NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / బియ్యం ధరల కట్టడికి కేంద్రం కళ్లెం.. ఎగుమతులపై నిషేధం విధింపు
    తదుపరి వార్తా కథనం
    బియ్యం ధరల కట్టడికి కేంద్రం కళ్లెం.. ఎగుమతులపై నిషేధం విధింపు
    బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేధం

    బియ్యం ధరల కట్టడికి కేంద్రం కళ్లెం.. ఎగుమతులపై నిషేధం విధింపు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 21, 2023
    06:29 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బియ్యం ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. భారతదేశంలో ధరలను నియంత్రించేందుకు గురువారం కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

    బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై నిషేధాలు విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని వెల్లడించింది. సదరు బియ్యాన్ని నిషేధిత ఎగుమతుల జాబితాలోకి చేర్చామని డైరెక్టరేట్ ఆఫ్ జనరల్ ఫారిన్ ట్రేడ్ స్పష్టం చేసింది.

    దేశవ్యాప్తంగా బియ్యం ధరలు క్రమంగా పెరుగుతున్నట్లు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ గుర్తించింది. ఈ మేరకు గతేడాది సెప్టెంబర్‌లో బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై 20 శాతం సుంకాన్ని కేంద్రం విధించింది.

    దేశ ప్రజల అవసరాలకు కావాల్సిన నిల్వలు సిద్ధం చేసుకునే దిశగా తాజాగా నిర్ణయం తీసుకుంది. మరోవైపు దేశవ్యాప్తంగా కురుస్తున్న కుంభవృష్టికి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది.

    DETAILS

    అంతర్జాతీయ బియ్యం ఎగుమతిదారుల్లో భారత్ అతిపెద్ద ఎగుమతిదారు

    గత సంవత్సర కాలంలో బియ్యం ధరలు 11 శాతం పెరిగాయి. అయితే 3 శాతం మేర గడిచిన ఒక్క నెలలోనే పెరగడం గమనార్హం.

    బియ్యం ఎగుమతుల్లో భారత్ బాస్మతీయేతర బియ్యం వాటా దాదాపు పాతిక శాతమని వినియోగదారుల మంత్రిత్వశాఖ వెల్లడించింది.

    మరోవైపు బియ్యంపై ఆంక్షలతో ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరిగేందుకు ఆస్కారం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

    ఇప్పటికే ఉక్రెయిన్-రష్యా యుద్ధ ప్రభావం అంతర్జాతీయ ఆహార ధరలపై ప్రభావం చూపిస్తుండటం గమనార్హం.

    గ్లోబల్ మార్కెట్ లో భారత్ బియ్యం ఎగుమతుల వాటా 40 శాతంగా ఉంది. ఈ క్రమంలోనే అంతర్జాతీయ బియ్యం ఎగుమతిదారుల్లో భారత్ అతిపెద్ద దేశంగా నిలిచింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేంద్ర ప్రభుత్వం
    భారతదేశం

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    కేంద్ర ప్రభుత్వం

    కాంగ్రెస్‌కు ఆప్ అల్టిమేటం; కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్‌పై పెదవి విప్పాలని డిమాండ్  అరవింద్ కేజ్రీవాల్
    దగ్గు మందు తయారీలో మారియన్ ఫార్మాదే పాపం.. ప్రమాదకర పారిశ్రామిక గ్రేడ్ ప్రాపిలెన్ గ్లైకాల్ వినియోగం దగ్గు మందు
    సీడీఆర్ఐ- భారత్ మధ్య ప్రధాన కార్యాలయ ఒప్పందం; కేంద్ర క్యాబినెట్ ఆమోదం నరేంద్ర మోదీ
    కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశంలోనే యూసీసీ బిల్లు ప్రధాన మంత్రి

    భారతదేశం

    భారత్-అమెరికా స్నేహం ప్రపంచంలోనే అత్యంత కీలకమైనది: బైడెన్ అమెరికా
    దావూద్‌ మాదిరిగానే ఎదిగిన బిష్ణోయ్‌ గ్యాంగ్: ఎన్‌ఐఏ చార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు  ఎన్ఐఏ
    మతపరమైన తీవ్రవాదంపై భారత్ - ఈజిప్టు ఉమ్మడి పోరు ఈజిప్ట్
    గ్రేట్ ఫ్రెండ్ మోదీకి రష్యా అధ్యక్షుడి ప్రశంసలు..మేకిన్‌ ఇండియా ఫలితాలు కనిపిస్తున్నాయని కితాబు నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025