NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఏ పార్టీకి పిండం పెట్టాలో ప్రజలు నిర్ణయిస్తారు; కాంగ్రెస్‌పై కేసీఆర్ ఫైర్  
    తదుపరి వార్తా కథనం
    ఏ పార్టీకి పిండం పెట్టాలో ప్రజలు నిర్ణయిస్తారు; కాంగ్రెస్‌పై కేసీఆర్ ఫైర్  
    కాంగ్రెస్ పార్టీపై సీఎం కేసీఆర్ ఫైర్..58 ఏళ్ల పోరాటానికి కారణం ఎవరని నిలదీత

    ఏ పార్టీకి పిండం పెట్టాలో ప్రజలు నిర్ణయిస్తారు; కాంగ్రెస్‌పై కేసీఆర్ ఫైర్  

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 06, 2023
    05:34 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కాంగ్రెస్ పార్టీపై సీఎం కేసీఆర్ ఘాటు విమర్శలు చేశారు.ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం ఎందుకు చేయాల్సి వచ్చిందో అసెంబ్లీ వేదికగా వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వక తప్పని పరిస్థితి వచ్చినందుకే ప్రత్యేక రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇచ్చిందన్నారు.

    శాసనసభలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం - సాధించిన ప్రగతిపై స్వల్పకాలిక చర్చ జరిగింది. దీనిపై ప్రసంగించిన సీఎం కేసీఆర్ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ఉద్యమం 58ఏళ్లు సాగడానికి కారణం ఎవరని నిలదీశారు.

    ఉన్న తెలంగాణను ఊడగొట్టింది జవహర్ లాల్ నెహ్రు కాదా అంటూ ప్రశ్నించారు. 1956లో ఇక్కడి ప్రజలు వ్యతిరేకించినా పట్టించుకోకుండా ఆంధ్రలో తెలంగాణను కలిపేశారని మండిపడ్డారు. 1969లో ఎగసిన తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ అణిచేసిందని, ఆ ఉద్యమంలో ఎందరో విద్యార్థుల ప్రాణాలు పోయాయన్నారు.

    DETAILS

    కాంగ్రెస్ నేతలు మంత్రి పదవి రాగానే దుకాణం మూసేస్తారని కేసీఆర్ ఎద్దేవా 

    టీడీపీ హయంలో సభలో తెలంగాణ పదాన్ని వాడొద్దంటే కాంగ్రెస్ పార్టీ మౌనం వహించిందని సీఎం విమర్శించారు. కాంగ్రెస్ నేతలు జై తెలంగాణ అనడం, మంత్రి పదవి రాగానే దుకాణం మూసేశారని చురకలు అంటించారు.

    చంద్రబాబు ప్రభుత్వం హయాంలో విద్యుత్ చార్జీల పెంపు ఉదంతాలను కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ఉమ్మడి ఏపీలో భాగంగా తెలంగాణలో పోలింగ్ పూర్తి కాగానే అప్పటి సీఎం వైఎస్ హైదరాబాద్ వెళ్లాలంటే పాస్‌పోర్టు తీసుకోవాలని అన్నట్లు గుర్తు చేశారు.

    సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సైతం తెలంగాణను చాలాసార్లు అవమానించారని, తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనంటే టీ.కాంగ్రెస్ నేతలు స్పందించలేదన్నారు.

    తనకు పిండం పెడతారని విమర్శలు చేస్తున్నారని, ఎన్నికల్లో ఏ పార్టీకి పిండం పెట్టాలో ప్రజలే నిర్ణయిస్తారని చెప్పుకొచ్చారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    తెలంగాణ

    తాజా

    Stock Market: లాభాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@24,700 స్టాక్ మార్కెట్
    Vijayawada: రూ.850 కోట్లతో విజయవాడ రైల్వే స్టేషన్‌‌కు మహర్దశ.. ఆధునికీకరించేందుకు నీతి ఆయోగ్‌ ఆమోదం విజయవాడ సెంట్రల్
    Kuppam: కుప్పంలో వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులపైకి కారు.. ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపిన గ్రామీణ సీఐ కుప్పం
    Kuldeep Yadav: చిన్న నాటి స్నేహితురాలు వంశికతో కుల్‌దీప్ యాదవ్ నిశ్చితార్థ వేడుక కుల్దీప్ యాదవ్

    కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)

    వైజాగ్ స్టీల్ ప్లాంట్‌‌ను వేలంలో దక్కించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం బిడ్డింగ్ విశాఖపట్టణం
    పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావుపై బీఆర్ఎస్ సస్పెన్షన్‌ వేటు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
    దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా జగన్మోహన్ రెడ్డి; ఏడీఆర్‌ వెల్లడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    125 అడుగుల ఎత్తైన అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్  తెలంగాణ

    తెలంగాణ

    తెలంగాణ: ఆర్టీసీ నుంటి మెట్రో వరకు, క్యాబ్ నుంచి ఆటో వరకు అన్నింటికీ ఒక్కటే కార్డు భారతదేశం
    రాగల 5 రోజులు ఏపీ, తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలన్న ఐఎండీ భారీ వర్షాలు
    అమిత్ షాతో బండి సంజయ్ భేటీ; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై చర్చ  బండి సంజయ్
    తెలంగాణ బీజేపీకి గుడ్ న్యూస్.. మంగళవారం ఇందిరాపార్క్ వద్ద ధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ బీజేపీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025