NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Jammu and Kashmir: కతువాలో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదుల దాడి 
    తదుపరి వార్తా కథనం
    Jammu and Kashmir: కతువాలో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదుల దాడి 
    Jammu and Kashmir: కతువాలో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదుల దాడి

    Jammu and Kashmir: కతువాలో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదుల దాడి 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jul 08, 2024
    04:41 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జమ్ముకశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఆర్మీ వాహనాన్ని ఉగ్రవాదులు టార్గెట్ చేశారు. సైన్యం ప్రతీకార చర్యతో ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది.

    ఇది పక్కా ప్రణాళికతో జరిగిన ఉగ్రదాడి అని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

    దీనిపై భారత సైన్యం స్పందిస్తోంది. భద్రతా బలగాల అదనపు బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి.

    జిల్లాలోని బిల్వార్ తహసీల్‌లోని మచ్చేడి ప్రాంతంలోని బద్నోటా గ్రామంలో ఉగ్రవాదులు ఈ కిరాతక చర్యకు పాల్పడ్డారు.

    ఈ ప్రాంతం ఇండియన్ ఆర్మీ 9వ కార్ప్స్ క్రిందకు వస్తుంది. ఉగ్రవాదుల కాల్పులతో ఆర్మీ జవాన్లు ప్రతీకారం తీర్చుకున్నారు.

    ఇరువైపులా కాల్పులు కొనసాగుతున్నాయి. శనివారం తెల్లవారుజామున కశ్మీర్‌లోని కుల్గామ్‌లో జరిగిన రెండు ఎన్‌కౌంటర్లలో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ సమయంలో ఇద్దరు సైనికులు కూడా వీరమరణం పొందారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    కథువాలో ఉగ్రవాద దాడి 

    Indian Army convoy attacked by terrorists in Machedi area of Kathua district in Jammu and Kashmir. The area falls under the 9 Corps of the Indian Army. After firing by terrorists, our troops also retaliated. More details awaited: Defence officials pic.twitter.com/1Vpklp8UGk

    — ANI (@ANI) July 8, 2024

    వివరాలు 

    ఉగ్రవాదాన్ని అంతం చేసే వరకు పోరాటం  

    మోదర్గాం ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు ఆదివారం తెలిపారు.

    ఆదివారం చిన్నగాం నుండి నాలుగు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

    కుల్గాం జిల్లాలోని రెండు గ్రామాల్లో శనివారం నుంచి ఎన్‌కౌంటర్ ప్రారంభమైందని అధికారి తెలిపారు.

    ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పారా కమాండో సహా ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.

    ఈ ఆపరేషన్ల గురించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆర్ఆర్ స్వైన్ మాట్లాడుతూ, 6 మంది ఉగ్రవాదులను అంతమొందించడం ఒక పెద్ద విజయమని అన్నారు.

    జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని అంతమొందించే పోరాటం ముగింపు దశకు చేరుకుంటుందనడానికి ఈ విజయం నిదర్శనం అన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జమ్ముకశ్మీర్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    జమ్ముకశ్మీర్

    Jammu & Kashmir: బారాముల్లాలో రిటైర్డ్ పోలీస్ అధికారిని కాల్చి చంపిన ఉగ్రవాదులు  ఉగ్రవాదులు
    Jammu and Kashmir Earthquake: లడఖ్‌లోని లేహ్‌లో 4.5 తీవ్రతతో భూకంపం  భూకంపం
    Farooq Abdullah: కశ్మీర్‌కు కూడా గాజాకు పట్టిన గతే: ఫరూఖ్ అబ్దుల్లా  ఫరూక్ అబ్దుల్లా
    MLJK-MA: 'ముస్లిం లీగ్ జమ్ముకశ్మీర్'‌ సంస్థపై కేంద్రం నిషేదం  కేంద్రమంత్రి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025