NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం.. గవర్నర్ సమక్షంలో బాధ్యతల స్వీకరణ
    తదుపరి వార్తా కథనం
    ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం.. గవర్నర్ సమక్షంలో బాధ్యతల స్వీకరణ
    గవర్నర్ సమక్షంలో బాధ్యతల స్వీకరణ

    ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం.. గవర్నర్ సమక్షంలో బాధ్యతల స్వీకరణ

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 28, 2023
    11:33 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ శుక్రవారం ఠాకూర్ తో ప్రమాణం చేయించారు.

    కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

    జులై 5న భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుల మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

    ఈ మేరకు బాంబే ఉన్నతన్యాస్థానంలో న్యాయమూర్తిగా కొనసాగుతున్న ఠాకూర్ ను ఏపీ హైకోర్టు సీజేగా నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.

    DETAILS

    2022 జూన్ 10న బాంబే హైకోర్టుకు బదిలీ అయిన ఠాకూర్

    బాంబే హైకోర్టులో న్యాయమూర్తి బాధ్యతల నుంచి తప్పుకున్న ధీరజ్ సింగ్ ఠాకూర్, గురువారం రాత్రి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చేరుకున్నారు.

    గవర్నర్ సమక్షంలో శుక్రవారం ఉదయం జరిగిన పదవీ స్వీకారోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు.

    జస్టిస్ ఠాకూర్ 1989లో దిల్లీ బార్ కౌన్సిల్ లో పేరు నమోదు చేసుకుని న్యాయవాది వృత్తిలోకి ప్రవేశించారు. అనంతరం కొంత కాలానికే జమ్మూకాశ్మీర్ బార్ కౌన్సిల్ కు తరలివెళ్లి అక్కడ న్యాయవాదిగా ప్రాక్టిస్ చేశారు.

    ఈ క్రమంలోనే 2011లో సీనియర్ అడ్వకేట్ గా ప్రమోషన్ పొందారు. 2013 మార్చి 8న ఆ రాష్ట్ర హైకోర్టులో శాశ్వత జడ్జిగా నియామకమయ్యారు. 2022 జూన్ 10న బాంబే హైకోర్టుకు ట్రాన్ఫర్ అయ్యారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    2025 Suzuki V-Strom 800DE: భారత్ లో విడుదలైన 2025 సుజుకి V-స్ట్రోమ్ 800DE.. రూ.10,30,000 ఎక్స్-షోరూమ్ ధర ఆటో మొబైల్
    Elon Musk: కొత్త పార్టీ పెట్టేందుకు ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం.. మస్క్ పెట్టిన పోల్‌కు భారీ రెస్పాన్స్..  ఎలాన్ మస్క్
    Chenab bridge: ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ చినాబ్ వంతెన ప్రారంభించిన ప్రధాని మోదీ ..  నరేంద్ర మోదీ
    Home loan: గృహ రుణాలదారులకు ఊరట.. వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్‌బీఐ  ఆర్ బి ఐ

    ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు పవన్ కళ్యాణ్
    సాగర్ కాల్వలోకి దూసుకెళ్లిన పెళ్లి బస్సు.. ఏడుగురు మృతి, 12 మందికి గాయాలు రోడ్డు ప్రమాదం
    ఏపీ రాజధాని అమరావతి కేసును డిసెంబర్‌కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    Ambati Rayudu: వాలంటీర్ వ్యవస్థపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై అంబటి రాయుడు కౌంటర్  పవన్ కళ్యాణ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025