Kerala Governor: 'కేరళలో గుండా రాజ్'.. సీఎం విజయన్పై గవర్నర్ సంచలన కామెంట్స్
ఈ వార్తాకథనం ఏంటి
కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ముఖ్యమంత్రి పినరయి విజయన్పై విమర్శలు గుప్పించారు. తనను శారీరకంగా దెబ్బతీసేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు.
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా-మార్క్సిస్ట్ (సీపీఎం) విద్యార్థి విభాగం అయిన స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI)కార్యకర్తలు ఆయన వాహనాన్ని అడ్డుకోవడంపై ఆరిఫ్ తీవ్రంగా స్పందించారు.
గవర్నర్ దిల్లీ వెళ్లేందుకు తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటున్న సమయంలో ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు అడ్డుకున్నారు.
ఈ క్రమంలో గవర్నర్ కోపంగా కారు దిగి మీడియాతో మాట్లాడుతూ.. తనను భౌతికంగా గాయపరిచేందుకు ముఖ్యమంత్రి విజయన్ కుట్ర పన్నారని అన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థ కుప్పకూలుతున్నట్లు కనిపిస్తోందన్నారు.
తిరువనంతపురం వీధులను గూండాలు ఆక్రమించారని, ఇక్కడ గూండా రాజ్ నడుస్తోందన్నారు.
గవర్నర్
విబేధిస్తే బౌతిక దాడులకు దిగుతారా?: గవర్నర్
ముఖ్యమంత్రి విజయన్తో తాను ఏదో ఒక విషయంలో విబేధించినందుకు.. ఇలా భౌతిక దాడులకు దిగుతారని అనుకోలేదన్నారు.
నిరసనకారులు తన ముందు నల్లజెండాలు ఊపడమే కాకుండా, తన వాహనంపై ఇరువైపులా దాడి చేశారని గవర్నర్ ఆరోపించారు.
ఈ ఘటనపై రాజ్ భవన్ ఒక ప్రకటనను విడుదల చేసింది.
గవర్నర్కు మూడు చోట్ల నల్ల జెండాలతో నిరసన తెలిపారని పేర్కొంది. ఈ రెండు ప్రాంతాల్లో గవర్నర్ కారును ఢీకొట్టారని వెల్లడించింది.
గవర్నర్ వాహనాన్ని ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ఒకే చోట ఆపారని, ఏడుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉండగా, కాంగ్రెస్, దాని నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి కూటమి కూడా గవర్నర్పై జరిగిన దాడి వెనుక విజయన్ హస్తం ఉందని ఆరోపించారు.