NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Sudha Murthy: 'యువత వినూత్న ఆవిష్కరణలు చేపట్టాలి'.. ఎస్సీ గురుకుల విద్యార్థులతో 'ఇన్ఫోసిస్‌' సుధామూర్తి
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Sudha Murthy: 'యువత వినూత్న ఆవిష్కరణలు చేపట్టాలి'.. ఎస్సీ గురుకుల విద్యార్థులతో 'ఇన్ఫోసిస్‌' సుధామూర్తి
    ఎస్సీ గురుకుల విద్యార్థులతో 'ఇన్ఫోసిస్‌' సుధామూర్తి

    Sudha Murthy: 'యువత వినూత్న ఆవిష్కరణలు చేపట్టాలి'.. ఎస్సీ గురుకుల విద్యార్థులతో 'ఇన్ఫోసిస్‌' సుధామూర్తి

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 25, 2025
    12:48 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    విద్యార్థులు ప్రతి క్షణాన్ని విలువైనదిగా భావించి తమ చదువుపై దృష్టి పెట్టాలని ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్, రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి సూచించారు.

    గురువులను గౌరవిస్తూ, జీవిత విలువలను పాటించడం అవసరమని చెప్పారు.

    ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తేనే విజయం సాధించగలమని, ప్రపంచం మీ కొత్త ఆవిష్కరణలను ఆసక్తిగా ఎదురుచూస్తోందని విద్యార్థులకు హితవు పలికారు.

    యువత తమ సృజనాత్మకతను వినియోగించుకుని, దేశ ఆర్థికాభివృద్ధికి సహాయపడాలని కోరారు.

    ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి అలగు వర్షిణి నేతృత్వంలో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

    ఈ భాగంగా సుధామూర్తి సోమవారం ఎస్సీ గురుకుల విద్యార్థులతో ఆన్‌లైన్లో మాట్లాడి, తన అనుభవాలు పంచుకున్నారు. విద్యార్థుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

    వివరాలు 

    సవాళ్లను అధిగమించి విజయం వైపు అడుగేయాలి 

    "1968లో ఇంజినీరింగ్ కళాశాలలు చాలా అరుదు. నేను నా కాలేజీకి వెళ్ళాలంటే రోజూ రెండు మైళ్లు నడవాల్సి వచ్చేది. తాత, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో సామాజిక పరిమితులను అధిగమించి ముందుకు వెళ్లాను. నా తరగతిలో నేను ఒక్కదానే బాలికను. అయినప్పటికీ తోటి విద్యార్థులు, ప్రిన్సిపల్ సహకారంతో విజయం సాధించాను. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని, నా భర్తతో కలిసి ఇన్ఫోసిస్‌ను స్థాపించాం" అని గుర్తుచేసుకున్నారు.

    అంతేగాక, "విద్యార్థులు జీవితంలో సాదాసీదాగా ఉండాలి. దుస్తులపై ఎక్కువ ఖర్చు చేయడం మంచిది కాదు. అనవసర ఖర్చులకు పోకుండా, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలి" అని వివరించారు.

    వివరాలు 

    సుధామూర్తి సూచనలు

    సవాళ్లను అధిగమిస్తే ఉన్నత శిఖరాలను చేరగలరు.

    జీవితంలో ఎంతటి ఆటంకాలొచ్చినా ధైర్యంగా నిలవాలి, నిరుత్సాహ పడకూడదు.

    వైఫల్యాల నుంచి నేర్చుకుని, విజయం వైపు అడుగేయాలి.

    క్రమశిక్షణ, సహనం, పట్టుదలతో పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలి.

    చదువు అనేది ఒక మార్గం. దానిని అభిరుచి, లక్ష్యంతో స్వీకరించి విజయం సాధించాలి.

    ఉపాధ్యాయుల సూచనలు పాటించి, క్రమశిక్షణతో ఉన్నత విజయాలు సాధించాలి.

    ధనాన్ని ఎవరైనా దొంగిలించగలరు, కానీ విజ్ఞానాన్ని ఎవరూ దొంగిలించలేరు.

    బాలికలు సరైన ఆహార అలవాట్లతో ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలి.

    ప్రతి విద్యార్థి నిన్నటి కంటే మెరుగుగా మారేందుకు ప్రతి రోజూ కృషి చేయాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇన్ఫోసిస్

    తాజా

    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా
    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్

    ఇన్ఫోసిస్

    Infosys: నెలకు 10 రోజులు ఆఫీస్ కి రావాల్సిందే.. ఉద్యోగులకు ఇన్ఫోసిస్ హుకుం  బిజినెస్
    Infosys: ఉద్యోగులకు 80శాతం బోనస్ ప్రకటించిన ఇన్ఫోసిస్  ఉద్యోగులు
    Narayana Murthy : డీప్‌ఫేక్ వీడియోలపై హెచ్చరించిన ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి.. నేను అలా అనలేదు, ఎవరూ నమ్మకండి  డీప్‌ఫేక్‌
    Infosys-Wipro-Tcs: విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్‌లలో 63,759 మంది ఉద్యోగాలను కోల్పోయారు  విప్రో
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025