Page Loader
Sonia Gandhi: ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం.. భారత్ మౌనంపై సోనియా గాంధీ ఫైర్!
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం.. భారత్ మౌనంపై సోనియా గాంధీ ఫైర్!

Sonia Gandhi: ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం.. భారత్ మౌనంపై సోనియా గాంధీ ఫైర్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 21, 2025
03:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పందించారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్ చేసిన దాడిని ఆమె తీవ్రంగా ఖండించారు. మోదీ ప్రభుత్వం ఈ విషయంలో మౌనంగా ఉండడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. 'ఇది కేవలం నిశ్శబ్దం కాదు... మన విలువల సర్పణ' అని సోనియా గాంధీ అన్నారు. భారత్ తన చారిత్రక నైతిక స్థైర్యాన్ని కోల్పోయిందని, మానవ హక్కుల ఉల్లంఘనలపై మౌనం పాటించడం బాధాకరమని పేర్కొన్నారు. అంతర్జాతీయ మానవతా బాధ్యతలను గుర్తుచేస్తూ, ఈ మేరకు సోనియా గాంధీ ఒక వ్యాసం రాశారు. దాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ద్వారా పంచుకున్నారు.

Details

వ్యుహాత్మక సంబంధాలు బలపడాలి

సోనియా గాంధీ తన వ్యాసంలో భారత్, ఇరాన్ మధ్య ఎప్పటినుంచో మంచి సంబంధాలున్నాయని గుర్తుచేశారు. 1994లో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్‌లో జమ్మూ-కశ్మీర్ అంశంపై భారత్‌ను విమర్శిస్తూ తెచ్చిన తీర్మానాన్ని ఇరాన్ ఎలా అడ్డుకుందో ప్రస్తావించారు. 'ఆ సమయంలో ఇరాన్ భారత్‌కు మద్దతుగా నిలిచిందని పేర్కొన్నారు. గత కొన్ని దశాబ్దాలుగా భారత్-ఇజ్రాయెల్ మధ్య వ్యూహాత్మక సంబంధాలు బలపడుతున్నాయని సోనియా గాంధీ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో శాంతి, సంభాషణలకు భారత్ వంతెనగా మారే శక్తిని, నైతిక బాధ్యతను కలిగి ఉన్నదని చెప్పారు. 'ఇది కేవలం ఒక సూత్రం కాదు, పశ్చిమాసియాలోని భారతీయ పౌరుల భద్రతకే సంబంధించినవని ఆమె వివరించారు.

Details

దాడిని ఖండించిన సోనియా గాంధీ

పశ్చిమాసియాలోని భారతీయుల భద్రతను తీవ్రతతో పరిగణించి, ప్రభుత్వం విదేశీ దౌత్యంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేయాలని కోరారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన దాడిని సోనియా గాంధీ ఖండించారు. అదే సమయంలో ఇజ్రాయెల్ నుంచి హమాస్‌పై జరిగిన ప్రతీకారాన్ని భయంకరమైనదిగా, అసమాన శక్తిని ఉపయోగించడం కింద అభివర్ణించారు. ''ఆ దాడిలో ఇళ్లు, కుటుంబాలు, ఆసుపత్రులు నాశనమయ్యాయి. 55,000 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఇంత భయంకరమైన దాడిని చూసినా భారత్ మౌనంగా ఉండకూడదని సోనియా గాంధీ అన్నారు. ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంలో భారత్‌ కల్పించుకోకపోవడాన్ని ''విలువల లొంగుబాటు''గా విమర్శించారు. భారత్ ఈవిషయంలో స్పష్టత, బాధ్యత కనబరచాలని, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు అన్ని దౌత్య మార్గాలను ఉపయోగించాలని ఆమె సూచించారు.