పార్లమెంటులో నరేంద్ర మోదీతో విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ.. భారత్- కెనడా సంబంధాలపై కీలక చర్చ
భారత్, కెనడా మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. సిక్కు తీవ్రవాద గ్రూపుతో ట్రూడో పొత్తు కారణంగా భారత్తో ద్వైపాక్షిక సంబంధాలు క్షీణించాయి. ఈ మేరకు పార్లమెంటులో ప్రధాని మోదీతో విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ భేటీ అయ్యారు. కెనడా సర్కార్ భారత వ్యతిరేక నిర్ణయాల నేపథ్యంలో చర్చలు జరపనున్నారు. ఇటీవలే భారత దౌత్యవేత్తను కెనడా బహిష్కరించడం, వెంటనే ఇండియా అదేస్థాయిలో జవాబివ్వడం చకచక జరిగిపోయాయి. సిక్కు నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనక భారత్ హస్తముందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను భారత్ ఖండించింది. G-20 నేపథ్యంలో ఖలిస్థానీ అనుకూలవాదులపై ఉదాసీన తీరుకు ట్రూడోను మోదీ హెచ్చరించారు. అప్పట్నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు నశించాయి.