NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కన్వర్ యాత్రలో అపశ్రుతి, విద్యుదాఘతంతో ఐదుగురు భక్తుల మృతి
    తదుపరి వార్తా కథనం
    కన్వర్ యాత్రలో అపశ్రుతి, విద్యుదాఘతంతో ఐదుగురు భక్తుల మృతి
    విద్యుదాఘతంతో ఐదుగురు భక్తుల మృతి, మరో ఐదుగురి పరిస్థితి విషమం

    కన్వర్ యాత్రలో అపశ్రుతి, విద్యుదాఘతంతో ఐదుగురు భక్తుల మృతి

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 16, 2023
    11:27 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశంలో ప్రసిద్ధి గాంచిన కన్వర్ యాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో ఐదుగురు భక్తులు మృతిచెందిన విషాద ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగింది.

    భావన్‌పూర్‌ పరిధిలోని రాలీ చౌహాన్‌ గ్రామంలో ఊరేగింపు సమయంలో హై టెన్షన్‌ వైర్లు తగిలి ఐదుగురు కన్వారియా భక్తులు మరణించారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు గాయపడగా, వారి పరిస్థితి విషమంగా ఉంది.

    పరమశివుడి భక్తులైన కన్వారియాలు హరిద్వార్‌ నుంచి పవిత్ర గంగానది నీటితో తిరిగి వస్తున్న క్రమంలో ఈ దారుణం జరిగింది.

    కన్వారియాల బస్సు గ్రామంలోకి వస్తుండగా, కిందకు వేలాడున్న హైటెన్షన్‌ విద్యుత్‌ తీగలు వాహనానికి తగిలాయి. దీంతో వాహనం మొత్తానికి క్షణాల్లో విద్యుత్‌ సరఫరా జరిగింది. దీంతో కన్వారియా భక్తులు విద్యుత్‌ షాక్‌ బారిన పడ్డారు.

    DETAILS

     కన్వర్ యాత్రకు సన్నాహాలు చేయడంలో విద్యుత్‌ శాఖ విఫలం : గ్రామస్తులు

    రాలీ చౌహాన్ గ్రామస్తులు వెంటనే విద్యుత్ అధికారులను అప్రమత్తం చేసి, కరెంట్ సరఫరాను నిలిపేశారు.

    అయితే అప్పటికే భక్తుడు మనీష్‌ ఘటనా స్థలిలోనే ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

    మరో ఐదుగురు భక్తుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

    విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని రహదారిలో బైఠాయించారు.

    దేశంలోనే అతిపెద్ద యాత్రల్లో ఒకటైన కన్వర్ యాత్రకు సన్నాహాలు చేయడంలో విద్యుత్‌ శాఖ విఫలమైందన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వమే న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్

    తాజా

    NTR: బ్రహ్మర్షి నుంచి భీమ్‌దాకా... ఎన్టీఆర్‌ స్టార్ హీరోగా ఎదిగిన ప్రయాణమిదీ! జూనియర్ ఎన్టీఆర్
    Jammu Kashmir: పూంచ్‌లో పాకిస్తాన్  లైవ్‌ షెల్‌..ధ్వంసం చేసిన భారత ఆర్మీ  జమ్ముకశ్మీర్
    India-US: భారత్‌,అమెరికా మొదటి దశ వాణిజ్య ఒప్పందంపై త్వరితగతిన అడుగులు  పీయూష్ గోయెల్‌
    Ajith: పని చేసుకుంటూ రేసింగ్‌లో పాల్గొన్నా.. చిన్ననాటి కష్టాలు గుర్తు చేసుకున్న అజిత్ అజిత్ కుమార్

    ఉత్తర్‌ప్రదేశ్

    'ఆపరేషన్ ఝాన్సీ' ఎలా జరిగింది? పక్కా ప్లానింగ్ యూపీ పోలీసులు అసద్‌ ఎన్‌కౌంటర్ చేశారా?  తాజా వార్తలు
    యూపీలో మరో సంచలనం: గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌ ఎన్‌కౌంటర్  భారతదేశం
    Explainer: యూపీ మొదటి 'గ్యాంగ్‌స్టర్'; 'అతిక్ అహ్మద్' అరెస్టు, మరణం ఎందుకు సంచలనమయ్యాయి?  ముఖ్యమంత్రి
    మార్చిలోనే గ్యాంగ్‌స్టర్, అతిక్, అష్రఫ్‌ను పోలీసులు చంపేయాలనుకున్నారా?  తాజా వార్తలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025