LOADING...
Kaleshwaram Commission Report: మూడు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్న.. కాళేశ్వరం కమిషన్‌ 
మూడు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్న.. కాళేశ్వరం కమిషన్‌

Kaleshwaram Commission Report: మూడు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్న.. కాళేశ్వరం కమిషన్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 28, 2025
11:41 am

ఈ వార్తాకథనం ఏంటి

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో ఉన్న లోపాలు, అవకతవకలపై విచారణ చేస్తున్న కాళేశ్వరం న్యాయవిచారణ కమిషన్‌ త్వరలోనే తమ నివేదికను ప్రభుత్వానికి అందజేయనుంది. అందిన సమాచారం మేరకు, ఈ నివేదికను వచ్చే మూడు రోజుల్లో సమర్పించే అవకాశముంది. ఈ కమిషన్‌కు ఛైర్మన్‌గా ఉన్న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ పీసీ ఘోష్‌ ఆదివారం సాయంత్రం కోల్‌కతా నుంచి హైదరాబాద్‌ వచ్చారు. సోమవారం నుంచే నివేదిక తయారీపై చివరి దశ పనులకు ఆయన మక్కువ చూపనున్నట్లు సమాచారం. నివేదిక రూపకల్పన, తుది సవరణలు చేయడంపై ఆయన దృష్టి కేంద్రీకరించే అవకాశముంది.

వివరాలు 

గత ఏడాది మార్చి 14న న్యాయవిచారణ కమిషన్‌ను ఏర్పాటు

కాగా, గత ఏడాది మార్చి 14న తెలంగాణ ప్రభుత్వం ఈ న్యాయవిచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. దీనికి నేతృత్వం వహించే బాధ్యతలను జస్టిస్‌ పీసీ ఘోష్‌కు అప్పగించారు. అనంతరం ఏప్రిల్‌ 24న కమిషన్‌ విచారణ ప్రక్రియను ప్రారంభించింది. ఈ సమయంలో కమిషన్‌ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ప్రత్యక్షంగా సందర్శించింది. అలాగే వివిధ ఇంజినీర్లు సహా మొత్తం 115 మందిని కమిషన్‌ విచారించింది. విచారణ అనంతరం సిద్ధమైన నివేదికను రాష్ట్ర నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్‌ బొజ్జాకు అందజేయనున్నట్లు సమాచారం.