NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 'Insult To Tribals':రాష్ట్రపతిని ఉద్దేశించి సోనియా గాంధీ,రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ప్రధాని మోదీ ఫైర్.. 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    'Insult To Tribals':రాష్ట్రపతిని ఉద్దేశించి సోనియా గాంధీ,రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ప్రధాని మోదీ ఫైర్.. 
    రాష్ట్రపతిని ఉద్దేశించి సోనియా గాంధీ,రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ప్రధాని మోదీ ఫైర్..

    'Insult To Tribals':రాష్ట్రపతిని ఉద్దేశించి సోనియా గాంధీ,రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ప్రధాని మోదీ ఫైర్.. 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 31, 2025
    06:58 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బడ్జెట్ సమావేశాలకు ముందు పార్లమెంట్ సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు.

    అయితే, ఈ ప్రసంగంపై కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేక స్పందన వ్యక్తం చేశాయి.

    ముఖ్యంగా, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ రాష్ట్రపతిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

    ఢిల్లీలోని ద్వారకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ, సోనియా గాంధీ వ్యాఖ్యలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.

    గిరిజన వర్గానికి చెందిన రాష్ట్రపతిని అవమానించారని ఆయన మండిపడ్డారు.

    వివరాలు 

    బీజేపీ తీవ్ర ఆగ్రహం

    కాంగ్రెస్ నేతృత్వం ద్రౌపది ముర్ముపై అహంకారంతో కూడిన ధోరణిని ప్రదర్శించిందని మోడీ ఆరోపించారు.

    ''రాజకుటుంబం (షాహీ పరివార్)వారిని చూడండి. గిరిజన నేపథ్యం నుంచి వచ్చిన రాష్ట్రపతిని అవమానించారు. ఆ కుటుంబానికి చెందిన ఒకరు ఆమె ప్రసంగాన్ని 'బోరింగ్'గా అభివర్ణించారు. మరొకరు 'పాపం' అంటూ గిరిజనులను కించపరిచారు'' అని మోడీ నేరుగా సోనియా గాంధీ పేరు ప్రస్తావించకుండా విమర్శించారు.

    రాష్ట్రపతి ప్రసంగం అనంతరం, సోనియా గాంధీ మాట్లాడు,''రాష్ట్రపతి చివరికి అలసిపోయారు. ఆమె మాట్లాడలేకపోయింది, పాపం'' అని వ్యాఖ్యానించారు.

    రాహుల్ గాంధీ కూడా ప్రసంగాన్ని'బోరింగ్' అని అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

    ఇది రాజ్యాంగ పరంగా అత్యున్నత పదవిని అవమానించినట్లుగా మోదీ ఆరోపించారు.

    వివరాలు 

    రాష్ట్రపతిపై మాకు గౌరవం పూర్ణంగా ఉంది: ప్రియాంక 

    గిరిజనులపై కాంగ్రెస్ వైఖరి ఎలా ఉందో అర్థమవుతుందని అని మోడీ అన్నారు.

    అయితే, ఈ వివాదంపై ఎంపీ ప్రియాంకా గాంధీ స్పందిస్తూ, ''నా తల్లి 78 ఏళ్ల మహిళ. రాష్ట్రపతి సుదీర్ఘ ప్రసంగం వల్ల అలసిపోయారని మాత్రమే వ్యాఖ్యానించారు. రాష్ట్రపతిపై మాకు గౌరవం పూర్ణంగా ఉంది. కానీ మీడియా ఈ విషయాన్ని వక్రీకరించడం విచారకరం'' అని వివరణ ఇచ్చారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    సోనియా గాంధీ
    రాహుల్ గాంధీ
    ద్రౌపది ముర్ము

    తాజా

    Upcoming SUVs: ఈ జూన్‌లో భారత్‌ మార్కెట్‌లోకి రాబోతున్న టాప్ 5 ఎస్‌యూవీలు ఇవే! టాటా మోటార్స్
    Abhirami: కమల్‌తో లిప్‌లాక్ వివాదంపై నటి అభిరామి క్లారిటీ కమల్ హాసన్
    UPI app: యూపీఐ వినియోగదారులకు హెచ్చరిక.. ఇకపై బ్యాలెన్స్ చెక్‌కు 50 సార్లు మాత్రమే ఛాన్స్! యూపీఐ
    Vivo T4 Ultra: వివో T4 Ultra వచ్చేస్తోంది.. 100X జూమ్, ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో లాంచ్‌కు సిద్ధం!  స్మార్ట్ ఫోన్

    నరేంద్ర మోదీ

    PM Modi: 'కాంగ్రెస్ అసత్య ప్రచారం చేస్తోంది'..అంబేద్కర్ వివాదంపై మోదీ స్పందన కాంగ్రెస్
     PM Modi: 'జట్టు కోసం ఎప్పుడూ ముందుంటావు'.. అశ్విన్‌పై మోదీ ప్రశంసలు రవిచంద్రన్ అశ్విన్
    Narendra Modi: కువైట్‌ పర్యటనలో ప్రధాని మోదీకి ప్రత్యేక గౌరవం ఇండియా
    Rozgar Mela: ఏడాదిన్నర కాలంలో రికార్డు స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాలు అందించాం: ప్రధాని మోదీ  భారతదేశం

    సోనియా గాంధీ

    'అప్పటి వరకు టీషర్ట్ మీదనే ఉంటా'.. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవంలో రాహుల్ ఆసక్తికర కామెంట్స్ భారతదేశం
    రాహుల్ భద్రతపై కాంగ్రెస్ అనుమానాలు.. కేంద్రం ఏం అంటోంది? భారతదేశం
    గాంధీలకు నెహ్రూ ఇంటి పేరు అంటే భయమెందుకు?: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    ఈనెల 24-26తేదీల్లో కాంగ్రెస్ ప్లీనరీ- కొత్త సీడబ్ల్యూసీ నియామకం ఎలా ఉండబోతోంది? కాంగ్రెస్

    రాహుల్ గాంధీ

    Saif-Rahul Gandhi: రాహుల్ గాంధీ నిజాయితీ గల రాజకీయ నేత:సైఫ్ అలీ ఖాన్   భారతదేశం
    Rahul Gandhi: రాహుల్ గాంధీకి పుణే కోర్టు సమన్లు.. సావర్కర్ వ్యాఖ్యలపై పరువు నష్టం కేసు  పుణే
    Rahul Gandi: కులగణనకు మద్దతుగా 50% రిజర్వేషన్ పరిమితిని ఎత్తివేయాలి.. రాహుల్ గాంధీ కాంగ్రెస్
    Haryana Results: హర్యానాలో గెలుపుపై నమ్మకం పెట్టుకున్న కాంగ్రెస్.. కలిసిరాని జాట్లు, జిలేబీ..  హర్యానా

    ద్రౌపది ముర్ము

    యుద్ధ విమానంలో ప్రయాణించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి
    బొల్లారం రాష్ట్రపతి నిలయంలోకి విద్యార్థులకు ఉచిత ప్రవేశం; నేటి నుంచి ఆన్‌లైన్‌లో టికెట్లు తెలంగాణ
    బిహార్ డాన్ ఆనంద్ మోహన్ సింగ్ విడుదలపై ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ అసోసియేషన్ అభ్యంతరం  ఆంధ్రప్రదేశ్
    ప్రతిపక్షాలు వర్సెస్ బీజేపీ: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభంపై రాజకీయ రగడ బీజేపీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025