LOADING...
US: అమెరికాలో ప్రమాదం.. కోమాలో ఉన్న భారతీయ విద్యార్థి.. అత్యవసర వీసా ఇవ్వాలని పేరెంట్స్ విజ్ఞప్తి 
అమెరికాలో ప్రమాదం.. కోమాలో ఉన్న భారతీయ విద్యార్థి

US: అమెరికాలో ప్రమాదం.. కోమాలో ఉన్న భారతీయ విద్యార్థి.. అత్యవసర వీసా ఇవ్వాలని పేరెంట్స్ విజ్ఞప్తి 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 27, 2025
10:59 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతీయ విద్యార్థిని నీలం షిండే (35) తీవ్రంగా గాయపడి,ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ నెల 14న ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది, అప్పటి నుంచి ఆమె ఐసీయూలో చికిత్స పొందుతోంది. తాజా సమాచారం ప్రకారం, ఆమె కోమాలోకి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. నీలం షిండే మహారాష్ట్రలోని సతారా జిల్లా నివాసి. ఈ ఘటనపై లోక్‌సభ ఎంపీ సుప్రియా సూలే స్పందించారు. ఆమె తల్లిదండ్రులు అత్యవసర వీసా పొందేలా కేంద్ర ప్రభుత్వం సహాయపడాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎక్స్ (మాజీ ట్విట్టర్) ద్వారా కేంద్రాన్ని కోరారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సుప్రియా సూలే చేసిన ట్వీట్ 

వివరాలు 

పోలీసులు అదుపులో ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌

మరోవైపు, ఈ ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫిబ్రవరి 16న ఈ ఘటన జరిగినట్లు తమకు సమాచారం వచ్చిందని నీలం తండ్రి తనాజీ షిండే తెలిపారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి వీసా కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ, ఇప్పటివరకు మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో, ఎన్‌సీపీ (ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలే దీనిపై స్పందించి, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ సహాయంతో వీసా మంజూరు జరిగేలా చూస్తున్నట్లు తెలిపారు. కేంద్రం ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

వివరాలు 

నీలం షిండేకు తీవ్ర గాయాలు

కారు ప్రమాదంలో నీలం షిండేకు తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. ఆమె చేతులు, కాళ్లు విరగడంతో పాటు తలకు బలమైన గాయాలు తగిలాయి. ఈ దుష్పరిణామంతోనే ఆమె కోమాలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. గత నాలుగేళ్లుగా అమెరికాలో ఉన్న నీలం, ఈ ఏడాదితో తన చదువు పూర్తి చేసుకునే దశలో ఉండగా ఈ విషాదకరమైన ఘటన జరిగింది.