NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Carcinogenic idli preparation: ఇడ్లీలను ఆవిరి చేయడానికి వాడే ప్లాస్టిక్ పై కర్ణాటక సర్కార్ నిషేధం 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Carcinogenic idli preparation: ఇడ్లీలను ఆవిరి చేయడానికి వాడే ప్లాస్టిక్ పై కర్ణాటక సర్కార్ నిషేధం 
    ఇడ్లీలను ఆవిరి చేయడానికి వాడే ప్లాస్టిక్ పై కర్ణాటక సర్కార్ నిషేధం

    Carcinogenic idli preparation: ఇడ్లీలను ఆవిరి చేయడానికి వాడే ప్లాస్టిక్ పై కర్ణాటక సర్కార్ నిషేధం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 27, 2025
    04:30 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలోని హోటళ్లలో హానికరమైన పదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు గట్టి చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.

    ముఖ్యంగా,ఇడ్లీల తయారీలో పలుచని పాలిథిన్ షీట్ల వినియోగం ఆరోగ్యానికి ప్రమాదకరమని హెచ్చరికలు జారీ చేసింది.

    ఈ అంశంపై సీరియస్‌గా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం,ప్లాస్టిక్ వాడకంపై దర్యాప్తు చేపట్టింది.

    ఆరోగ్యానికి ముప్పు

    పాలిథిన్ షీట్ల వినియోగం ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదాలను కలిగిస్తుందని కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు వెల్లడించారు.

    తక్కువ నాణ్యత కలిగిన ప్లాస్టిక్ పదార్థాలు ఆహారంలో కలిసిపోతే,అది కేన్సర్ సహా ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని ఆయన స్పష్టం చేశారు.

    ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి ఇలాంటి అనారోగ్యకరమైన పద్ధతులను అనుసరిస్తున్న హోటళ్లపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

    వివరాలు 

    హోటళ్లపై తనిఖీలు 

    ఆహార భద్రతా శాఖ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 251 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించగా, బెంగళూరు సహా వివిధ నగరాల్లో 52 హోటళ్లు ఇడ్లీల తయారీలో పలుచని పాలిథిన్ షీట్లు వాడుతున్నట్లు గుర్తించారని గుండూరావు తెలిపారు.

    చాలాకాలంగా ఇడ్లీలను ఆవిరి చేయడానికి కాటన్ బట్టలు ఉపయోగించేవారు.అయితే,కొంతమంది హోటల్ యజమానులు తాజాగా ప్లాస్టిక్ షీట్లను ఉపయోగించడం ప్రారంభించారని ఆయన వెల్లడించారు.

    ఉల్లంఘనలపై కఠిన చర్యలు

    ప్లాస్టిక్ షీట్ల వినియోగంపై ప్రభుత్వం ఇప్పటికే కఠిన చర్యలు చేపట్టిందని,ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి గుండూరావు హామీ ఇచ్చారు.

    ఆరోగ్యాన్నికాపాడే దిశగా,ఆహార తయారీ ప్రక్రియల్లో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించనున్నట్లు స్పష్టం చేశారు.

    ప్రజలు ఇలాంటి ఆరోగ్యానికి హానికరమైన పద్ధతులను గమనిస్తే, తక్షణమే అధికారులకు తెలియజేయాలని కోరారు.

    వివరాలు 

    గతంలో కూడా.. 

    గతంలో గోబీ మంచూరియన్, కాటన్ మిఠాయి వంటి వంటకాల్లో విరివిగా ఉపయోగించే హానికరమైన ఫుడ్ కలరింగ్ ఏజెంట్ రోడమిన్-బిపై కూడా కర్ణాటక ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే.

    ఆహార భద్రతను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటుందని గుండూరావు స్పష్టం చేశారు.

    ''ఇలాంటి హానికరమైన పదార్థాలను ఉపయోగించినవారికి ఏడేళ్ల జైలు శిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష విధించడంతో పాటు రూ.10 లక్షల వరకు జరిమానా కూడా విధిస్తాం'' అని ఆయన హెచ్చరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కర్ణాటక

    తాజా

    Best Electric Scooters : సిటీ డ్రైవింగ్ కోసం బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. లాంగ్ రేంజ్ తో ఖర్చులు తగ్గించుకోండి! ఎలక్ట్రిక్ స్కూటర్
    Ayodhya: అయోధ్యలో మరోసారి ప్రాణప్రతిష్ఠ.. రామ దర్బార్‌తోపాటు మరిన్ని దేవాలయాల ప్రాణ ప్రతిష్ఠ వేడుకలు అయోధ్య
    Heavy rains: తెలంగాణలో రెయిన్ అలర్ట్ జారీ.. ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం భారీ వర్షాలు
    Rana Naidu Season 2: 'రానా నాయుడు' సీజన్‌2 ట్రైలర్ వచ్చేసింది! రానా దగ్గుబాటి

    కర్ణాటక

    Dasara: మైసూరులో తొమ్మిది రోజులపాటు దసరా సంబరాలు.. ఉత్సవాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య  సిద్ధరామయ్య
    Mysuru: మైసూర్ ప్యాలెస్‌లో ప్రారంభమైన దసరా ఉత్సవాలు.. ప్రైవేట్ దర్బార్ నిర్వహించిన యదువీర్ భారతదేశం
    Karnataka: కర్ణాటకలో అదృశ్యమైన వ్యాపారి మృతదేహం గుర్తింపు  బెంగళూరు
    Mysore: మైసూరు దసరా ఉత్సవాల్లో ప్రాచీన సంప్రదాయ పోటీ.. వైభవంగా 'వజ్రముష్టి కళగ' కుస్తీపోటీలు దసరా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025