NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కొత్త పార్లమెంట్ భవనంలో చారిత్రక 'రాజదండం' ఏర్పాటు; స్వాతంత్య్రానికి దానికి ఉన్నసంబంధాన్ని తెలుసుకోండి 
    కొత్త పార్లమెంట్ భవనంలో చారిత్రక 'రాజదండం' ఏర్పాటు; స్వాతంత్య్రానికి దానికి ఉన్నసంబంధాన్ని తెలుసుకోండి 
    1/3
    భారతదేశం 1 నిమి చదవండి

    కొత్త పార్లమెంట్ భవనంలో చారిత్రక 'రాజదండం' ఏర్పాటు; స్వాతంత్య్రానికి దానికి ఉన్నసంబంధాన్ని తెలుసుకోండి 

    వ్రాసిన వారు Naveen Stalin
    May 24, 2023
    04:25 pm
    కొత్త పార్లమెంట్ భవనంలో చారిత్రక 'రాజదండం' ఏర్పాటు; స్వాతంత్య్రానికి దానికి ఉన్నసంబంధాన్ని తెలుసుకోండి 
    కొత్త పార్లమెంట్ భవనంలో చారిత్రక 'రాజదండం' ఏర్పాటు; స్వాతంత్ర్యానికి దానికి ఉన్నసంబంధాన్ని తెలుసుకోండి

    కొత్త పార్లమెంట్ భవనాన్ని మే 28న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవానికి కేంద్రం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం కొత్త పార్లమెంట్ భవనంలో ఏర్పాటు చేయనున్న చారిత్రక వస్తువు గురించి కీలక ప్రకటన చేశారు. స్పీకర్ సీటు దగ్గర చారిత్రాత్మక బంగారు 'సెంగోల్'ను ప్రతిష్టించనున్నట్లు కేంద్ర అమిత్ షా తెలిపారు. 'సెంగోల్'ను రాజదండగా కూడా పిలుస్తారు. బ్రిటిష్ వారి నుంచి భారతీయులకు అధికార మార్పిడికి గుర్తుగా ఈ రాజదండాన్ని దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూకు అప్పగించినట్లు అమిత్ షా చెప్పారు. 'సెంగోల్'ను తమిళ రాచరికానికి ప్రతీక భావిస్తారు. సెంగోల్ అనేది తమిళ పదం "సెమ్మై" నుంచి ఉద్భవించింది. సెమ్మై అంటే ధర్మం అని అర్థం.

    2/3

    సెంగోల్ చరిత్ర ఇదే

    1947లో భారత్‌కు స్వాతంత్ర్యం ఇచ్చే సమయంలో అధికార మార్పిడికి గుర్తు ఏదైనా చేస్తే బాగుంటుందని బ్రిటీష్ ఇండియా చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్, జవహర్‌లాల్ నెహ్రూ మధ్య తీవ్ర చర్చలు జరిగాయి. అధికార మార్పిడికి సంకేతంగా ఏం చేయాలనేది ఎంతకీ పాలుపోకపోవడంతో అప్పటి గవర్నర్ జనరల్ సి.రాజగోపాలాచారి(రాజాజీ)ని నెహ్రూ సలహా అడిగారు. ఈ క్రమంలో చోళుల పాలనలో అధికార మార్పిడి సమయంలో జరిగిన తమిళ సంప్రదాయాన్ని ఈ సందర్భంగా నెహ్రూకు రాజగోపాలాచారి చెప్పారు. చోళుల పాలనలో కొత్త రాజు అధికారంలోకి రాగానే బంగారపు రాజదండాన్ని అప్పగిస్తారు. ఇప్పుడు అదే సంప్రదాయాన్ని పాటిస్తే బాగుటుందని రాజాజీ చెప్పడంతో నెహ్రూ ఓకే అనేశారు.

    3/3

    న్యాయానికి ప్రతీకగా రాజదండంపై నంది ప్రతిమ

    భారతదేశ స్వాతంత్రానికి గుర్తుగా రాజాదండాన్ని అప్పటికప్పుడు తాయారు చేయడం అనేది చాలా కష్టంతో కూడకున్న పని అని రాజాజీ భావించారు. వెంటనే తమిళనాడులోని ప్రముఖ మఠమైన తిరువడుతురై అథీనంను సంప్రదించారు. ఆ మఠాధిపతి మద్రాసులోని నగల వ్యాపారి వుమ్మిడి చెట్టికి బంగారపు రాజదండాన్ని తయారు చేసే బాధ్యతలను అప్పగించారు. వుమ్మిడి చెట్టి 5అడుగుల పొడవు, దాని పైన న్యాయానికి ప్రతీక అయిన 'నంది'తో కూడిన సెంగోల్‌ను తయారు చేశారు. స్వాతంత్రం రావడానికి సరిగ్గా 15నిమిషాల ముందు, సెంగోల్‌ను గంగాజలంతో శుద్ధి చేసి, మౌంట్ బాటన్‌కు పూజారి అప్పగించారు. ఆ తర్వాత ఆ రాజదండాన్ని అప్పటి ప్రధాని నెహ్రూకు మౌంట్ బాటన్‌ అందజేశారు. ఆ రాజదండం నెహ్రూ అందుకోవడంతో అధికారాల బదిలీ అధికారికంగా జరిగినట్లుయ్యింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    అమిత్ షా
    పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి
    తాజా వార్తలు
    ప్రధాన మంత్రి
    నరేంద్ర మోదీ

    అమిత్ షా

    మరింత ధృడంగా కేంద్ర బలగాలు; భోజనంలో 30శాతం మిల్లెట్లను ఇవ్వాలని హోంశాఖ నిర్ణయం హోంశాఖ మంత్రి
    తెలంగాణలో ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తానన్న అమిత్ షాపై ఒవైసీ ఫైర్  అసదుద్దీన్ ఒవైసీ
    కర్ణాటక ఎన్నికలు 2023: ప్రచారంలో దూకుడు పెంచిన బీజేపీ; అగ్రనేతల హడావుడి  కర్ణాటక
    West Bengal: శ్రీరామనవమి వేడుకల్లో చెలరేగిన హింసపై ప్రభుత్వాన్ని నివేదిక కోరిన కేంద్ర హోంశాఖ పశ్చిమ బెంగాల్

    పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి

    ప్రతిపక్షాలు వర్సెస్ బీజేపీ: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభంపై రాజకీయ రగడ బీజేపీ
    ఈ నెలలోనే కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్న ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    Women's Reservation Bill: మహిళా రిజర్వేషన్‌‌ను సాధించే వరకూ విశ్రమించేది లేదు: ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత
    జనవరి 31నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు, ఏప్రిల్ 6న ముగింపు ప్రహ్లాద్ జోషి

    తాజా వార్తలు

    వైట్‌హౌస్ వద్ద తెలుగు యువకుడి హల్‌చల్; అమెరికా అధ్యక్షుడు బైడెన్‌పై దాడికి ప్లాన్  అమెరికా
    21రోజుల పాటు తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు; ఏ రోజున ఏం చేస్తారో తెలుసుకుందాం తెలంగాణ
    ఆస్ట్రేలియాలో ఆలయాలపై దాడుల అంశాన్ని లేవనెత్తిన ప్రధాని మోదీ; కఠినమైన చర్యలకు అల్బనీస్ హామీ  నరేంద్ర మోదీ
    త్వరలోనే సికింద్రాబాద్- నాగ్‌పూర్ మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ పరుగులు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు

    ప్రధాన మంత్రి

    పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి ప్రతిపక్షాలు దూరం.. 19 పార్టీలు ఉమ్మడి ప్రకటన రాష్ట్రపతి
    మే 28న కొత్త పార్లమెంట్ భవనం ఎదుట రెజ్లర్ల మహిళా మహాపంచాయతీ దిల్లీ
    నరేంద్ర మోదీని 'ది బాస్' అని పిలిచిన ఆస్ట్రేలియా ప్రధాని నరేంద్ర మోదీ
    భారత్-ఆస్ట్రేలియా బంధాన్ని క్రికెట్, మాస్టర్‌చెఫ్ ఏకం చేశాయి: ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ

    నరేంద్ర మోదీ

    సిడ్నీలో ప్రధాని మోదీ అరుదైన స్వాగతం; 'వెల్‌కమ్ మోదీ' అంటూ ఆకాశంలో సందేశం ప్రధాన మంత్రి
    ప్రధాని మోదీకి ఫిజీ, పపువా న్యూ గినియా దేశాల అత్యున్నత పురస్కారాలు ప్రదానం  ప్రధాన మంత్రి
    జపాన్‌: హిరోషిమాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ  జపాన్
    జీ7 సదస్సు కోసం నేడు జపాన్‌కు మోదీ; ప్రధాని ఎజెండాలోని అంశాలు ఇవే  ప్రధాన మంత్రి
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023