NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / US: అమెరికాలో ప్రమాదం.. కోమాలో ఉన్న భారతీయ విద్యార్థి.. అత్యవసర వీసా ఇవ్వాలని పేరెంట్స్ విజ్ఞప్తి 
    తదుపరి వార్తా కథనం
    US: అమెరికాలో ప్రమాదం.. కోమాలో ఉన్న భారతీయ విద్యార్థి.. అత్యవసర వీసా ఇవ్వాలని పేరెంట్స్ విజ్ఞప్తి 
    అమెరికాలో ప్రమాదం.. కోమాలో ఉన్న భారతీయ విద్యార్థి

    US: అమెరికాలో ప్రమాదం.. కోమాలో ఉన్న భారతీయ విద్యార్థి.. అత్యవసర వీసా ఇవ్వాలని పేరెంట్స్ విజ్ఞప్తి 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 27, 2025
    10:59 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతీయ విద్యార్థిని నీలం షిండే (35) తీవ్రంగా గాయపడి,ఆమె పరిస్థితి విషమంగా ఉంది.

    ఈ నెల 14న ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది, అప్పటి నుంచి ఆమె ఐసీయూలో చికిత్స పొందుతోంది.

    తాజా సమాచారం ప్రకారం, ఆమె కోమాలోకి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి.

    నీలం షిండే మహారాష్ట్రలోని సతారా జిల్లా నివాసి. ఈ ఘటనపై లోక్‌సభ ఎంపీ సుప్రియా సూలే స్పందించారు.

    ఆమె తల్లిదండ్రులు అత్యవసర వీసా పొందేలా కేంద్ర ప్రభుత్వం సహాయపడాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎక్స్ (మాజీ ట్విట్టర్) ద్వారా కేంద్రాన్ని కోరారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    సుప్రియా సూలే చేసిన ట్వీట్ 

    Student Neelam Shinde has met with an accident in the USA and is hospitalized in a local hospital. Her father, Tanaji Shinde, from Satara, Maharashtra, India, urgently needs to visit his daughter due to a medical emergency. Tanaji Shinde has applied for an urgent visa to the USA…

    — Supriya Sule (@supriya_sule) February 26, 2025

    వివరాలు 

    పోలీసులు అదుపులో ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌

    మరోవైపు, ఈ ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    ఫిబ్రవరి 16న ఈ ఘటన జరిగినట్లు తమకు సమాచారం వచ్చిందని నీలం తండ్రి తనాజీ షిండే తెలిపారు.

    ప్రమాదం జరిగినప్పటి నుంచి వీసా కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ, ఇప్పటివరకు మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

    ఈ క్రమంలో, ఎన్‌సీపీ (ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలే దీనిపై స్పందించి, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ సహాయంతో వీసా మంజూరు జరిగేలా చూస్తున్నట్లు తెలిపారు.

    కేంద్రం ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

    వివరాలు 

    నీలం షిండేకు తీవ్ర గాయాలు

    కారు ప్రమాదంలో నీలం షిండేకు తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం.

    ఆమె చేతులు, కాళ్లు విరగడంతో పాటు తలకు బలమైన గాయాలు తగిలాయి.

    ఈ దుష్పరిణామంతోనే ఆమె కోమాలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.

    గత నాలుగేళ్లుగా అమెరికాలో ఉన్న నీలం, ఈ ఏడాదితో తన చదువు పూర్తి చేసుకునే దశలో ఉండగా ఈ విషాదకరమైన ఘటన జరిగింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహారాష్ట్ర

    తాజా

    NEET PG 2025: నీట్-పీజీ 2025 వాయిదా - ఆగస్టు 3న పరీక్ష నిర్వహణకు సుప్రీంకోర్టు ఆమోదం  సుప్రీంకోర్టు
    2025 Suzuki V-Strom 800DE: భారత్ లో విడుదలైన 2025 సుజుకి V-స్ట్రోమ్ 800DE.. రూ.10,30,000 ఎక్స్-షోరూమ్ ధర ఆటో మొబైల్
    Elon Musk: కొత్త పార్టీ పెట్టేందుకు ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం.. మస్క్ పెట్టిన పోల్‌కు భారీ రెస్పాన్స్..  ఎలాన్ మస్క్
    Chenab bridge: ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ చినాబ్ వంతెన ప్రారంభించిన ప్రధాని మోదీ ..  నరేంద్ర మోదీ

    మహారాష్ట్ర

    Maharashtra Next CM: మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ ఖాయమా? నేడు అధికారిక ప్రకటన  బీజేపీ
    Shrikant Shinde: "నేను డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తునట్లు వస్తున్న వార్తలు అవాస్తవం": శ్రీకాంత్ షిండే  భారతదేశం
    Maharastra: మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా షిండే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం: నివేదిక భారతదేశం
    Maharastra: బీజేపీ 22, సేన 12: మంత్రి పదవుల కోసం మహారాష్ట్ర పవర్ షేర్ ఫార్ములా ! భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025