NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / INS Arighat: ఐఎన్ఎస్ అరిఘాత్.. భారతదేశ రెండో అణు జలంతర్గామి నేడు ప్రారంభం 
    తదుపరి వార్తా కథనం
    INS Arighat: ఐఎన్ఎస్ అరిఘాత్.. భారతదేశ రెండో అణు జలంతర్గామి నేడు ప్రారంభం 
    ఐఎన్ఎస్ అరిఘాత్.. భారతదేశ రెండో అణు జలంతర్గామి నేడు ప్రారంభం

    INS Arighat: ఐఎన్ఎస్ అరిఘాత్.. భారతదేశ రెండో అణు జలంతర్గామి నేడు ప్రారంభం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Aug 29, 2024
    02:40 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశం తన రెండవ అణు శక్తితో నడిచే జలాంతర్గామిని నేడు ప్రారంభించబోతోంది. ఐఎన్‌ఎస్ అరిఘాత్ అని పిలిచే ఈ రెండవ అణు శక్తితో నడిచే బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామిని విశాఖపట్నంలో నేడు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభిస్తారు.

    రక్షణ వర్గాల సమాచారం ప్రకారం,ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి.

    నేవల్ స్టాఫ్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి,ఇండియన్ స్ట్రాటజిక్ కమాండ్ హెడ్ వైస్ అడ్మిరల్ సూరజ్ బెర్రీ, ఉన్నత DRDO అధికారులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

    ఈ ఐఎన్‌ఎస్ అరిఘాత్ భారతదేశ మొదటి SSBN(షిప్,సబ్‌మెర్సిబుల్,బాలిస్టిక్,న్యూక్లియర్) జలాంతర్గామి అయిన ఐఎన్‌ఎస్ అరిహంత్‌కి అప్‌గ్రేడ్ వెర్షన్‌గా రూపొందించబడింది.

    తాజా జలాంతర్గామి భారతీయ నౌకాదళ శక్తిని మరింతగా పెంచబోతోంది,ముఖ్యంగా దేశం వ్యూహాత్మక అణు నిరోధక సామర్థ్యాలను మెరుగుపరచనుంది.

    వివరాలు 

    ఇందులో నాలుగు లాంచ్ ట్యూబ్స్

    ఇది 4-SSBN ప్రాజెక్టు భాగం కింద అభివృద్ధి చేయబడింది.ప్రస్తుతం S4,S4* పేరుతో మరిన్ని జలాంతర్గాములు నిర్మాణంలో ఉన్నాయి.

    ఐఎన్‌ఎస్ అరిఘాత్ నీటి ఉపరితలంపై గరిష్టంగా 12-15 నాట్స్(22-28 కి.మీ/గంట)వేగంతో ప్రయాణించగలదు.నీటి లోపల 24 నాట్స్(44 కి.మీ/గంట)వరకు వేగాన్ని చేరుకోగలదు.

    ఇందులో నాలుగు లాంచ్ ట్యూబ్స్ ఉంటాయి.వీటితో క్షిపణులను ప్రయోగించవచ్చు.ఇది 3,500 కిలోమీటర్ల దూరం మించే పరిధి కలిగిన నాలుగు K-4 అణు సామర్థ్యం గల SLBMలను (సబ్‌మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిస్సైల్స్)లేదా 750 కిలోమీటర్ల పరిధి కలిగిన పన్నెండు K-15 SLBMలను మోసుకెళ్లగలదు.

    K-15క్షిపణులకు అణు వార్‌హెడ్‌ను అమర్చే సామర్థ్యం కూడా ఉంది.అదనంగా,అరిఘాత్ టార్పెడోలతో కూడిన రక్షణ వ్యవస్థలను కలిగి ఉంటుంది.

    2017లో విశాఖపట్నంలోని షిప్ బిల్డింగ్ సెంటర్(SBC)లో ఈజలాంతర్గామి నిర్మాణం ప్రారంభమైంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా

    తాజా

    IPL 2025: టీ20లో నాలుగు వేల క్ల‌బ్‌లో అభిషేక్..  అభిషేక్ శర్మ
    Donald Trump: 'ఆపిల్‌'కు ట్రంప్‌ వార్నింగ్‌.. అలాచేస్తే 25% సుంకం చెల్లించాల్సిందే! డొనాల్డ్ ట్రంప్
    RBI dividend payout: కేంద్రానికి ఆర్‌బీఐ గుడ్‌న్యూస్‌.. రూ.2.69 లక్షల కోట్లు చెల్లించేందుకు నిర్ణయం  ఆర్ బి ఐ
    Harvard University: ట్రంప్ పరిపాలనపై హార్వర్డ్ విశ్వవిద్యాలయం దావా   అమెరికా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025