
Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలో మొదటిసారిగా సూది అవసరం లేకుండా రక్త పరీక్ష చేయగల ఏఐ ఆధారిత డయాగ్నోస్టిక్ టూల్ను నిలోఫర్లో అందుబాటులోకి తెచ్చారు.
నిలోఫర్ హాస్పిటల్,సుశేనా హెల్త్ ఫౌండేషన్ కలసి క్విక్ వైటల్స్ అనే ఈ టూల్ను పరిచయం చేశారు.
ఫోటోప్లెథిస్మోగ్రఫీ పద్ధతి ద్వారా మొబైల్లో ఫేస్ స్కానింగ్ చేస్తే, 20 నుండి 30 సెకన్లలో టెస్టులు పూర్తవుతాయి.
ఈ పరీక్ష విధానాన్ని మొదటగా నిలోఫర్లో అందుబాటులోకి తెచ్చిన తర్వాత, అది మహారాష్ట్రలో కూడా ప్రవేశపెట్టనున్నారు.
నిలోఫర్లో ఈ టెస్టులు ముఖ్యంగా పిల్లలకు, గర్భిణులకు ఎంతో ఉపయోగకరంగా ఉండనున్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మొబైల్లో ఫేస్ స్కానింగ్ ద్వారా టెస్టులు
Had the privilege of launching an AI ( Artificial Intelligence) driven , non invasive blood testing tool at a large Govt hospital in Hyderabad, Niloufer Hospital . To my left is Dr Ravi Kumar superintendent, and the hall is packed with doctors n media ..
— Karuna Gopal (@KarunaGopal1) May 19, 2025
Niloufer is a… pic.twitter.com/7REJRGhKg0