Page Loader
Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఎన్నికల పరిశీలనకు 16 దేశాల దౌత్యవేత్తల బృందం
జమ్మూకశ్మీర్‌లో ఎన్నికల పరిశీలనకు 16 దేశాల దౌత్యవేత్తల బృందం

Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఎన్నికల పరిశీలనకు 16 దేశాల దౌత్యవేత్తల బృందం

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 25, 2024
11:31 am

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ఆరు జిల్లాల్లోని 26 నియోజక‌వ‌ర్గాల్లో ప్రారంభమైంది. ఈ విడతలో 25.78 లక్షల మంది ఓటర్లు 239 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. 3,502 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతోంది, అందులో 1,056 పట్టణ ప్రాంతాల్లో, 2,446 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. ఎన్నికల పరిశీలన కోసం జమ్మూలో అత్యున్నత స్థాయి విదేశీ దౌత్యవేత్తల బృందం చేరుకుంది, వారు శ్రీనగర్‌లోని పోలింగ్ స్టేషన్ ను పరిశీలించారు. అమెరికా, మెక్సికో, గయానా, దక్షిణ కొరియా, సోమాలియా, పనామా, సింగపూర్, నైజీరియా, స్పెయిన్, దక్షిణ ఆఫ్రికా, నార్వే, టాంజానియా, రువాండ, అల్జీరియా, ఫిలిప్పీన్స్ వంటి వివిధ దేశాల దౌత్యవేత్తలు జమ్మూలో పర్యటించనున్నారు.

వివరాలు 

అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు

ప్రస్తుతం శ్రీనగర్, బడ్‌గామ్, రాజౌరీ, పూంఛ్, గండేర్‌బల్, రియాసీ జిల్లాల్లోని 26 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా,బీజేపీ జమ్మూకశ్మీర్ చీఫ్ రవీందర్ రైనా,ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తారిఖ్ హమీద్ కర్రా వంటి అనేక కీలక నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఒమర్ అబ్దుల్లా గండేర్‌బల్,బడ్‌గామ్ నియోజకవర్గాల్లో పోటీలో ఉన్నారు.కాగా హమీద్ కర్రా సెంట్రల్ షాల్టెంగ్ నియోజకవర్గంలో,రవీందర్ రైనా నౌషేరా నియోజకవర్గంలో పోటీలో ఉన్నారు. జమ్మూ కశ్మీర్‌లో మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి.మొదటి దశలో 24 స్థానాలకు సెప్టెంబర్ 18న పోలింగ్ జరిగింది,రెండో దశలో 26 స్థానాలకు బుధవారం(నేడు)పోలింగ్ జరుగుతోంది. మూడో దశలో 40 స్థానాలకు అక్టోబర్ 1న పోలింగ్,అలాగే అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.