NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Kalwakuntla Kavitha: బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్.. ఏప్రిల్ 8వరకు జైలులోనే కవిత 
    తదుపరి వార్తా కథనం
    Kalwakuntla Kavitha: బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్.. ఏప్రిల్ 8వరకు జైలులోనే కవిత 
    బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్.. ఏప్రిల్ 8వరకు జైలులోనే కవిత

    Kalwakuntla Kavitha: బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్.. ఏప్రిల్ 8వరకు జైలులోనే కవిత 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 04, 2024
    05:12 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను విచారించిన ఢిల్లీకోర్టు తన ఉత్తర్వులను ఏప్రిల్ 8కి రిజర్వ్ చేసింది.

    కవిత మధ్యంతర,సాధారణ బెయిల్ కోరుతూ కోర్టును ఆశ్రయించారు.ఆమె రెగ్యులర్ బెయిల్ దరఖాస్తును ఏప్రిల్ 20న కోర్టు పరిశీలించనుంది.

    ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మార్చి 15న అరెస్టు చేసింది.

    హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో ఈడీ రోజంతా సోదాలు చేసిన తర్వాత ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

    ఢిల్లీ కోర్టు ఆమెను ఏప్రిల్ 9వరకు జైలుకు పంపింది.ఒకేవేళ కవితకి బెయిల్ ఇస్తే ఆధారాలు, సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని పేర్కొంటూ ఈడీ ఆమెకు జ్యుడీషియల్ కస్టడీని కోరింది.

    ఆమెను విడుదల చేస్తే విచారణకు విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.

    Details 

    ఫోన్ డేటా మొత్తాన్ని కవిత డిలీట్ చేశారు: ఈడీ 

    కవితకు వ్యతిరేకంగా అనేక ఆధారాలు ఉన్నాయన్న ఈడీ లిక్కర్ స్కామ్‌ను ప్లాన్ చేసిందే కవిత అని ఆరోపించారు.

    అదేకాకుండా, ఫోన్ డేటా మొత్తాన్ని డిలీట్ చేశారని.. తాము అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం ఇవ్వలేదని కోర్టుకి తెలిపారు.

    తనపై పెట్టిన కేసు రాజకీయ ప్రేరేపితమని కవిత ఆరోపించారు. ఇది అన్యాయమైన, కల్పిత కేసు అని పేర్కొంటూ, ఆరోపణలపై పోరాడతానని ఆమె ప్రతిజ్ఞ చేసింది.

    ఢిల్లీలో మద్యం లైసెన్సుల కోసం ఆప్ నేతలకు కిక్‌బ్యాక్‌లు ఇచ్చిన గ్రూపులో కవిత ప్రమేయం ఉందని ఈడీ ఆరోపించింది.

    Details 

    బెయిల్‌పై విడుదలైన సంజయ్ సింగ్

    ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో ఆదరణ పొందేందుకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా సహా ఆప్ అగ్రనేతలతో పాటు కవిత ఇతరులతో కలిసి కుట్ర పన్నారని ED ఆరోపించింది.

    ఈ కేసుకు సంబంధించి ఆప్‌కి చెందిన కేజ్రీవాల్, సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్ సహా మొత్తం 16 మందిని అరెస్టు చేశారు.

    వీరిలో సంజయ్ సింగ్ ఏప్రిల్ 3వ తేదీ బుధవారం బెయిల్‌పై విడుదలయ్యారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కల్వకుంట్ల కవిత

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    కల్వకుంట్ల కవిత

    రేపు కవిత విచారణ; ఊహించని ట్విస్ట్ ఇచ్చిన రామచంద్ర పిళ్లై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ
    దిల్లీ లిక్కర్ కుంభకోణం: నేడు ఈడీ ఎదుట విచారణకు కవిత ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ
    దిల్లీలో కవితను ప్రశ్నిస్తున్న ఈడీ; హైదరాబాద్ లో బీజేపీకి వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లు దిల్లీ
    కవితపై బండి సంజయ్ కామంట్స్; దిష్టిబొమ్మను దహనం చేసిన బీఆర్ఎస్ బండి సంజయ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025