ఉంది.

    కానీ, దానిలో ఎక్కువగా రద్దీ ఉండటంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలైన హైదరాబాద్ ద్వారా ప్రయాణిస్తున్నారు.

    వివరాలు 

    ఈ సేవను ఇండిగో సంస్థ నిర్వహిస్తోంది 

    ఇకపై నేరుగా విశాఖకు వెళ్లే విమాన సర్వీసు ప్రారంభం కాబోతుండటంతో ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

    కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సోమవారం ప్రకటనలో జూన్ 1 నుంచి ఈ కొత్త విమాన సర్వీసు ప్రారంభమవుతుందని తెలిపారు.

    ఇండిగో సంస్థ ఈ సేవను నిర్వహించనుంది. ఉదయం 7:15 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరిన విమానం, 8:25 గంటలకు విశాఖ చేరుకుంటుంది.

    తిరిగి ఉదయం 8:45 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి, 9:45 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది.

    వివరాలు 

    విజయవాడ-విశాఖ మార్గంలో ప్రయాణికులకు ఎంతో సౌలభ్యం

    ఈ నూతన సర్వీసుతో విజయవాడ-విశాఖ మార్గంలో ప్రయాణికులకు ఎంతో సౌలభ్యం కలుగనుంది.

    ఇంతకు ముందు చెన్నై నుంచి మాత్రమే విశాఖకు వెళ్లే విమాన సర్వీసు ఉండగా, అది ఉదయం 8:05కు విజయవాడకు చేరి, 8:45కు విశాఖ వైపు బయలుదేరేది.

    కానీ, చెన్నై విమానంలో ఉన్న రద్దీ కారణంగా ప్రయాణికులు హైదరాబాద్ ద్వారా ప్రయాణించాల్సి వచ్చేది.

    ఇప్పుడు నేరుగా విమాన సర్వీసు ప్రారంభమవుతున్నందున ఈ ఇబ్బందులు తొలగిపోతాయని వారు భావిస్తున్నారు.

    ఇకపై విజయవాడ నుంచి ఉదయం విశాఖకు వెళ్లి తమ పనులు ముగించుకుని, రాత్రికి తిరిగి విజయవాడ చేరుకునే వీలుండబోతోంది.

    వివరాలు 

    విమాన సర్వీసు సామాన్య ప్రజలతో పాటు వ్యాపార వర్గాలకూ ఉపయోగం 

    ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు.

    జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ ఇండిగో విమాన సర్వీసును ప్రారంభించేందుకు కృషి చేసిన కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

    ఈ విమాన సర్వీసు సామాన్య ప్రజలతో పాటు వ్యాపార వర్గాలకూ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.

    ఇలాంటి మరిన్ని విమాన సర్వీసులు భవిష్యత్తులో కూడా ప్రారంభిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    గంటా శ్రీనివాసరావు చేసిన ట్వీట్ 

    విశాఖ నుంచి విజయవాడకు ఉదయం వేళల్లో విమానాన్ని పునరుద్ధరిస్తూ తీసుకున్న నిర్ణయం ఉత్తరాంధ్ర వాసులకు ఊరటనిచ్చే విషయం. జూన్ 1 వ తేదీ నుంచి ఇండిగో సర్వీసు మళ్లీ ప్రవేశపెట్టడానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి @RamMNK గారు పూనుకోవడం సంతోషం. ఆయనకు అభినందనలు. ప్రయాణికులకు అనుకూలంగా… pic.twitter.com/efTRgr9P7L

    — Ganta Srinivasa Rao (@Ganta_Srinivasa) May 5, 2025
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Manipur: మయన్మార్ సరిహద్దుల్లో మిలిటెంట్ల కదలికలు.. అసోం రైఫిల్స్ ఆపరేషన్‌లో 10 మంది మృతి మణిపూర్
    Canada: కెనడా మంత్రివర్గంలో భారతీయ మూలాల నేతలకు కీలక పదవులు  కెనడా
    Shubhanshu Shukla: జూన్‌ 8న నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ లాంచ్ కాంప్లెక్స్ నుండి అంతరిక్షంలోకి వెళ్లనున్న భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా నాసా
    Ap news: మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై కేసు.. ఆయన కుటుంబ సభ్యులపై కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

    ఆంధ్రప్రదేశ్

    Happy Birthday Chandrababu : చంద్రబాబు 75వ బర్త్‌డే.. ఐటీ హబ్ హైదరాబాదు నుంచి అమరావతి దిశగా అభివృద్ధి పయనం  చంద్రబాబు నాయుడు
    AP Transco: రూ.28 వేల కోట్లతో ట్రాన్స్‌కో నెట్‌వర్క్‌.. ఐదేళ్ల తర్వాత పెరిగే డిమాండ్‌కు అనుగుణంగా విస్తరణ భారతదేశం
    Heatwave: ఆంధ్రప్రదేశ్‌లో వడగాలుల మోత.. 31 మండలాల్లో తీవ్రమైన వేడీ భారతదేశం
    Hepatitis: హెచ్చరిక.. ఏపీలో హెపటైటిస్ కేసులు పెరుగుతున్నాయి భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025