NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాట ఘటన.. సీఎం సిద్ధరామయ్య పొలిటికల్‌ సెక్రటరీపై వేటు
    తదుపరి వార్తా కథనం
    Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాట ఘటన.. సీఎం సిద్ధరామయ్య పొలిటికల్‌ సెక్రటరీపై వేటు
    బెంగళూరు తొక్కిసలాట ఘటన.. సీఎం సిద్ధరామయ్య పొలిటికల్‌ సెక్రటరీపై వేటు

    Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాట ఘటన.. సీఎం సిద్ధరామయ్య పొలిటికల్‌ సెక్రటరీపై వేటు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jun 06, 2025
    04:30 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద బుధవారం చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై పోలీసు దర్యాప్తు కొనసాగుతున్న విషయం తెలిసిందే.

    ఈ ఘటనకు సంబంధించి తాజా పరిణామంగా, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజకీయ కార్యదర్శిగా ఉన్న కే. గోవిందరాజన్‌ను పదవి నుంచి తొలగించారు.

    అంతేకాకుండా, రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ హేమంత్ నింబాల్కర్‌తో పాటు మరికొంతమంది ముఖ్య పోలీసు అధికారులను బదిలీ చేసినట్టు సమాచారం అందింది.

    బుధవారం సాయంత్రం జరిగిన ఈ దుర్ఘటనలో 11మంది ప్రాణాలు కోల్పోగా,50మందికి పైగా గాయాలపాలయ్యారు.

    ఈ తొక్కిసలాటకు కారణంగా,పెద్ద సంఖ్యలో ప్రజలను ఒకేసారి లోపలికి అనుమతించడమే అని ప్రత్యక్షసాక్షులు వెల్లడించారు.

    ఈ సంఘటనపై స్పందించిన కర్ణాటక హైకోర్టు ఈ ఘటనను సుమోటోగా పరిగణించి విచారణ జరిపింది.

    వివరాలు 

    బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ సస్పెండ్

    లక్షల మంది అభిమానులు పాల్గొన్న కార్యక్రమ నిర్వహణలో వైఫల్యం ఎవరిదో గుర్తించి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

    ఈ విషాద ఘటనకు సంబంధించి చర్యలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్‌, ఆర్సీబీ ప్రతినిధులను బాధ్యులుగా గుర్తించి, తక్షణమే అరెస్ట్ చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

    అంతేగాక, బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ దయానంద్‌, అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ సీ. బాలకృష్ణ, డిప్యూటీ పోలీస్ కమిషనర్ (సెంట్రల్ డివిజన్) శేఖర్ హెచ్. టెక్కన్నవర్‌, అదనపు పోలీస్ కమిషనర్ వికాస్ కుమార్, కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఏకే గిరీష్‌లను సస్పెండ్ చేస్తూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బెంగళూరు

    తాజా

    Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాట ఘటన.. సీఎం సిద్ధరామయ్య పొలిటికల్‌ సెక్రటరీపై వేటు బెంగళూరు
    Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. నిఫ్టీ @25,000  స్టాక్ మార్కెట్
    Modi in J&K: 'కశ్మీర్‌లో పర్యాటకాన్ని దెబ్బతీయాలని పాక్‌ కుట్రలు' : నరేంద్ర మోదీ నరేంద్ర మోదీ
    Piyush Chawla : 36 ఏళ్ల వ‌య‌సులో.. రిటైర్‌మెంట్ ప్రకటించిన భార‌త క్రికెట‌ర్‌  క్రికెట్

    బెంగళూరు

    Mohammed Shami: బెంగళూరు స్టేడియంలో బ్యాండేజీతోనే బౌలింగ్ ప్రాక్టీస్‌ చేస్తున్నమహ్మద్ షమీ!  మహ్మద్ షమీ
    Bengaluru: బెంగళూరులో కుండపోత వర్షం.. పాఠశాలలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం భారీ వర్షాలు
    Bengaluru Rains: బెంగళూరులో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న భవనం .. శిథిలాల క్రింద 17 మంది కార్మికులు భారతదేశం
    Bengaluru Rains: భారీ వర్షాలతో బెంగళూరు జలమయం భారీ వర్షాలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025