English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Kallakkadal:కేరళ,తమిళనాడు తీర ప్రాంతాల్లో 'కళ్లక్కడల్' ముప్పు..  కేంద్ర ప్రభుత్వ సంస్థ ముందస్తు హెచ్చరిక జారీ 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Kallakkadal:కేరళ,తమిళనాడు తీర ప్రాంతాల్లో 'కళ్లక్కడల్' ముప్పు..  కేంద్ర ప్రభుత్వ సంస్థ ముందస్తు హెచ్చరిక జారీ 
    కేరళ,తమిళనాడు తీర ప్రాంతాల్లో 'కళ్లక్కడల్' ముప్పు.. కేంద్ర ప్రభుత్వ సంస్థ ముందస్తు హెచ్చరిక జారీ

    Kallakkadal:కేరళ,తమిళనాడు తీర ప్రాంతాల్లో 'కళ్లక్కడల్' ముప్పు..  కేంద్ర ప్రభుత్వ సంస్థ ముందస్తు హెచ్చరిక జారీ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 15, 2025
    09:19 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కేంద్ర ప్రభుత్వ సంస్థ హెచ్చరికల ప్రకారం, కేరళ, తమిళనాడు తీర ప్రాంతాలను "కల్లక్కడల్‌" ముప్పు ఉక్కిరిబిక్కిరి చేయనుందని తెలియజేశారు.

    జనవరి 15 రాత్రి సముద్రంలో అకస్మాత్తుగా వచ్చే ఉప్పెన కారణంగా బలమైన అలలు ఉవ్వెత్తున ఎగసిపడతాయని సూచించారు.

    రాత్రి 11.30 గంటల వరకు తీర ప్రాంతాల్లో 0.5 మీటర్ల నుంచి 1 మీటర్‌ వరకు అలల ప్రభావం ఉంటుందని, ఇది తీర ప్రాంతాలపై ముప్పును మరింత పెంచుతుందని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓసియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్‌ (ఐఎన్‌సీవోఐఎస్‌) వెల్లడించింది.

    వివరాలు 

    బీచ్‌లకు పర్యాటకులు రాకుండా ఆంక్షలు

    ఈ హెచ్చరికల నేపథ్యంలో, కేరళ విపత్తు ప్రతిస్పందన నిర్వహణ సంస్థ (కేఎస్‌డీఎంఏ) అప్రమత్తమైంది.

    తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలనే ఆదేశాలు జారీ చేసింది.

    తీర ప్రాంత వాసులు చిన్న పడవలు, దేశవాళీ పడవలను ఉపయోగించి సముద్రంలోకి వెళ్లడం పూర్తిగా మానుకోవాలని హెచ్చరించింది.

    పడవలను ముందుగా సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని స్పష్టం చేసింది.

    బీచ్‌లకు పర్యాటకులు రాకుండా ఆంక్షలు విధించింది. తీర ప్రాంతాల్లో అదనపు నిఘా పెట్టాలని సంబంధిత అధికారులను కేఎస్‌డీఎంఏ ఆదేశించింది.

    మీరు
    50%
    శాతం పూర్తి చేశారు

    వివరాలు 

    కల్లక్కడల్‌అంటే ఏమిటి? 

    కల్లక్కడల్‌ అనేది సముద్రంలో అకస్మాత్తుగా సంభవించే మార్పులను సూచించే పదం. ఇది హిందూ మహాసముద్రం దక్షిణ భాగంలో కొన్ని సందర్భాల్లో వీచే బలమైన గాలుల ప్రభావంతో సముద్రం ఆకస్మికంగా ఉప్పొంగడం వల్ల ఏర్పడుతుంది. ఈ గాలులు ఎలాంటి సూచనలూ లేకుండా అకస్మాత్తుగా వీచడం వల్ల సముద్రంలో అలల తీవ్రత పెరుగుతుంది. ఈ కారణంగా దీనిని స్థానికంగా "కల్లక్కడల్‌" అని పిలుస్తారు.

    ఇందుకు సంబంధించిన హెచ్చరికలు ప్రజలు గమనించి అప్రమత్తంగా ఉండటం అత్యంత అవసరం.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేరళ
    తమిళనాడు

    తాజా

    PSL 2025: రావల్పిండి స్టేడియం సమీపంలో కూలిన డ్రోన్.. భయపడిన పీసీబీ! పాకిస్థాన్
    ott platforms: పాకిస్థాన్‌ మూలాలున్న ఓటీటీ కంటెంట్‌ను భారత్‌లో నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం  కేంద్ర ప్రభుత్వం
    Ipl 2025: పంజాబ్, దిల్లీ మ్యాచ్.. భారత సైన్యానికి మద్దతుగా బీసీసీఐ సాంస్కృతిక కార్యక్రమాలు  బీసీసీఐ
    Rajnath Singh: 'మా సహనాన్ని పరీక్షించొద్దు'.. పాక్ కు రాజనాథ్ సింగ్ మరోసారి వార్నింగ్  రాజ్‌నాథ్ సింగ్

    కేరళ

    Wayanad Landsildes : కొండచరియలు విరిగిపోవడానికి కారణమేమిటి.. ప్రమాదానికి ముందు సంకేతాలివే! కొండచరియలు
    Kerala: వాయనాడ్‌లో ప్రకృతి బీభత్సం... ఇప్పటివరకు 143 మంది మృతి  భారతదేశం
    Kerala Floods: కేరళకు ఏడు రోజుల ముందే హెచ్చరించాం : అమిత్ షా అమిత్ షా
    కేరళ డిజాస్టర్.. 256 కి చేరిన మృతి మృతుల సంఖ్య.. 200 మందికి పైగా గల్లంతు కొండచరియలు

    తమిళనాడు

    Tamil Nadu : ఏఐ హబ్‌గా ఎదుగుతున్న తమిళనాడు.. గూగుల్, అమెజాన్ సహా ప్రముఖ టెక్ దిగ్గజాల పెట్టుబడులు అమెజాన్‌
    Rape: లిఫ్ట్ ఇచ్చి మహిళపై ఆత్యాచారానికి పాల్పడ్డ దుండగులు ఇండియా
    Tamilnadu: మధురై మహిళా హాస్టల్‌లో అగ్ని ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి  భారతదేశం
    Bomb Threat:  చెన్నై ఎంఐటీ క్యాంపస్‌కు బాంబు బెదిరింపులు.. పోలీసులు అలర్ట్‌ భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025