Delhi Excise Policy Case :నోటీసును వెంటనే వెనక్కి తీసుకోండి.. ఈడీకి అరవింద్ కేజ్రీవాల్ లేఖ
మద్యం పాలసీ కేసులో తనకు వచ్చిన సమన్లను వెనక్కి తీసుకోవాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి లేఖ రాశారు. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలోని ED కార్యాలయంలో ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాల్సి ఉండగా, అయన అక్కడికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ED ఇచ్చిన నోటీసు చట్టవిరుద్ధమైనది,రాజకీయ ప్రేరేపితమైనది కేజ్రీవాల్ లేఖలో పేర్కొన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థను "తక్షణమే నోటీసును వెనక్కి తీసుకోవాలని" కోరారు.రాజకీయ ప్రేరేపిత కేసులో కేజ్రీవాల్ను అరెస్టు చేయాలని కేంద్రం భావిస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ఆరోపించింది. ₹ 338 కోట్ల మనీ ట్రయల్పై సిసోడియా బెయిల్ అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించిన తర్వాత AAP నాయకులపై ED మరింత దూకుడు పెంచింది.