NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కొత్త పార్లమెంట్ భవనంలో చారిత్రక 'రాజదండం' ఏర్పాటు; స్వాతంత్య్రానికి దానికి ఉన్నసంబంధాన్ని తెలుసుకోండి 
    తదుపరి వార్తా కథనం
    కొత్త పార్లమెంట్ భవనంలో చారిత్రక 'రాజదండం' ఏర్పాటు; స్వాతంత్య్రానికి దానికి ఉన్నసంబంధాన్ని తెలుసుకోండి 
    కొత్త పార్లమెంట్ భవనంలో చారిత్రక 'రాజదండం' ఏర్పాటు; స్వాతంత్ర్యానికి దానికి ఉన్నసంబంధాన్ని తెలుసుకోండి

    కొత్త పార్లమెంట్ భవనంలో చారిత్రక 'రాజదండం' ఏర్పాటు; స్వాతంత్య్రానికి దానికి ఉన్నసంబంధాన్ని తెలుసుకోండి 

    వ్రాసిన వారు Stalin
    May 24, 2023
    04:25 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కొత్త పార్లమెంట్ భవనాన్ని మే 28న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవానికి కేంద్రం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.

    కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం కొత్త పార్లమెంట్ భవనంలో ఏర్పాటు చేయనున్న చారిత్రక వస్తువు గురించి కీలక ప్రకటన చేశారు.

    స్పీకర్ సీటు దగ్గర చారిత్రాత్మక బంగారు 'సెంగోల్'ను ప్రతిష్టించనున్నట్లు కేంద్ర అమిత్ షా తెలిపారు.

    'సెంగోల్'ను రాజదండగా కూడా పిలుస్తారు.

    బ్రిటిష్ వారి నుంచి భారతీయులకు అధికార మార్పిడికి గుర్తుగా ఈ రాజదండాన్ని దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూకు అప్పగించినట్లు అమిత్ షా చెప్పారు.

    'సెంగోల్'ను తమిళ రాచరికానికి ప్రతీక భావిస్తారు.

    సెంగోల్ అనేది తమిళ పదం "సెమ్మై" నుంచి ఉద్భవించింది. సెమ్మై అంటే ధర్మం అని అర్థం.

    దిల్లీ

    సెంగోల్ చరిత్ర ఇదే

    1947లో భారత్‌కు స్వాతంత్ర్యం ఇచ్చే సమయంలో అధికార మార్పిడికి గుర్తు ఏదైనా చేస్తే బాగుంటుందని బ్రిటీష్ ఇండియా చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్, జవహర్‌లాల్ నెహ్రూ మధ్య తీవ్ర చర్చలు జరిగాయి.

    అధికార మార్పిడికి సంకేతంగా ఏం చేయాలనేది ఎంతకీ పాలుపోకపోవడంతో అప్పటి గవర్నర్ జనరల్ సి.రాజగోపాలాచారి(రాజాజీ)ని నెహ్రూ సలహా అడిగారు.

    ఈ క్రమంలో చోళుల పాలనలో అధికార మార్పిడి సమయంలో జరిగిన తమిళ సంప్రదాయాన్ని ఈ సందర్భంగా నెహ్రూకు రాజగోపాలాచారి చెప్పారు.

    చోళుల పాలనలో కొత్త రాజు అధికారంలోకి రాగానే బంగారపు రాజదండాన్ని అప్పగిస్తారు.

    ఇప్పుడు అదే సంప్రదాయాన్ని పాటిస్తే బాగుటుందని రాజాజీ చెప్పడంతో నెహ్రూ ఓకే అనేశారు.

    దిల్లీ

    న్యాయానికి ప్రతీకగా రాజదండంపై నంది ప్రతిమ

    భారతదేశ స్వాతంత్రానికి గుర్తుగా రాజాదండాన్ని అప్పటికప్పుడు తాయారు చేయడం అనేది చాలా కష్టంతో కూడకున్న పని అని రాజాజీ భావించారు.

    వెంటనే తమిళనాడులోని ప్రముఖ మఠమైన తిరువడుతురై అథీనంను సంప్రదించారు.

    ఆ మఠాధిపతి మద్రాసులోని నగల వ్యాపారి వుమ్మిడి చెట్టికి బంగారపు రాజదండాన్ని తయారు చేసే బాధ్యతలను అప్పగించారు.

    వుమ్మిడి చెట్టి 5అడుగుల పొడవు, దాని పైన న్యాయానికి ప్రతీక అయిన 'నంది'తో కూడిన సెంగోల్‌ను తయారు చేశారు.

    స్వాతంత్రం రావడానికి సరిగ్గా 15నిమిషాల ముందు, సెంగోల్‌ను గంగాజలంతో శుద్ధి చేసి, మౌంట్ బాటన్‌కు పూజారి అప్పగించారు.

    ఆ తర్వాత ఆ రాజదండాన్ని అప్పటి ప్రధాని నెహ్రూకు మౌంట్ బాటన్‌ అందజేశారు.

    ఆ రాజదండం నెహ్రూ అందుకోవడంతో అధికారాల బదిలీ అధికారికంగా జరిగినట్లుయ్యింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమిత్ షా
    పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి
    తాజా వార్తలు
    ప్రధాన మంత్రి

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    అమిత్ షా

    త్రిపురలో అసెంబ్లీ పోరు: 'రథయాత్ర'తో ప్రజల్లోకి బీజేపీ త్రిపుర
    తెలంగాణకు మరో కేంద్ర మంత్రి పదవి? ఆ నలుగురిలో వరించేదెవరిని? బీజేపీ
    అదానీ వ్యవహారంపై మౌనం వీడిన అమిత్ షా భారతీయ జనతా పార్టీ/బీజేపీ
    అమిత్ షా నేతృత్వంలో బీజేపీ నేతల సమావేశం; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై చర్చ తెలంగాణ

    పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి

    జనవరి 31నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు, ఏప్రిల్ 6న ముగింపు ప్రహ్లాద్ జోషి
    Women's Reservation Bill: మహిళా రిజర్వేషన్‌‌ను సాధించే వరకూ విశ్రమించేది లేదు: ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత
    ఈ నెలలోనే కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్న ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    ప్రతిపక్షాలు వర్సెస్ బీజేపీ: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభంపై రాజకీయ రగడ బీజేపీ

    తాజా వార్తలు

    హైదరాబాద్‌కు సమాంతరంగా మరో నగరం నిర్మాణం సాధ్యమేనా? జీఓ 111రద్దు వెనుక ప్రభుత్వం వ్యూహం అదేనా? హైదరాబాద్
    పునియా, ఫోగట్ నార్కో టెస్ట్ చేయించుకుంటే నేను కూడా రెడీ: ఆర్ఎఫ్ఐ చీఫ్ శరణ్ సింగ్  రెజ్లింగ్
    నేటి నుంచి శ్రీనగర్‌లో జీ20 సమావేశం; భద్రత కట్టుదిట్టం  జీ20 సమావేశం
    ఎండల నుంచి ఉపశమనం; మరో మూడు రోజులు వర్షాలు తెలంగాణ

    ప్రధాన మంత్రి

    వినియోగదారులకు కేంద్రం గుడ్‌న్యూస్; 10శాతం తగ్గనున్న వంటగ్యాస్ ధరలు గ్యాస్
    'దేశానికి విద్యావంతులైన ప్రధాని కావాలి'; మోదీని ఉద్దేశించి సిసోడియా లేఖ మనీష్ సిసోడియా
    రేపు సికింద్రాబాద్-తిరుపతి వందే‌భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం; ట్రైన్ రూట్, టికెట్ ధరలను తెలుసుకోండి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    రేపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆంక్షలు; 10వ నంబర్ ప్లాట్‌ఫామ్ మూసివేత సికింద్రాబాద్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025