NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / నేటి నుంచి వీఆర్ఏలతో మంత్రివర్గ ఉపసంఘం చర్చలు.. జేపీఎస్​ల రెగ్యులరైజేషన్​కు కమిటీలు 
    తదుపరి వార్తా కథనం
    నేటి నుంచి వీఆర్ఏలతో మంత్రివర్గ ఉపసంఘం చర్చలు.. జేపీఎస్​ల రెగ్యులరైజేషన్​కు కమిటీలు 
    జేపీఎస్ క్రమబద్దీకరణపై కమిటీలు.. వీఆర్ఏల సర్దుబాటుపై సీఎం కేసీఆర్ ఆదేశాలు

    నేటి నుంచి వీఆర్ఏలతో మంత్రివర్గ ఉపసంఘం చర్చలు.. జేపీఎస్​ల రెగ్యులరైజేషన్​కు కమిటీలు 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 12, 2023
    09:53 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ ప్రభుత్వం గతంలో వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం చేసింది.

    అయితే ఆయా ఉద్యోగులను నీటిపారుదల, ఇతర శాఖల్లో సర్దుబాటు చేయాలని తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్, సీఎస్ శాంతికుమారికి ఆదేశాలు జారీ చేశారు.

    ఈ క్రమంలోనే వీఆర్​ఏల సర్దుబాటు, క్రమబద్ధీకరణపై ప్రగతిభవన్​లో అన్ని శాఖల అధికారులతో సీఎం సమీక్షించారు.

    విద్యార్హతలు, సామర్థ్యాల ప్రకారం వీఆర్ఏలను ఇతర ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేయాలని ఆదేశించారు.

    ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్​ నేతృత్వంలో మంత్రులు జగదీశ్​ రెడ్డి, సత్యవతి రాథోడ్​ సభ్యులుగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు.

    details

    జులై 12 నుంచి మంత్రివర్గ ఉపసంఘం చర్చలు

    నేటి నుంచి వీఆర్​ఏలతో ఈ మంత్రివర్గ ఉపసంఘం చర్చిస్తుంది. అనంతరం వీఆర్ఏల అభిప్రాయాలను నమోదు చేయనున్నారు.

    ఉపసంఘం తుది నివేదిక సమర్పించాక మరోసారి సమీక్ష చేపట్టి తుది నిర్ణయం తీసుకోనున్నారు. అయితే వారం రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తి కావాలని అధికారులకు, ఉప సంఘానికి సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

    మరోవైపు జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ( జేపీఎస్)ల క్రమబద్దీకరణపై సీఎం నిర్ణయం తీసుకున్నారు. తమను పర్మినెంట్ చేయాలని గతంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ 16 రోజుల సమ్మె కూడా నిర్వహించారు.

    దీంతో దిగివచ్చిన ప్రభుత్వం వారిని రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే వాటికి సంబంధించి కొత్త విధివిధానాలు రూపొందించాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శికి ఆదేశాలు జారీ అయ్యాయి.

    details

    జేపీఎస్‌ల పని తీరు మదింపుపై జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు

    జేపీఎస్‌ల పని తీరు మదింపుపై జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలను ఏర్పరచాలని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు.

    ఈ మేరకు కమిటీలో కలెక్టర్‌తో పాటు స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్, డీఎఫ్ఓ, ఎస్పీ లేదా డీసీపీలు సభ్యులుగా ఉండనున్నారు.

    రాష్ట్ర స్థాయిలో సెక్రటరీ, లేదా హెచ్ఓడీ అధికారి జిల్లా కమిటీకి పరిశీలకుడిగా వ్యవహరించనున్నారు.

    జేపీఎస్‌ల పని తీరు మదింపుపై జిల్లా కమిటీ పంపిన ప్రతిపాదనలను రాష్ట్ర స్థాయి కమిటీ పరిశీలిస్తుంది. అనంతరం స్టేట్ కమిటీ, సీఎస్ శాంతికుమారికి నివేదిక సమర్పిస్తారు.

    అన్ని పూర్తయ్యాక జేపీఎస్ రెగ్యులరైజేషన్ పై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.

    నిర్ధేశించిన లక్ష్యాలను మూడింట రెండొంతులు చేరుకున్న వారినే క్రమబద్దీకరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీనిపై జేపీఎస్ లు ఆందోళన చెందుతున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)

    తాజా

    RCB vs PBKS : ఐపీఎల్ 2025 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Virat Kohli: ఐపీఎల్ హిస్టరీలో విరాట్ కోహ్లీ అద్భుత రికార్డు విరాట్ కోహ్లీ
    Shreyas Iyer: ఐపీఎల్‌ ఫైనల్స్‌ స్పెషలిస్ట్‌ అయ్యర్‌? పంజాబ్‌ ట్రోఫీ కల సాకారమవుతుందా?  శ్రేయస్ అయ్యర్
    Tata Harrier ev: ఫ్లాగ్‌షిప్‌ ఎస్‌యూవీ హారియర్‌ ఈవీని లాంచ్‌ చేసిన టాటా.. ఒక్కసారి ఛార్జి చేస్తే 627 కిలోమీటర్ల ప్రయాణం  టాటా హారియర్

    తెలంగాణ

    ఆసియాలోనే అతిపెద్ద నివాస సముదాయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    తెలంగాణను తాకిన నైరుతి రుతుపవనాలు.. సరిహద్దు జిల్లాల్లో భారీ వర్షాలు వర్షాకాలం
    తెలంగాణ ఉద్యోగులకు సర్కారు వారి భారీ కనుక.. ఇళ్లు కట్టుకుంటే రూ.30 లక్షల అడ్వాన్స్ ప్రభుత్వం
    నేడు, రేపు ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు: ఐఎండీ నైరుతి రుతుపవనాలు

    కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)

    women's day 2023: 'ఉమెన్స్ డే' రోజున మహిళా ఉద్యోగులకు సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం మహిళా దినోత్సవం
    మహిళల కోసం 'గృహలక్ష్మి' పథకాన్ని ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం; ఇంటి నిర్మాణానికి రూ.3లక్షలు తెలంగాణ
    సచివాలయం, అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్థూపాన్ని పరిశీలించిన సీఎం కేసీఆర్ తెలంగాణ
    సర్వేలన్నీ బీఆర్ఎస్‌కే అనుకూలం, డిసెంబర్‌లోనే తెలంగాణలో ఎన్నికలు: సీఎం కేసీఆర్ తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025