Kerala: కేరళ బీజేపీ నేత హత్య.. పీఎఫ్ఐకి చెందిన 15 మందికి మరణశిక్ష
కేరళలోని అలప్పుజాలో స్థానిక బీజేపీ నాయకుడు రంజిత్ శ్రీనివాసన్ను హత్య చేసినందుకు నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకి చెందిన 15 మంది సభ్యులకు మంగళవారం మావెలిక్కర అదనపు జిల్లా సెషన్ కోర్టు-I మరణశిక్ష విధించింది. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి రంజిత్ శ్రీనివాసన్,డిసెంబర్ 19,2021న అతని ఇంటిలోనే దారుణంగా హత్య చేశారు. అంతకుముందు జనవరి 20న మావెలిక్కరలోని అదనపు సెషన్స్ కోర్టు ఈ కేసులో నిందితులందరినీ దోషులుగా నిర్ధారించింది. ప్రాసిక్యూషన్ ప్రకారం,అదే ఏడాది డిసెంబర్ 18న SDPI రాష్ట్ర కార్యదర్శి KSషాన్ ఇంటికి తిరిగి వస్తుండగా ఒక ముఠా చంపేసింది. ఈ హత్యకు ప్రతీకారంగా కొద్ది గంటలలోనే రంజిత్ హత్య జరగడం అప్పట్లో తీవ్ర కలకలం సృష్టించింది.