NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తలలు తెగే చోటుకు పెట్టుబడులు ఎలా వస్తాయ్: రాజస్థాన్‌లో కాంగ్రెస్‌పై మోదీ విమర్శలు 
    తదుపరి వార్తా కథనం
    తలలు తెగే చోటుకు పెట్టుబడులు ఎలా వస్తాయ్: రాజస్థాన్‌లో కాంగ్రెస్‌పై మోదీ విమర్శలు 
    తలలు తెగే చోటుకు పెట్టుబడులు ఎలా వస్తాయ్: రాజస్థాన్‌లో కాంగ్రెస్‌పై మోదీ విమర్శలు

    తలలు తెగే చోటుకు పెట్టుబడులు ఎలా వస్తాయ్: రాజస్థాన్‌లో కాంగ్రెస్‌పై మోదీ విమర్శలు 

    వ్రాసిన వారు Stalin
    Oct 02, 2023
    04:15 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఈ ఏడాది చివర్‌లో రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆ రాష్ట్రంపై ఫోకస్ పెట్టారు.

    మోదీ సోమవారం రాజస్థాన్‌లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.

    ఈ సందర్భంగా ప్రధాని మోదీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

    గత ఏడాది జూన్‌లో ఉదయ్‌పూర్‌కు చెందిన టైలర్ కన్హయ్య లాల్‌ను హత్య చేసిన ఉదంతంపై రాజస్థాన్‌లోని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని మోదీ టార్గెట్ చేశారు.

    ఉదయ్‌పూర్‌లో ఏం జరిగిందో ఎవరూ ఊహించలేదన్నారు. బట్టలు కుట్టించుకుంటామనే నెపంతో జనం వచ్చి దర్జీల గొంతులు కోసి హంతకులు భయ లేకుండా తీరుగుతున్నారన్నారు.

    కన్హయ్య లాల్‌ హత్యను కాంగ్రెస్ ఓటు బ్యాంకును రాజకీయాలకు వాడుకుందన్నారు.

    మోదీ

    నేరస్థుల పట్ల ఉదాసీతతో వ్యవహస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: మోదీ

    రాష్ట్రంలో ఇక్కడ తలలు నరికే ఘటనలు జరుగుతుంటే, పెట్టుబడులు ఎలా వస్తాయని మోదీ అన్నారు.

    రాజస్థాన్‌లో శాంతిభద్రతలపై కూడా గెహ్లాట్‌ ప్రభుత్వాన్ని మోదీ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం నేరస్థుల పట్ల ప్రేమగా వ్వవహరిస్తోందన్నారు.

    వారిపై చర్యలు తీసుకోకుండా, నేరస్థులకు స్వేచ్ఛ ఇస్తోందన్నారు. గతేడాది జూన్ 28న ఉదయ్‌పూర్‌లోని తన దుకాణంలో కన్హయ్య లాల్ పని చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు వచ్చి అతడిని నరికి చంపి అక్కడి నుంచి పారిపోయారు.

    సీసీటీవీ కెమెరాలో రికార్డయిన ఈ ఘటన మొత్తం వైరల్‌గా మారింది. ఈ దారుణ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

    కన్హయ్య లాల్‌ హత్యకేసులో ప్రమేయం ఉందన్న ఆరోపణలపై 11 మందిపై నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) చార్జిషీట్‌ దాఖలు చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాజస్థాన్
    నరేంద్ర మోదీ
    ప్రధాన మంత్రి
    అశోక్ గెహ్లాట్

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    రాజస్థాన్

    గుజరాత్‌,రాజస్థాన్‌,మధ్యప్రదేశ్‌లను ముంచెత్తిన భారీ వర్షాలు.. 3 రాష్ట్రాలకు పొంచిఉన్న వరద ముప్పు తుపాను
    రిటైర్మెంట్ వయసులో కవలలకు జన్మనిచ్చిన వృద్ధురాలు భారతదేశం
    దర్గాలో డ్యాన్స్ చేసిన మహిళ.. తప్పుబట్టిన మతపెద్దలు, దర్గా నిర్వాహకులు మహిళ
    రాజస్థాన్‌లో కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. ఎన్నికల నోటిఫికేషన్ ముందే అభ్యర్థుల ప్రకటన! కాంగ్రెస్

    నరేంద్ర మోదీ

    రాజ్‌ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులర్పించిన జీ20 దేశాధినేతలు  దిల్లీ
    G20 summit: ముగిసిన దిల్లీ జీ20 సమ్మిట్.. బ్రెజిల్‌కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోదీ  జీ20 సమావేశం
    కెనడా ప్రధానితో మోదీ ద్వైపాక్షిక సమావేశం.. ఖలిస్థానీ తీవ్రవాదంపై ఆందోళన  కెనడా
    భారత్‌కు సౌదీ అత్యంత వ్యూహాత్మక భాగస్మామి: ద్వైపాక్షిక భేటీలో ప్రధాని మోదీ  సౌదీ అరేబియా

    ప్రధాన మంత్రి

    PM Modi Pune Visit: 'మిస్టర్ క్రైమ్ మినిస్టర్ గో బ్యాక్'.. పుణెలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు  నరేంద్ర మోదీ
    ఈ నెల 8న అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో చర్చ; 10న ప్రధాని మోదీ స్పీచ్  అవిశ్వాస తీర్మానం
    18 ఏళ్ల వైవాహిక జీవితానికి బ్రేక్.. భార్యకి విడాకులు ఇస్తున్న కెనడా ప్రధాని కెనడా
    PM Modi: 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన  నరేంద్ర మోదీ

    అశోక్ గెహ్లాట్

    రాజస్థాన్ కాంగ్రెస్‌లో వర్గపోరు; అధిష్టానం హెచ్చరికను లెక్కచేయకుండా సచిన్ పైలెట్ నిరాహార దీక్ష  కాంగ్రెస్
    సచిన్ పైలెట్ 'జన్ సంఘర్ష్ యాత్ర'; అశోక్ గెహ్లాట్‌పై మరోసారి ఫైర్ రాజస్థాన్
    నీతి ఆయోగ్ సమావేశానికి 8మంది ముఖ్యమంత్రులు గైర్హాజరు; ఎందుకో తెలుసా? దిల్లీ
    రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో స్నేహగీతం; అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్‌ మధ్య శాంతి ఒప్పందం  రాజస్థాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025