NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కర్ణాటకలో రేషన్ బియ్యం పంపిణీకి కొరత.. నగదు బదిలీకి కేబినెట్ కీలక నిర్ణయం
    తదుపరి వార్తా కథనం
    కర్ణాటకలో రేషన్ బియ్యం పంపిణీకి కొరత.. నగదు బదిలీకి కేబినెట్ కీలక నిర్ణయం
    నగదు బదిలీకి కేబినెట్ కీలక నిర్ణయం

    కర్ణాటకలో రేషన్ బియ్యం పంపిణీకి కొరత.. నగదు బదిలీకి కేబినెట్ కీలక నిర్ణయం

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 28, 2023
    06:55 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కర్ణాటకలో రేషన్ బియ్యానికి కొరత ఏర్పడింది. ఈ మేరకు అన్నభాగ్య పథకం అమలు చేయడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఫలితంగా కన్నడ సర్కార్ బియ్యానికి బదులు డబ్బులు ఇవ్వాలని నిర్ణయించింది.

    అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ఐదు హామీలను ఇచ్చింది. అందులో ఒకటైన అన్నభాగ్య పథకం అమలుకు బియ్యం కొరత ఏర్పడింది.

    జులై 1 నుంచి ఈ పథకం అమల్లోకి రావాల్సి ఉండగా, ఇందుకు అవసరమైన బియ్యం దొరకలేదు. ఈ నేపథ్యంలోనే సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలోని కేబినెట్ విధానపరమైన నిర్ణయం తీసుకుంది.

    అన్న పథకంలో భాగంగా లబ్దిదారులకు ఉచిత బియ్యానికి బదులుగా డబ్బులిస్తామని పేర్కొంది.కిలో బియ్యానికి రూ.34 చొప్పున 5 కిలోలకు సమానమైన నగదును రేషన్ కార్డుదారులకు బదిలీ చేస్తామని స్పష్టం చేసింది.

    DETAILS

    కార్డులో ఎంత మంది ఉంటే అంతమందికి కలిపి అందిస్తాం: మునియప్ప

    అయితే తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం తరఫున బియ్యం పంపిణీ చేసేందుకు చాలా ప్రయత్నించామని పౌర సరఫరాల శాఖ మంత్రి మునియప్ప తెలిపారు.

    రాష్ట్రానికి కావాల్సిన బియ్యాన్ని సరఫరా అందించేందుకు ఎవరు ముందుకు రాలేదని, ఈ నేపథ్యంలోనే బియ్యం కొరత కారణంగా పథకం అమలును ఆపలేక డబ్బులు ఇవ్వనున్నామన్నారు.

    భారత ఆహార సంస్థ ధరల ప్రకారం కిలో బియ్యం ధర రూ.34గా ఉంది. అయితే బియ్యం సర్దుబాటు అయ్యేవరకు కిలో బియ్యం రూ.34 ధరకే అందిస్తామన్నారు.

    జులై 1 నుంచి నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామన్నారు. ఈ మేరకు ఒక్కో వ్యక్తికి నెలకు రూ.170 వస్తాయన్నారు. సదరు కార్డులో ఎంత మంది ఉంటే అన్ని రూ. 170లను కలిపి అందిస్తామన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కర్ణాటక
    సిద్ధరామయ్య
    కాంగ్రెస్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    కర్ణాటక

    అసెంబ్లీ ఎన్నికలు 2023: కర్ణాటక‌లో రేపే పోలింగ్; ముఖ్యాంశాలు ఇవే అసెంబ్లీ ఎన్నికలు
    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు: కొనసాగుతున్న పోలింగ్; ఓటేసిన ప్రముఖులు అసెంబ్లీ ఎన్నికలు
    కర్ణాటకలో మళ్లీ హంగ్; సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్; ఎగ్జిట్ పోల్స్ అంచనా అసెంబ్లీ ఎన్నికలు
    నేడే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు; 36 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు  అసెంబ్లీ ఎన్నికలు

    సిద్ధరామయ్య

    కర్ణాటక: గృహ వినియోగదారులకు మాత్రమే ఉచిత విద్యుత్; మార్గదర్శకాలు విడుదల  విద్యుత్
    కర్ణాటకలో 'గో హత్య' దుమారం; స్పందించిన సీఎం సిద్ధరామయ్య కర్ణాటక
    సీఎం సిద్దరామయ్యపై శివకుమార్ సంచలన వ్యాఖ్యలు; కర్ణాటక కాంగ్రెస్‌లో దమారం  డీకే శివకుమార్

    కాంగ్రెస్

    కాంగ్రెస్: సిద్ధరామయ్య vs డీకే శివకుమార్‌; కర్ణాటక సీఎం ఎవరు?  కర్ణాటక
    కర్ణాటకలో కాంగ్రెస్ విజయంపై డీకే శివకుమార్ భావోద్వేగం కర్ణాటక
    మిగతా రాష్ట్రాల్లోనూ కర్ణాటక ఫలితాలే పునరావృతం: రాహుల్ గాంధీ  రాహుల్ ద్రావిడ్
    అధికార పార్టీకి మరోసారి షాకిచ్చిన కర్ణాటక ఓటర్లు; 38ఏళ్లుగా ఇదే సంప్రదాయం  కర్ణాటక
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025