NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లపై సర్కార్ కీలక అప్డేట్.. డిసెంబర్ మొదటి వారంలో పథకం ప్రారంభం 
    తదుపరి వార్తా కథనం
    Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లపై సర్కార్ కీలక అప్డేట్.. డిసెంబర్ మొదటి వారంలో పథకం ప్రారంభం 
    ఇందిరమ్మ ఇళ్లపై సర్కార్ కీలక అప్డేట్.. డిసెంబర్ మొదటి వారంలో పథకం ప్రారంభం

    Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లపై సర్కార్ కీలక అప్డేట్.. డిసెంబర్ మొదటి వారంలో పథకం ప్రారంభం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 03, 2024
    11:30 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రధాన హామీలలో "ఇందిరమ్మ ఇళ్ల పథకం" కూడా ఒకటి.

    పార్టీ అధికారంలోకి వస్తే, ఇండ్లలేని పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చింది.

    ఖాళీ జాగాలో పేదల ఇళ్ల నిర్మాణానికి రూ.5లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు.

    జాగాలు లేని వారికీ జాగాతో పాటు రూ.5లక్షల ఆర్థిక సహాయం ఇవ్వడం మాట ఇచ్చారు. ఈ హామీని అమలు చేసే దిశగా తెలంగాణలోని ఇళ్ల లేని పేదలు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు.

    ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.

    ఈ ప్రకటన నేపథ్యంలో గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక సమాచారం ఇచ్చారు.

    వివరాలు 

    రూ. 3 వేల కోట్ల నిధులు కేటాయింపు 

    5 డిసెంబర్ నుంచి ఇందిరమ్మ ఇళ్ల యాప్ అందుబాటులోకి రానుందని మంత్రి తెలిపారు.

    దీనితో, సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

    ప్రారంభ దశలో, తెలంగాణ వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని నిర్ణయించారని మంత్రి చెప్పారు.

    ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్లు చొప్పున అందించనున్నారు. ఇందుకోసం రూ. 3 వేల కోట్ల నిధులు కేటాయించారని మంత్రి పేర్కొన్నారు.

    ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ పథకం తరువాతి నాలుగేళ్లపాటు కొనసాగుతుందని చెప్పారు.

    వివరాలు 

    సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు

    ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు.

    అందులో, అత్యంత నిరుపేదలకు, ముఖ్యంగా దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగుబూమి లేని వారు, పారిశుద్ధ్య కార్మికులు మొదలైన వారికి ముందస్తు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

    మొదటి దశలో సొంత స్థలాలున్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలని, ఈ విషయంలో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

    గ్రామ కార్యదర్శులు, మండల స్థాయి అధికారులు దీనిపై కృషి చేయాలని సూచించారు.

    ఇందిరమ్మ యాప్‌లో ఎలాంటి లోపాలు లేకుండా సాంకేతికతను వినియోగించాలని, తద్వారా గడువు గడిచినపుడు ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాలని సీఎం ఆదేశించారు.

    అదేవిధంగా ఆదివాసీ ప్రాంతాలలో, ఐటీడీఏ పరిధిలో ప్రత్యేక కోటా ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కూడా ఆయన అన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    తెలంగాణ

    Revanth Reddy: ఆర్టీసీ ప్రయాణం మరింత సౌకర్యవంతం.. త్వరలో 3 వేల ఎలక్ట్రిక్ బస్సులు రేవంత్ రెడ్డి
    Telangana High Court: తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపులపై హైకోర్టు తీర్పు రిజర్వు హైకోర్టు
    Degree new syllabus: డిగ్రీకి కొత్త సిలబస్‌.. త్వరలో సబ్జెక్టు రివిజన్‌ కమిటీల నియామకం భారతదేశం
    Revanth Reddy: 'మైలురాయిగా నిలుస్తుంది'.. కులగణనపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత రేవంత్ రెడ్డి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025