NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Governments Travel Advisory: పాక్‌లోని భారతీయులు వీలైనంత త్వరగా తిరిగి రావాలి.. సంచలన ఆదేశాలు..
    తదుపరి వార్తా కథనం
    Governments Travel Advisory: పాక్‌లోని భారతీయులు వీలైనంత త్వరగా తిరిగి రావాలి.. సంచలన ఆదేశాలు..
    పాక్‌లోని భారతీయులు వీలైనంత త్వరగా తిరిగి రావాలి.. సంచలన ఆదేశాలు..

    Governments Travel Advisory: పాక్‌లోని భారతీయులు వీలైనంత త్వరగా తిరిగి రావాలి.. సంచలన ఆదేశాలు..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 24, 2025
    04:28 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత ప్రభుత్వం పాకిస్థాన్‌లో ఉన్న భారతీయులందరూ తక్షణమే తిరిగి రావాలని తీవ్ర స్థాయిలో సూచనలు జారీ చేసింది.

    జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి అనంతరం, కేంద్రం ట్రావెల్ అడ్వైజరీ విడుదల చేసింది.

    ఈ ఉగ్రదాడి నేపథ్యాన్నే పరిగణలోకి తీసుకుని, ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్న భారతీయ పౌరులకు ఈ హెచ్చరికలు ఇచ్చింది.

    ఇక మరోవైపు, కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్‌పై కఠినమైన చర్యలకు సన్నద్ధమవుతోందని సమాచారం బయటకు వచ్చింది.

    ఇప్పటికే భారత్ పాక్‌పై దౌత్యపరమైన చర్యలు ప్రారంభించినట్టు తెలిసింది.

    అంతేకాదు, అవసరమైతే సైనిక స్థాయిలో స్పందించేందుకు కూడా సిద్ధంగా ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    పాక్‌లోని భారతీయులు వీలైనంత త్వరగా తిరిగి రావాలి

    Those Indian nationals currently in Pakistan are also advised to return to India at the earliest: MEA pic.twitter.com/aqjoue5Qan

    — Press Trust of India (@PTI_News) April 24, 2025

    వివరాలు 

     పాకిస్తాన్ పౌరుల వీసాల జారీపై కీలక నిర్ణయం 

    ''భారత పౌరులు పాకిస్తాన్‌కి ప్రయాణించకూడదని గట్టిగా హెచ్చరిస్తున్నాము.ఇప్పటికే అక్కడ ఉన్న వారు కూడా వీలైనంత త్వరగా భారత్‌కు తిరిగి రావాలని సలహా ఇస్తున్నాము''అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ(MEA)అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.

    మరోవైపు, భారత్ ప్రభుత్వంతో సంబంధాల నేపథ్యంలో పాకిస్తాన్ పౌరులకు వీసాల జారీపై కీలక నిర్ణయం తీసుకుంది.

    ఏప్రిల్ 27,2025 నుంచి పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తులకు భారత ప్రభుత్వం జారీచేసిన అన్ని వీసాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

    అలాగే,ఇప్పటికే జారీ అయిన వైద్య వీసాలు మాత్రం ఏప్రిల్ 29,2025 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది.

    ప్రస్తుతం భారతదేశంలో ఉన్న పాకిస్తాన్ జాతీయులు తమ వీసా గడువు ముగిసేలోపు,కొత్త నిబంధనల ప్రకారం దేశాన్ని విడిచి వెళ్లాలని కేంద్రం ఆదేశించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విదేశాంగశాఖ

    తాజా

    Shubhanshu Shukla: జూన్‌ 8న నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ లాంచ్ కాంప్లెక్స్ నుండి అంతరిక్షంలోకి వెళ్లనున్న భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా నాసా
    Ap news: మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై కేసు.. ఆయన కుటుంబ సభ్యులపై కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
    Encounter: జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు,ఉగ్రవాదుల మధ్య కాల్పులు.. ఉగ్రవాది హతం..! జమ్ముకశ్మీర్
    Vacation: అడవుల్లో ఏనుగుల్ని సహజంగా తిరుగుతూ చూడాలనుందా? భారతదేశంలో ఈ ఐదు ప్రదేశాలను తప్పక సందర్శించండి! పర్యాటకం

    విదేశాంగశాఖ

    MEA Memo: భారతీయ దౌత్యవేత్తలపై 'రహస్య మెమో'.. స్పదించిన విదేశాంగ శాఖ భారతదేశం
    Chinmoy Krishna Das: చిన్మోయ్‌ కృష్ణదాస్‌ అరెస్టుపై స్పందించిన భారత్‌ ఇస్కాన్
    Champions Trophy 2025: ఛాంపియన్స్‌ ట్రోఫీ.. పాకిస్థాన్‌కు భారత జట్టు వెళ్లడంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత  క్రీడలు
    Jaishankar: ఉగ్రవాదమే ఆ దేశాన్ని తినేస్తోంది.. పాకిస్థాన్‌పై మరోసారి మండిపడ్డ జైశంకర్ కేంద్ర ప్రభుత్వం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025