NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / నేను జారీ చేసిన ఉత్తర్వులతో కేంద్రం ఎందుకు ఇబ్బంది పడిందో అర్థం కాలేదు: జస్టిస్ మురళీధర్ 
    తదుపరి వార్తా కథనం
    నేను జారీ చేసిన ఉత్తర్వులతో కేంద్రం ఎందుకు ఇబ్బంది పడిందో అర్థం కాలేదు: జస్టిస్ మురళీధర్ 
    నేను జారీ చేసిన ఉత్తర్వులతో కేంద్రం ఎందుకు ఇబ్బంది పడిందో అర్థం కాలేదు: జస్టిస్ మురళీధర్

    నేను జారీ చేసిన ఉత్తర్వులతో కేంద్రం ఎందుకు ఇబ్బంది పడిందో అర్థం కాలేదు: జస్టిస్ మురళీధర్ 

    వ్రాసిన వారు Stalin
    Oct 08, 2023
    04:10 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఒడిశా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎస్.మురళీధర్ 2020లో దిల్లీ అల్లర్ల కేసులో తాను జారీ చేసిన ఉత్తర్వుపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇబ్బంది పడిందో తనకు తెలియదని అన్నారు.

    బెంగళూరులో ఓ మీడియా సంస్థ ఏర్పాటు చేసిన కాన్‌క్లేవ్‌లో ఆయన మాట్లాడారు.

    దేశంలోని అత్యంత సీనియర్ హైకోర్టు న్యాయమూర్తులలో ఒకరిగా ఉన్నప్పటికీ, సుప్రీంకోర్టు వరకు ఎందుకు ఎదగలేకపోయారని అడిగిన ప్రశ్నకు ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

    ఫిబ్రవరి 26, 2020న మురళీధర్ నేతృత్వంలోని దిల్లీ హైకోర్టు బెంచ్ సీఏఏ అల్లర్లపై దర్యాప్తు చేసిన తీరుపై ఆగ్రహం వ్యక్తి చేసింది.

    అల్లర్ల బాధితులకు భద్రత, చికిత్స అందించాలని ఆదేశించింది. ఈ ఆదేశాలు కేంద్రానికి ఎందుకు కలవరపెట్టాయో అర్థమవడం లేదని ఆయన అన్నారు.

    దిల్లీ

    ఆ ఆదేశాలు ఇచ్చిన కొన్ని గంటల్లోనే బదిలీ: ఎస్.మురళీధర్ 

    2020ఫ్రిబ్రవరిలో ప్రారంభంలో పౌరసత్వ సవరణ చట్టం మద్దతుదారులు, చట్టాన్ని వ్యతిరేకించే వారికి మధ్య హింసాత్మక ఘర్షణలు జరిగిన విషయం తెలిసిందే.

    అల్లర్లలో 53మంది మరణించారు. వందల మంది గాయపడ్డారు. ఈ అల్లర్లకు సంబంధించి బీజేపీ నాయకులు చేసిన విద్వేషపూరిత ప్రసంగాలపై 24గంటల్లోగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని జస్టిస్ ఎస్.మురళీధర్ నాయకత్వంలోని ధర్మాసనం పోలీసులను ఆదేశించింది.

    ఈ ఆదేశాలు ఇచ్చిన కొన్ని గంటల్లోనే ప్రధాని మోదీ ప్రభుత్వం జస్టిస్ ఎస్.మురళీధర్‌ను చండీగఢ్‌ హైకోర్టుకు బదిలీ చేసింది.

    ఆ తర్వాత దిల్లీ అల్లర్ల కేసును విచారణ వాయిదా వేసింది. జస్టిస్ ఎస్.మురళీధర్ బదిలీతో దిల్లీ పోలీసులకు, బీజేపీ నాయకులకు భారీ ఊరట లభించింది.

    ఆ తర్వాత ఏ బీజేపీ నాయకుడిపైనా ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాకపోవడం గమనార్హం.

    దిల్లీ

    ఏ న్యాయమూర్తి అయినా నాలాగే వ్యవహరిస్తారు: జస్టిస్ ఎస్.మురళీధర్ 

    దిల్లీ అల్లర్ల కేసు విచారణ విషయంలో కేంద్రం ఎందుకు ఆందోళన చెందిందో తనకు నాకు తెలియదని జస్టిస్ ఎస్.మురళీధర్ వెల్లడించారు.

    తాను మాత్రమే కాదని, ఏ న్యాయమూర్తి అయినా తనలాగే వ్యవహరిస్తారని స్పష్టం చేశారు.

    మిగతా న్యాయమూర్తులు కూడా తన కన్నా భిన్నంగా చేసి ఉంటారని తాను అనుకోవడం లేదన్నారు.

    అయితే ఈ విషయంలో ప్రభుత్వం దేనికి దిగులు చెందిందో, తనకు ఇప్పటికీ అర్థం కాలేదన్నారు.

    ఫిబ్రవరి 26, 2020న తన నివాసంలో అత్యవసరంగా అర్ధరాత్రి కూడా కేసును విచారించారు.

    తీవ్రంగా గాయపడిన 22 మంది బాధితులకు మంచి చికిత్స అందించడం కోసం ఈ మేరకు ఆయన అర్థరాత్రి ఆదేశాలు జారీ చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    హైకోర్టు
    కేంద్ర ప్రభుత్వం

    తాజా

    AM Ratnam : ఖుషి నుండి హరిహర వీరమల్లు వరకూ.. పవన్ కళ్యాణ్‌తో ప్రయాణం చాలా గొప్పది : ఏఎం రత్నం  హరిహర వీరమల్లు
    Puja Khedkar: మాజీ ఐఏఎస్ ప్రొబేషనరీ పూజా ఖేద్కర్ కు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు  పూజా ఖేద్కర్‌
    Kumki Elephants: ఏపీకి ఐదు కుంకీ ఏనుగులు.. వాటి పేర్లు ఇవే.. పవన్ కళ్యాణ్
    Dilraju : సినిమాల్లోకి రావాలా? దిల్ రాజు డ్రీమ్స్ మీ కోసం వేచిచూస్తోంది! దిల్ రాజు

    దిల్లీ

    G-20 సమావేశం: ప్రపంచ దేశాధినేతల బస ఇక్కడే..ఏ హోటల్లో ఎవరు ఉంటారో తెలుసా ప్రపంచం
    G-20 SUMMIT : దిల్లీలో మూడు కూటముల ప్రపంచ అతిపెద్ద శిఖరాగ్ర సమావేశం భారతదేశం
    సతీసమేతంగా దిల్లీకి చేరిన రిషి సునక్​కు ఘన స్వాగతం​.. పర్యటన తనకెంతో స్పెషల్​ అన్న ఇంగ్లీష్ ప్రధాని బ్రిటన్
    10వేల అడుగుల ఎత్తులో G20 జెండాతో IAF అధికారి అద్భుత ప్రదర్శన.. వీడియో వైరల్ ఇండియా

    హైకోర్టు

    నగ్నత్వం,అశ్లీలం ఒకటి కాదు.. కేరళ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు కేరళ
    మణిపూర్‌లో ఇంటర్నెట్ నిషేధానికి వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు  మణిపూర్
    రిటైర్మెంట్ రోజు హైకోర్టు న్యాయమూర్తి రికార్డు.. 65 తీర్పులిచ్చిన జస్టిస్ ముక్తా గుప్తా దిల్లీ
    ఆదిపురుష్‌ యూనిట్ పై అలహాబాద్‌ హైకోర్టు ఫైర్.. ప్రేక్షకుల సహనాన్ని కూడా పరీక్షిస్తారా అని నిలదీత ఆదిపురుష్

    కేంద్ర ప్రభుత్వం

    లోక్‌సభలో ఎంపీ నామా కీలక వ్యాఖ్యలు..కేంద్ర సహకారం లేకున్నా తెలంగాణ అభివృద్ధి చెందుతోంది పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
    ఎన్నికల కమీషనర్లను ఎన్నుకునే ప్యానెల్ నుండి ప్రధాన న్యాయమూర్తిని తొలగించాలంటూ కేంద్ర ప్రభుత్వం కొత్త బిల్లు  భారతదేశం
    No confidence Motion:లోక్ సభలో వీగిన అవిశ్వాస తీర్మానం లోక్‌సభ
    రసాభసాగా పార్లమెంట్.. నేటితో ముగియనున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు-2023 పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025