NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Karnataka: కర్ణాటకలో దారుణం..భార్య ముందే యువతిపై అత్యాచారం.. మతం మారాలని ఒత్తిడి 
    తదుపరి వార్తా కథనం
    Karnataka: కర్ణాటకలో దారుణం..భార్య ముందే యువతిపై అత్యాచారం.. మతం మారాలని ఒత్తిడి 
    కర్ణాటకలో దారుణం..భార్య ముందే యువతిపై అత్యాచారం.. మతం మారాలని ఒత్తిడి

    Karnataka: కర్ణాటకలో దారుణం..భార్య ముందే యువతిపై అత్యాచారం.. మతం మారాలని ఒత్తిడి 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 22, 2024
    08:19 am

    ఈ వార్తాకథనం ఏంటి

    28 ఏళ్ల వివాహితను తన వ్యక్తిగత ఫొటోలతో బ్లాక్ మెయిల్ చేసి ఇస్లాం మతంలోకి మారమని బలవంతం చేసిన ఆరోపణలపై కర్ణాటకలో ఒక జంట సహా ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు ఇండియా టుడే నివేదిక తెలిపింది.

    తన భార్య ఎదుటే ఓ వ్యక్తి తనపై అత్యాచారం చేశాడని, బుర్ఖా ధరించి, నుదుటిపై నుంచి కుంకుం తీసేయమని ఒత్తిడి చేశారని ఆ మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది.

    బాధితురాలి ఫిర్యాదు ప్రకారం,రఫిక్ అనే నిందితుడు మహిళను మోసగించి ఆమెతో లైంగిక కార్యకలాపాలకు పాల్పడ్డాడు.

    అతను ఆమె ఫోటోలను తీసి, బ్లాక్ మెయిల్ చేసాడు. బాధితురాలిని మతాన్ని మారమని కూడా కోరాడని మహిళ ఫిర్యాదులో పేర్కొంది.

    కర్ణాటక 

    బుర్ఖా ధరించి రోజుకు ఐదుసార్లు నమాజ్ చేయాలని బలవంతం

    2023 నుంచి తాము ముగ్గురం కలిసే ఉంటున్నామని బాధితురాలు పేర్కొంది. తాము చెప్పిందల్లా వినాలని ఒత్తిడి చేశారని పేర్కొంది.

    రఫిక్ తన భార్య ఎదుటే తనపై అత్యాచారం చేశాడని మహిళ ఆరోపించింది. నివేదిక ప్రకారం, బెలగావి ఎస్పీ భీమశంకర్ గులేడ మాట్లాడుతూ, రఫిక్ దంపతులు ఆ మహిళను 'కుంకుమ' ధరించవద్దని కోరారని, బుర్ఖా ధరించి రోజుకు ఐదుసార్లు నమాజ్ చేయమని బలవంతం చేశారని తెలిపారు.

    తనపై కులపరమైన వ్యాఖ్యలు చేశారని, వెనుకబడిన కులానికి చెందినందున తప్పక మతం మారాలని నిందితులు చెప్పారని ఆ మహిళ కూడా ఆరోపణలు చేసిందన్నారు.

    ఇస్లాం 

    ఏడుగురిపై సౌందట్టిలో ఎఫ్‌ఐఆర్ నమోదు

    తన భర్తకు విడాకులు ఇవ్వాలని ఆ వ్యక్తి తనపై ఒత్తిడి తెచ్చి బెదిరించాడని మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది.

    తాను ఇస్లాంలోకి మారకుంటే చంపేస్తామని ఆ జంట బెదిరించారని కూడా ఆమె ఆరోపించింది.

    మహిళ ఫిర్యాదు ఆధారంగా ఏడుగురిపై సౌందట్టిలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు నివేదిక పేర్కొంది.

    కర్ణాటక మతస్వేచ్ఛ చట్టం, ఐటీ చట్టం, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు, అత్యాచారం, కిడ్నాప్, బెదిరింపులకు సంబంధించిన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కర్ణాటక
    అత్యాచారం

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    కర్ణాటక

    KTR vs Siddharamaiah: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, కేటీఆర్ మధ్య ట్విట్టర్ వార్ సిద్ధరామయ్య
    Hijab ban row: కర్ణాటకలో నేటి నుంచి హిజాబ్ ధరించొచ్చు.. సిద్ధరామయ్య ప్రభుత్వం ఉత్తర్వులు  సిద్ధరామయ్య
    Karnataka covid guidelines:మాస్క్,వ్యాక్సిన్,ఐసోలేషన్: JN.1 వేరియంట్ పై కర్ణాటక కోవిడ్ మార్గదర్శకాలు కరోనా వేరియంట్
    Karnataka: ముదిరిన కన్నడ భాషా వివాదం..దుకాణాల ఇంగ్లిష్ నేమ్‌ప్లేట్‌లు ధ్వంసం చేసిన నిరసనకారులు  భారతదేశం

    అత్యాచారం

    జోధ్‌పూర్‌లో దారుణం; ప్రియుడి ఎదుటే దళిత బాలికపై సామూహిక అత్యాచారం  రాజస్థాన్
    Manipur video case: మణిపూర్ వీడియో కేసులో మరొకరు అరెస్టు మణిపూర్
    Manipur Violence: మణిపూర్‌లో అదేరోజు 40కి.మీ దూరంలో మరో ఇద్దరు మహిళలపై గ్యాంగ్ రేప్ మణిపూర్
    Kerala: 5ఏళ్ల బాలికను కిడ్నాప్; అత్యాచారం చేసి ఆపై హత్య  కేరళ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025