తదుపరి వార్తా కథనం

కర్ణాటక ఎన్నికల ఫలితాలు: ఎమ్మెల్యేందరూ బెంగళూరు చేరుకోవాలని కాంగెస్ పిలుపు
వ్రాసిన వారు
Stalin
May 13, 2023
10:51 am
ఈ వార్తాకథనం ఏంటి
తమ ఎమ్మెల్యేలందరూ శనివారం బెంగళూరుకు చేరుకోవాలని కాంగ్రెస్ పిలుపునిచ్చినట్లు ఏఎన్ఐ నివేదించింది.
కర్ణాటకలో శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రస్తుతం కొనసాగుతోంది. మొత్తం 224 అసెంబ్లీ నియోజకవర్గాలకు 36 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది.
ప్రస్తుతం కాంగ్రెస్ 100పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.
ఈ క్రమంలో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉందన్న ఊహాగానాల నేపథ్యంలో తమ ఎమ్మెల్యేలకు అధిష్ఠానం కీలక ఆదేశాలు జారీ చేసింది.
తమ పార్టీ ఎమ్మెల్యేల కోసం కాంగ్రెస్ పార్టీ బెంగళూరులో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య విక్టరీ సింబల్
#WATCH | Congress leader & former CM Siddaramaiah gives a thumbs up as his party is close to crossing the halfway mark in initial trends in Karnataka pic.twitter.com/rp3B5knUMe
— ANI (@ANI) May 13, 2023