
కాంగ్రెస్లో చేరిన జగదీష్ షెట్టర్; బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత జగదీశ్ శెట్టర్ సోమవారం బెంగళూరులోని కాంగ్రెస్ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో హస్తం గూటికి చేరారు.
అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జగదీష్ షెట్టర్కు టికెట్ నిరాకరించింది. దీంతో ఆయన బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరారు.
ఈ సందర్భంగా ఆయన బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తాను కర్ణాటక బీజేపీని నిర్మించినట్లు చెప్పారు. అయితే తనలాంటి సీనియర్ నాయకులను బీజేపీ విస్మరించిందన్నారు.
కర్ణాటక
నేను ఏడోసారి కూడా మంచి మెజార్టీతో గెలుస్తా: జగదీష్ షెట్టర్
తాను ఎప్పుడూ బీజేపీ నుంచి రికార్డ్ మెజార్టీతో గెలుస్తూ వచ్చినట్లు గుర్తు చేశారు.
బీజీపే సీనియర్ నేతలు తనతో అసభ్యంగా ప్రవర్తించారని జగదీష్ షెట్టర్ మండిపడ్డారు. కాషాయ పార్టీ టికెట్ దక్కకపోవడంపై ఆయన విరుచుకుపడ్డారు.
తాను ఏడోసారి హుబ్బలి-ధార్వాడ్లో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.
మే 10న ఒకే దశలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, మే 13న ఓట్ల లెక్కింపు జరగనుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఖర్గే
#WATCH | Former Karnataka CM Jagadish Shettar joins Congress, in the presence of party president Mallikarjun Kharge, KPCC president DK Shivakumar & Congress leaders Randeep Surjewala, Siddaramaiah at the party office in Bengaluru.
— ANI (@ANI) April 17, 2023
Jagadish Shettar resigned from BJP yesterday. pic.twitter.com/vxqVuKKPs1
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రణ్దీప్ సుర్జావాలా ట్వీట్
A New Chapter,
— Randeep Singh Surjewala (@rssurjewala) April 17, 2023
A New History,
A new Beginning….
Former BJP CM,
Former BJP President,
Former Leader of Opoosition,
Six times MLA,
Sh. Jagadish Shettar joins the Congress family today.@INCKarnataka welcomes him.
CHANGE IS HERE!
CONGRESS IS HERE! pic.twitter.com/QcYSM7GHWv