NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Lepakshi Knowledge Hub: లేపాక్షి భూముల్లో పారిశ్రామిక పార్కు
    తదుపరి వార్తా కథనం
    Lepakshi Knowledge Hub: లేపాక్షి భూముల్లో పారిశ్రామిక పార్కు
    లేపాక్షి భూముల్లో పారిశ్రామిక పార్కు

    Lepakshi Knowledge Hub: లేపాక్షి భూముల్లో పారిశ్రామిక పార్కు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 06, 2024
    03:30 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వైఎస్ హయాంలో అడ్డగోలుగా దోచుకునేందుకు ప్రయత్నించిన భూ పందేరాల్లో ఒకటి లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌.

    ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ భూములను పారిశ్రామిక అవసరాల కోసం ఉపయోగించాలని యత్నిస్తోంది.

    శ్రీ సత్యసాయి జిల్లాలోని లేపాక్షి భూముల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి భారీ పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేయాలని ప్రతిపాదన పంపాయి.

    ఇందుకు సంబంధించి కేంద్రంతో సంప్రదింపులు జరుగుతున్నాయి. మొత్తం 8,844 ఎకరాల భూమిని పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించేందుకు రాష్ట్రప్రభుత్వం కృషి చేస్తోంది.

    వివరాలు 

    కేంద్రం అనుమతిని పొందడానికి ప్రయత్నాలు

    ఈ భూములపై ఉన్న న్యాయపరమైన ఇబ్బందులను అధిగమించడం కీలకమైందని అధికారులు చెబుతున్నారు.

    ఈడీ స్వాధీనం చేసుకున్న లేపాక్షి భూములను పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించడానికి కేంద్రం అనుమతిని పొందడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

    ఏపీఐఐసీ ఇప్పటికే భూములను వెనక్కు పొందేందుకు చర్యలు ప్రారంభించింది.

    హైకోర్టు, నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ కేసులను పరిష్కరించడం సాధ్యమవుతుందని లీగల్‌ సెల్‌ అధికారులు భావిస్తున్నారు.

    వివరాలు 

    ఓర్వకల్‌.. కొప్పర్తి తరహాలో

    కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం విశాఖ-చెన్నై, హైదరాబాద్‌-బెంగళూరు, చెన్నై-బెంగళూరు పారిశ్రామిక నడవాలను అభివృద్ధి చేస్తోంది.

    ఇందులో భాగంగా పలు పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా, 9 వేల ఎకరాల్లో ప్రతిపాదించిన ఓర్వకల్‌ పారిశ్రామిక పార్కు మొదటి దశ అభివృద్ధికి కేంద్రం అనుమతించింది.

    ఈ అభివృద్ధి కోసం రూ.2,796 కోట్లు ఖర్చు చేయనున్నారు. అలాగే, 5,754 ఎకరాల్లో ప్రతిపాదించిన కొప్పర్తి పారిశ్రామిక పార్కు మొదటి దశను రూ.2,140 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు సమాచారం.

    ఈ తరహాలో లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ కేంద్ర భాగస్వామ్యంతో అభివృద్ధి చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    శ్రీ సత్యసాయి జిల్లా

    తాజా

    GT vs LSG: గుజరాత్ టైటాన్స్‌పై లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్ 33 పరుగుల తేడాతో విజయం ఐపీఎల్
    RCB: ఆర్సీబీ జట్టులో అనుకోని మార్పు.. ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతెల్ ప్లేఆఫ్స్‌కు దూరం  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌.. జవాన్ వీరమరణం  జమ్ముకశ్మీర్
    All party delegations: ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా యూఏఈ, జపాన్‌ ఆపరేషన్‌ సిందూర్‌

    శ్రీ సత్యసాయి జిల్లా

    ఆంధ్రప్రదేశ్‌: త్వరలోనే అదానీ గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టుల పనులు ప్రారంభం- 2028నాటికి పూర్తి చేయడమే లక్ష్యం ఆంధ్రప్రదేశ్
    శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోరం..భర్త,అతని ప్రియురాలికి పాక్షికంగా గుండు కొట్టించిన భార్య   ఆంధ్రప్రదేశ్
    Sri Sathya Sai: పుట్టపర్తిలో అద్భుత దృశ్యం.. శ్రీ సత్యసాయి మెడలో నాగుపాము   ఆంధ్రప్రదేశ్
    Andhra pradesh tahsildar: లంచం ఎందుకు తీసుకోవాలో చెప్పిన తహసీల్దారు.. వీడియో వైరల్  ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025