NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Tirupati:తిరుపతి నగరానికి తలమానికంగా రైల్వే స్టేషన్.. అత్యాధునిక సౌకర్యాలతో కొత్త అనుభూతి
    తదుపరి వార్తా కథనం
    Tirupati:తిరుపతి నగరానికి తలమానికంగా రైల్వే స్టేషన్.. అత్యాధునిక సౌకర్యాలతో కొత్త అనుభూతి
    తిరుపతి నగరానికి తలమానికంగా రైల్వే స్టేషన్..

    Tirupati:తిరుపతి నగరానికి తలమానికంగా రైల్వే స్టేషన్.. అత్యాధునిక సౌకర్యాలతో కొత్త అనుభూతి

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 06, 2024
    01:40 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తిరుపతి రైల్వే స్టేషన్ చాలా కాలంగా వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్‌గా అభివృద్ధి చెందుతుందని విన్నాం. ఇప్పుడు అది సాకారం కాబోతోంది.

    తిరుపతి రైల్వే స్టేషన్ కొత్త ముద్ర వేస్తూ, రూ. 300 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలను అందించడానికి సిద్ధమవుతోంది.

    ఇది తిరుమలకు వచ్చే భక్తులకు ఒక కొత్త అనుభూతిని అందించనుంది. ఏడాదికి 6 కోట్ల మంది యాత్రికులు రాకపోకలు సాగించే ఈ రైల్వే స్టేషన్, త్వరలోనే అంతర్జాతీయ ప్రమాణాలతో అందుబాటులోకి రానుంది.

    దాదాపు 7.5 ఎకరాల విస్తీర్ణంలో తిరుపతి రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం 2022 ఆగస్టులో ప్రారంభమైంది.

    ఈ ఏడాది చివరి నాటికి మొదటి దశ పనులు పూర్తవుతాయని,ఢిల్లీలోని వరిందేర కన్‌స్ట్రక్చర్ సంస్థ ఈ పనులను పూర్తి చేస్తుందని తెలుస్తోంది.

    వివరాలు 

    200 ఫోర్ వీలర్స్, 300 టూ వీలర్స్ పార్కింగ్

    తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి రైల్వే స్టేషన్ మోడర్నైజేషన్ పనులను పరిశీలించారు.

    ఈ క్రమంలో రైల్వే అధికారులు సౌత్ సైట్ స్టేషన్ బిల్డింగ్, జీ ప్లస్ త్రీ భవనం, ఎయిర్ కాన్ కోర్సెస్, ఇతర ఇంజనీరింగ్ పనులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

    సౌత్ సైడ్ స్టేషన్ భవనం 10,800 స్క్వేర్ మీటర్ల విస్తీర్ణంలో పూర్తయింది. ఇందులో బేస్మెంట్ పార్కింగ్, గ్రౌండ్ ఫ్లోర్‌లో టికెట్ కౌంటర్స్,వెయిటింగ్ లాంజ్,డిపార్చర్ అరైవల్ కాన్ కోర్స్ వంటి సౌకర్యాలు కల్పించారు.

    ఈ బేస్మెంట్‌లో 200 ఫోర్ వీలర్స్, 300 టూ వీలర్స్ పార్కింగ్, రైన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్, సేవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ వంటి సదుపాయాలు ఉన్నాయి.

    వివరాలు 

    రోజుకు 1.50 లక్షల మంది ప్రయాణికులు 

    సౌత్ సైడ్ స్టేషన్ భవనం సెకండ్ ఫ్లోర్‌లో కామన్ వెయిటింగ్ హాల్, ఫిమేల్ వెయిటింగ్ ఏరియా, ఫుడ్ కోర్ట్స్, టాయిలెట్స్, క్లాక్ రూమ్ వంటి సౌకర్యాలను కల్పించారు.

    థర్డ్ ఫ్లోర్‌లో రన్నింగ్ రూమ్, టిటీఈల రెస్ట్ రూములు, రైల్వే ఆఫీసులతో పాటు 8 లిఫ్టులు, 2 ఎస్కలేటర్లు నిర్మించారు.

    తిరుమలకు వచ్చే యాత్రికులకు నూతన అనుభూతిని అందించేలా రైల్వే స్టేషన్ మోడర్నైజేషన్ పనులు జరుగుతున్నాయి.

    తిరుపతి ఎంపీ గురుమూర్తి స్వయంగా పనులను పరిశీలించి, రైల్వే అండర్ బ్రిడ్జిలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, ప్లాట్‌ఫామ్‌లను తనిఖీ చేశారు.

    ప్రస్తుతం 90 రైళ్లు, 90 వేల మంది యాత్రికులకు సేవలందిస్తున్న ఈ స్టేషన్, మోడర్నైజేషన్ తర్వాత రోజుకు 1.50 లక్షల మంది ప్రయాణికుల అవసరాలను తీర్చనుంది.

    వివరాలు 

    డిసెంబరులో  యాత్రికులకు అందుబాటులో  సౌత్ బ్లాక్ 

    తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధి అనేది మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రోత్సాహంతో సాధ్యమైందని ఎంపీ గురుమూర్తి అన్నారు.

    ఈ ఏడాది డిసెంబరులో తిరుపతికి వచ్చే యాత్రికులకు సౌత్ బ్లాక్ పూర్తిగా అందుబాటులోకి వస్తుందని, రైల్వే స్టేషన్ నుంచి ఆర్టీసీ బస్టాండ్‌కు అనుసంధానంగా స్కై వాక్ కూడా రానుందని తెలిపారు.

    తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి అలిపిరి వరకు రోప్ వే నిర్మాణానికి డిపిఆర్ సిద్ధమవుతోందని, ఈ రోప్ వే ద్వారా 2 వేల మంది ప్రయాణించేందుకు చర్యలు తీసుకున్నామని ఎంపీ గురుమూర్తి స్పష్టం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తిరుపతి

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    తిరుపతి

    ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ను ప్రారంభించిన తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల తిరుపతి
    TSRTC: 'బాలాజీ దర్శనం' ప్యాకేజీకి విశేష స్పందన; తిరుమలకు 1.14 లక్షల మంది భక్తులు తెలంగాణ
    ఏప్రిల్ 8న సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం; టికెట్ ధరలు, ట్రైన్ రూట్ వివరాలు ఇలా ఉన్నాయి! వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    రేపు సికింద్రాబాద్-తిరుపతి వందే‌భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం; ట్రైన్ రూట్, టికెట్ ధరలను తెలుసుకోండి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025