NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana: కంచ గచ్చిబౌలి భూ వివాదం.. హెచ్‌సీయూకు కేంద్ర సాధికారిక కమిటీ విచారణ
    తదుపరి వార్తా కథనం
    Telangana: కంచ గచ్చిబౌలి భూ వివాదం.. హెచ్‌సీయూకు కేంద్ర సాధికారిక కమిటీ విచారణ
    కంచ గచ్చిబౌలి భూ వివాదం.. హెచ్‌సీయూకు కేంద్ర సాధికారిక కమిటీ విచారణ

    Telangana: కంచ గచ్చిబౌలి భూ వివాదం.. హెచ్‌సీయూకు కేంద్ర సాధికారిక కమిటీ విచారణ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 10, 2025
    12:08 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణలోని కంచ గచ్చిబౌలిలో ఉన్న 400 ఎకరాల భూమిపై వివాదం నేపథ్యంలో, హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి కేంద్ర పర్యావరణ, అటవీ శాఖల సాధికారిక కమిటీ సందర్శన చేసింది.

    ఈ భూములపై జరిగిన చదును పనులపై సుప్రీంకోర్టు సీరియస్‌గా స్పందించిన విషయం తెలిసిందే.

    టీజీఐఐసీ చేపట్టిన పనులపై అసంతృప్తి వ్యక్తం చేసిన సర్వోన్నత న్యాయస్థానం, కమిటీకి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి నివేదిక ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

    ఈ నేపథ్యంలో బుధవారం, సెంట్రల్ ఎంపవర్‌డ్ కమిటీ ఛైర్మన్ సిద్ధాంత్ దాస్‌తో పాటు మరో ఇద్దరు సభ్యులు హైదరాబాద్‌కు చేరుకున్నారు.

    Details

    కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి నిర్ణయం

    వారు ఏప్రిల్ 10, 11 తేదీల్లో కంచ గచ్చిబౌలిలో భూ ప్రదేశాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి, అక్కడి వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేస్తున్నారు.

    గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వ ఉన్నతాధికారులతో కమిటీ సమావేశం నిర్వహించే అవకాశముంది. ఇక, టీజీఐఐసీ అధికారులు భూములు ప్రభుత్వానివేనంటూ పలుచోట్ల బోర్డులు ఏర్పాటు చేశారు.

    కేంద్ర కమిటీ రాకతో హెచ్‌సీయూ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

    పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు, ఈస్ట్ క్యాంపస్‌కి వెళ్లే మార్గాన్ని దిగ్బంధించారు. కమిటీ నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు తదుపరి నిర్ణయం తీసుకోనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    ఇండియా

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    తెలంగాణ

    Betting App Case: బెట్టింగ్ యాప్స్ కేసులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం  భారతదేశం
    Telangana Floods: తెలంగాణలో వరదలకు కేంద్ర ప్రభుత్వ సాయం రూ.648 కోట్లు.. వెల్లడించిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి  భారతదేశం
    Revanth Reddy: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ నిరోధానికి సిట్‌ ఏర్పాటు  భారతదేశం
    TS Assembly 2025: తెలంగాణ అసెంబ్లీలో కాగ్ రిపోర్ట్‌.. భట్టి విక్రమార్క కీలక ప్రకటన? భట్టి విక్రమార్క

    ఇండియా

    T- SAFE App: సురక్షిత ప్రయాణానికి 'టీ-సేఫ్‌'.. 35 వేలకుపైగా ప్రయాణాలకు భద్రతా వలయం! తెలంగాణ
    Jammu and Kashmir: ఏప్రిల్ 1 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం జమ్ముకశ్మీర్
    Grenade Attack: అమృత్‌సర్‌లో గుడిపై గ్రేనేడ్ దాడి.. భయాందోళనలో భక్తులు అమృత్‌సర్
    PM Modi: ప్రధాని మోదీ ఎక్స్‌క్లూజివ్‌.. లెక్స్‌ ఫ్రిడ్‌మన్‌ పాడ్‌కాస్ట్‌ నేడే విడుదల!  నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025