NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / వృద్ధులు, వికలాంగులు ఇంటి నుంచి ఓటు వేయొచ్చు: ఎన్నికల సంఘం
    వృద్ధులు, వికలాంగులు ఇంటి నుంచి ఓటు వేయొచ్చు: ఎన్నికల సంఘం
    భారతదేశం

    వృద్ధులు, వికలాంగులు ఇంటి నుంచి ఓటు వేయొచ్చు: ఎన్నికల సంఘం

    వ్రాసిన వారు Naveen Stalin
    March 11, 2023 | 05:51 pm 0 నిమి చదవండి
    వృద్ధులు, వికలాంగులు ఇంటి నుంచి ఓటు వేయొచ్చు: ఎన్నికల సంఘం
    వృద్ధులు, వికలాంగులు ఇంటి నుంచి ఓటు వేయొచ్చు: ఎన్నికల సంఘం

    కర్నాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శనివారం భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కీలక ప్రకటన చేసారు. 80ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు, వికలాంగులందరికీ ఇంటి నుంచి ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు. 224మంది సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీ పదవీ కాలం మే 24తో ముగియనుంది. కర్ణాటక శాసనసభ పదవీకాలం 2023 మే 24 వరకు ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు నిర్దిష్ట సమయంలోగా ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉందని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. నోటిఫికేషన్ వెలువడిన ఐదు రోజుల్లో ఫారమ్ 12డీ అందుబాటులోకి వస్తుందని, తద్వారా 80 ఏళ్లు పైబడిన లేదా పీడబ్ల్యూడీ ఓటరు ఎవరైనా ఇంటి నుంచే ఓటు వేసే వెసులుబాటు ఉంటుందని రాజీవ్ కుమార్ తెలిపారు.

    ఎన్నికల నిర్వహణపై సమీక్షించేందుకు కర్ణాటకకు వెళ్లిన ఈసీ బృందం

    మొదటిసారిగా కర్ణాటకలో వికలాంగుల(పీడబ్ల్యూడీ) ఓటర్లు, వృద్ధులకు ఇంటినుంచే ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. ఈ పద్ధతి ద్వారా పీడబ్ల్యూడీ ఓటరు ఇంటి నుంచి సులభంగా ఓటు హక్కును వినియోగించుకోవచ్చన్నారు. 2018అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 104సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించగా, కాంగ్రెస్ 78, జేడీ(ఎస్) 37సీట్లు గెలుచుకున్నాయి. ముగ్గురు సభ్యులతో కూడిన భారత ఎన్నికల సంఘం బృందం ఎలక్షన్ల నిర్వహణపై సమీక్షించేందుకు కర్ణాటకలో మూడు రోజుల పర్యటనకు వెళ్లింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు అనుప్ చంద్ర పాండే, అరుణ్ గోయెల్‌ కర్ణాటకలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల సంసిద్ధతను సమీక్షించేందుకు బెంగళూరులో ఉన్నారని ఈసీ ట్వీట్‌లో పేర్కొంది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    ఎన్నికల సంఘం
    కర్ణాటక
    అసెంబ్లీ ఎన్నికలు
    ఓటు

    ఎన్నికల సంఘం

    ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు; ప్యానెల్ ఏర్పాటు సుప్రీంకోర్టు
    అసెంబ్లీ ఎన్నికలు: త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లో కౌంటింగ్ ప్రారంభం; ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా? అసెంబ్లీ ఎన్నికలు
    మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల బరిలో బీఆర్ఎస్; తొలిసారి తెలంగాణ బయట కేసీఆర్ రాజకీయం భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    ఆంధ్రప్రదేశ్: 18మంది ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన వైఎస్సార్సీపీ ఆంధ్రప్రదేశ్

    కర్ణాటక

    హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌తో దేశంలో ఇద్దరు మృతి; రాష్ట్రాలు అలర్ట్ హర్యానా
    బీజేపీ ఎమ్మెల్యే కొడుకు ఇంట్లో రూ.6కోట్లు స్వాధీనం; అరెస్టు చేసిన అధికారులు బీజేపీ
    ప్రియుడి ఘాతుకం: బెంగళూరులో కాకినాడ యువతి దారుణ హత్య బెంగళూరు
    పట్టపగలు, కత్తులతో నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య భారతదేశం

    అసెంబ్లీ ఎన్నికలు

    సర్వేలన్నీ బీఆర్ఎస్‌కే అనుకూలం, డిసెంబర్‌లోనే తెలంగాణలో ఎన్నికలు: సీఎం కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    మేఘాలయలో 45కు చెరిన సంగ్మా బలం; నేడు అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం మేఘాలయ
    ముఖ్యమంత్రి రేసులో ప్రతిమా భౌమిక్; అదే జరిగితే మొదటి మహిళా సీఎంగా రికార్డు త్రిపుర
    మార్చి 7న నాగాలాండ్ సీఎంగా ​​ 'నీఫియు రియో' ప్రమాణస్వీకారం నాగాలాండ్

    ఓటు

    ఆ తేదీ నాటికి 18ఏళ్లు నిండిన వారిని ఓటరు జాబితాలో చేర్చండి: ఎన్నికల సంఘం  ఎన్నికల సంఘం
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023