NIA Raids: 4 రాష్ట్రాలు.. 19 ప్రదేశాల్లో ఎన్ఐఏ దాడులు
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(NIA)దక్షిణ భారతదేశంలోని 19 ప్రదేశాలలో "అత్యంత రాడికలైజ్డ్ జిహాదీ టెర్రర్ గ్రూప్"ని ఛేదించడం ద్వారా సోదాలు నిర్వహించిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ ఉదయం నుంచి దాడులు కొనసాగుతున్నాయి. యాంటీ టెర్రర్ ఏజెన్సీ రాష్ట్ర పోలీసు బలగాల సమన్వయంతో ఈ దాడులను నిర్వహిస్తోంది. కర్ణాటకలో 11,జార్ఖండ్లో నాలుగు,మహారాష్ట్రలో మూడు,ఢిల్లీలో ఒకచోట సోదాలు జరుగుతున్నాయి.
మహారాష్ట్రలో 40 చోట్ల దాడులు..15 మంది అరెస్ట్
గత వారం,సెంట్రల్ యాంటీ టెర్రర్ ఏజెన్సీ మహారాష్ట్రలోని 40 చోట్ల దాడులు చేసి 15 మందిని అరెస్టు చేసింది. అరెస్టయిన నిందితుల్లో ఒకరు ISIS మాడ్యూల్కు చెందిన నాయకుడు . ఈ దాడుల్లో పెద్ద మొత్తంలో లెక్కకు మించిన నగదు,ఆయుధాలు,పదునైన పనిముట్లు, సున్నితమైన పత్రాలు,వివిధ డిజిటల్ పరికరాలను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. నిందితులు 'విదేశీ హ్యాండ్లర్ల' ఆదేశానుసారం భారత్లో కార్యకలాపాలు సాగిస్తున్నారని, దేశంలో ఉగ్రవాద కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని ఎన్ఐఏ అధికారులు తెలిపారు.