NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Sunitha Kejriwal: జైలు నుంచి కేజ్రీవాల్ సందేశం.. భగత్ సింగ్, అంబేద్కర్ మధ్య ఢిల్లీ సీఎం
    తదుపరి వార్తా కథనం
    Sunitha Kejriwal: జైలు నుంచి కేజ్రీవాల్ సందేశం.. భగత్ సింగ్, అంబేద్కర్ మధ్య ఢిల్లీ సీఎం

    Sunitha Kejriwal: జైలు నుంచి కేజ్రీవాల్ సందేశం.. భగత్ సింగ్, అంబేద్కర్ మధ్య ఢిల్లీ సీఎం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 04, 2024
    02:44 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మద్యం కుంభకోణం కేసులో జైలులో ఉన్నారు.

    అయితే జైలు నుండే ఆయన తన భార్య సునీతా కేజ్రీవాల్ ద్వారా ప్రజలకు, ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలకు తన సందేశాన్ని తెలియజేశారు.

    ఈరోజు సునీతా కేజ్రీవాల్ మీడియా సమావేశం నిర్వహించారు. అందులో అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చిన సందేశాన్ని ప్రజలతో పంచుకున్నారు.

    అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ లైవ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో సునీత కూర్చున్న చోట భగత్ సింగ్, డా.భీంరావ్ అంబేద్కర్ చిత్రాల మధ్య కేజ్రీవాల్ చిత్రాన్ని ఉంచారు.

    ప్రజలకు సందేశం ఇస్తూ, అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ మాట్లాడుతూ, అరవింద్ కేజ్రీవాల్ జైలు నుండి ఎమ్మెల్యేలందరికీ సందేశం పంపారని అన్నారు.

    Details 

    ఢిల్లీ వాసులు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు 

    ఢిల్లీ వాసులు ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు రాకూడదని, ప్రతి ఎమ్మెల్యే ప్రతిరోజూ వారి వారి ప్రాంతానికి వెళ్లి ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే అడగాలని అన్నారు.

    "ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కరించండి, నేను ప్రభుత్వ శాఖల సమస్యలను మాత్రమే పరిష్కరించడం గురించి మాట్లాడడం లేదు, ఇతర ప్రజల సమస్యలను కూడా పరిష్కరించాలి. ఢిల్లీలోని 2 కోట్ల మంది ప్రజలు నా కుటుంబమని, నా కుటుంబంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని, దేవుడు అందరినీ ఆశీర్వదించాలి"అని ఆయన అన్నారు.

    Details 

    ఏప్రిల్ 15 వరకు జైలులోనే ..

    మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను 2 గంటల ప్రశ్నల తర్వాత మార్చి 21న ఈడీ అయన ఇంటి నుండి అరెస్టు చేసింది.

    కోర్టు తీర్పు ప్రకారం ఏప్రిల్ 15 వరకు అరవింద్ కేజ్రీవాల్ జైలులోనే ఉంటారని.. ఆయన కుటుంబ సభ్యులు, ముగ్గురు స్నేహితులను జైలులో కలిసేందుకు అనుమతించారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ప్రెస్ కాన్ఫరెన్స్ లో సునీతా కేజ్రీవాల్ 

    जेल से CM @ArvindKejriwal जी का अपने सभी विधायकों के लिए संदेश। Smt. @KejriwalSunita Addressing an Important Press Conference l LIVE https://t.co/kCINkxUTza

    — AAP (@AamAadmiParty) April 4, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అరవింద్ కేజ్రీవాల్

    తాజా

    Deepfake: డీప్‌ఫేక్,రివెంజ్ పోర్న్‌లపై ట్రంప్ కఠిన నిర్ణయం.. 'టేక్ ఇట్ డౌన్' చట్టానికి ఆమోదం  అమెరికా
    NTR: బ్రహ్మర్షి నుంచి భీమ్‌దాకా... ఎన్టీఆర్‌ స్టార్ హీరోగా ఎదిగిన ప్రయాణమిదీ! జూనియర్ ఎన్టీఆర్
    Jammu Kashmir: పూంచ్‌లో పాకిస్తాన్  లైవ్‌ షెల్‌..ధ్వంసం చేసిన భారత ఆర్మీ  జమ్ముకశ్మీర్
    India-US: భారత్‌,అమెరికా మొదటి దశ వాణిజ్య ఒప్పందంపై త్వరితగతిన అడుగులు  పీయూష్ గోయెల్‌

    అరవింద్ కేజ్రీవాల్

    Arvind Kejriwal: ఎక్సైజ్ పాలసీ కేసు.. కేజ్రీవాల్‌పై దిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం  తాజా వార్తలు
    Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ కోర్టు సమన్లు ​​జారీ  భారతదేశం
    Arvind Kejriwal: పంజాబ్‌లోని అన్ని లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తాం: అరవింద్ కేజ్రీవాల్ ప్రకటన  కాంగ్రెస్
    Ayodhya: అయోధ్యలోని రామాలయంలో అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ పూజలు అయోధ్య
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025