NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / చివరి నిమిషంలో కవిత ట్విస్ట్; విచారణకు రాలేనంటూ ఈడీకి లేఖ
    తదుపరి వార్తా కథనం
    చివరి నిమిషంలో కవిత ట్విస్ట్; విచారణకు రాలేనంటూ ఈడీకి లేఖ
    విచారణకు రాలేనంటూ ఈడీకి లేఖ రాసిన కవిత

    చివరి నిమిషంలో కవిత ట్విస్ట్; విచారణకు రాలేనంటూ ఈడీకి లేఖ

    వ్రాసిన వారు Stalin
    Mar 16, 2023
    12:26 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీ మద్యం పాలసీ కేసులో మరికొద్ది సేపట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట విచారణకు హాజరు హాజరు కావాల్సిన భారత రాష్ట్ర సమితి నాయకురాలు, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కుమార్తె కవిత ఆఖరి నిమిషంలో ట్విస్ట్ ఇచ్చారు.

    తాను గురువారం విచారణకు హాజరు కాలేనంటూ ఈడీకి లేఖ రాశారు. సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉన్నందున తాను విచారణకు హాజరు కాలేకపోతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. లేఖను ఈ మెయిల్ ద్వారా ఈడీ ఆఫీస్‌కు పంపారు.

    అలాగే తాను అనారోగ్యంగా కూడా ఉన్నట్లు ఆ లేఖలో వివరించారు.

    విచారణకు అవసరమైన డాక్యుమెంట్లను పంపుతానని తన న్యాయవాది ద్వారా పంపుతున్నట్లు లేఖలో కవిత పేర్కొన్నారు.

    కవిత

    మార్చి 24న కవిత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

    దిల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమన్లను సవాల్ చేస్తూ బుధవారం కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మహిళను విచారించడానికి ఈడీ ఆఫీస్‌కు పిలవడంపై కవిత పిటిషన్‌లో అభ్యంతరం వ్యక్తం చేశారు.

    కవిత పిటిషన్‌ను మార్చి 24న విచారించేందుకు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం అంగీకరించింది.

    మద్యం కుంభకోణంలో నిందితుడిగా ఉన్న హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైతో కలిపి కవితను విచారించాలని ఈడీ భావిస్తోందని, అయితే ఈడీ ఆ పని చేయలేదని కవిత తరఫు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కల్వకుంట్ల కవిత
    ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ
    దిల్లీ

    తాజా

    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో.. దుల్కర్ సల్మాన్

    కల్వకుంట్ల కవిత

    దిల్లీ లిక్కర్ కుంభకోణం.. కొత్త ఛార్జ్‌షీట్‌లోనూ కవిత పేరు భారతదేశం
    ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం ప్రయత్నం: ఎమ్మెల్సీ కవిత భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    దిల్లీ లిక్కర్ కేసు: కవిత మాజీ ఆడిటర్‌ను అరెస్టు చేసిన సీబీఐ తెలంగాణ
    దిల్లీ మద్యం కేసు: వ్యాపారవేత్త గౌతమ్ మల్హోత్రాను అరెస్టు చేసిన ఈడీ దిల్లీ

    ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ

    దిల్లీ లిక్కర్ స్కామ్‌: రెండో చార్జ్‌షీట్‌లో దిల్లీ సీఎం కేజ్రీవాల్, కవిత పేర్లు దిల్లీ
    దిల్లీ మద్యం కుభకోణం: సీఎం కేజ్రీవాల్ పర్సనల్ అసిస్టెంట్‌ను ప్రశ్నించిన ఈడీ దిల్లీ
    దిల్లీ మద్యం కుంభకోణం: హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై అరెస్ట్ దిల్లీ
    తీహార్ జైలులో మనీష్ సిసోడియాను ప్రశ్నించిన ఈడీ దిల్లీ

    దిల్లీ

    బీబీసీ ఆఫీసుల్లో 45గంటలుగా కొనసాగుతున్న ఐటీ సోదాలు- మూడు రోజులుగా ఇంటికెళ్లని ఉద్యోగులు బీబీసీ
    దిల్లీ హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్: 2020లో సాహిల్, నిక్కీకి పెళ్లి; మ్యారేజ్ సర్టిఫికెట్ లభ్యం భారతదేశం
    దిల్లీ మద్యం కేసు: మనీష్ సిసోడియాకు మరోసారి సీబీఐ నోటీసులు జారీ ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్
    రెండో టెస్టు: ఆరు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై టీమ్ ఇండియా ఘన విజయం ఆస్ట్రేలియా-భారత్ టెస్టు సిరీస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025