NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Arvind Kejriwal : కేజ్రీవాల్ షుగ‌ర్ లెవెల్స్ పెరిగేలా మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారు: ఈడీ
    తదుపరి వార్తా కథనం
    Arvind Kejriwal : కేజ్రీవాల్ షుగ‌ర్ లెవెల్స్ పెరిగేలా మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారు: ఈడీ
    కేజ్రీవాల్ షుగ‌ర్ లెవెల్స్ పెరిగేలా మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారు: ఈడీ

    Arvind Kejriwal : కేజ్రీవాల్ షుగ‌ర్ లెవెల్స్ పెరిగేలా మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారు: ఈడీ

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 18, 2024
    04:57 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లోని ఆహారమే షుగర్ లెవెల్ పెరగడానికి కారణమని ఈడీ న్యాయవాది రోస్ అవెన్యూ కోర్టులో విచారణ సందర్భంగా వాదించారు.

    జ్యుడీషియల్ కస్టడీ సమయంలో రెగ్యులర్ షుగర్ టెస్టులు చేయాలనే డిమాండ్ పై ఈరోజు కోర్టులో విచారణ జరిగింది.

    ఈసందర్భంగా ఈడీ తరఫున న్యాయవాది జుహైబ్ హుస్సేన్ తన వాదనలు వినిపించారు.

    కేజ్రీవాల్‌కు షుగర్‌ లెవెల్‌ పెరగడానికి కారణం ఆయన ఇంట్లోని ఆహారమేనని ఆయన కోర్టుకు తెలిపారు.

    కేజ్రీవాల్‌కు ఇంటి నుండి తినడానికి బంగాళదుంప-పూరీ,మామిడి,మిఠాయిలు,ఇతర తీపి పదార్థాలు ఇస్తున్నట్లు ఆయన చెప్పారు.

    వాటి వ‌ల్ల బ్ల‌డ్ షుగ‌ర్ పెరిగితే బెయిల్ అడ‌గాల‌నేది కేజ్రీవాల్ ప్లాన్ అని పేర్కొంది.దీంతో కేజ్రీవాల్ డైట్ ఛార్ట్ స‌మ‌ర్పించాల‌ని జైలు అధికారులను న్యాయ‌స్థానం ఆదేశించింది.

    Details 

    శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు విచారణ 

    ఆయన పిటిషన్‌ను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉపసంహరించుకున్నారు.

    ఇప్పుడు తాజాగా సవరణ పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇప్పుడు ఈ కేసులో విచారణ రేపు అంటే శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు జరుగుతుందని కోర్టు తెలిపింది.

    తీహార్‌ జైలులో కేజ్రీవాల్‌

    మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలులో ఉన్నారు.

    తన చక్కెర స్థాయి నిలకడగా లేదని కేజ్రీవాల్ కోర్టులో పిటిషన్ వేశారు.

    ఈ విషయంలో తన రెగ్యులర్ వైద్యుడిని సంప్రదించాలన్నారు. ఆ తర్వాత ఏప్రిల్ 18లోగా సమాధానం ఇవ్వాలని ఈడీని కోర్టు ఆదేశించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అరవింద్ కేజ్రీవాల్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    అరవింద్ కేజ్రీవాల్

    Arvind Kejriwal: 8వ సారి అరవింద్ కేజ్రీవాల్‌కు సమన్లు పంపిన ఈడీ  దిల్లీ
    Arvind Kejriwal: దర్యాప్తు సంస్థ ఫిర్యాదు.. అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ భారతదేశం
    Arvind Kejriwal: మోదీ పేరు ఎత్తితే మీ భర్తలకు భోజనం పెట్టకండి: మహిళలకు కేజ్రీవాల్ విజ్ఞప్తి  దిల్లీ
    CAA: ' సీఏఏపై అబద్ధాలు చెప్పడం ఆపండి'.. కేజ్రీవాల్‌పై బీజేపీ ఎదురుదాడి  దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025