కాంగ్రెస్లో చేరిన జగదీష్ షెట్టర్; బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత జగదీశ్ శెట్టర్ సోమవారం బెంగళూరులోని కాంగ్రెస్ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో హస్తం గూటికి చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జగదీష్ షెట్టర్కు టికెట్ నిరాకరించింది. దీంతో ఆయన బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తాను కర్ణాటక బీజేపీని నిర్మించినట్లు చెప్పారు. అయితే తనలాంటి సీనియర్ నాయకులను బీజేపీ విస్మరించిందన్నారు.
నేను ఏడోసారి కూడా మంచి మెజార్టీతో గెలుస్తా: జగదీష్ షెట్టర్
తాను ఎప్పుడూ బీజేపీ నుంచి రికార్డ్ మెజార్టీతో గెలుస్తూ వచ్చినట్లు గుర్తు చేశారు. బీజీపే సీనియర్ నేతలు తనతో అసభ్యంగా ప్రవర్తించారని జగదీష్ షెట్టర్ మండిపడ్డారు. కాషాయ పార్టీ టికెట్ దక్కకపోవడంపై ఆయన విరుచుకుపడ్డారు. తాను ఏడోసారి హుబ్బలి-ధార్వాడ్లో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. మే 10న ఒకే దశలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, మే 13న ఓట్ల లెక్కింపు జరగనుంది.